Jammu and Kashmir: జమ్మూకశ్మీర్లో 38 మంది పాక్ ఉగ్రవాదులు..!
జమ్మూకశ్మీర్లో కల్లోలం సృష్టించేందుకు పాక్ ప్రేరేపిత ఉగ్ర సంస్థలు నిరంతరం కుట్రలు పన్నుతూనే ఉన్నాయి. ఇందుకోసం తమ ఉగ్రవాదులను సరిహద్దులు దాటిస్తున్నాయి.
నిఘా వర్గాల సమాచారం.. కశ్మీర్కు అదనపు బలగాలు
శ్రీనగర్: జమ్మూకశ్మీర్లో కల్లోలం సృష్టించేందుకు పాక్ ప్రేరేపిత ఉగ్ర సంస్థలు నిరంతరం కుట్రలు పన్నుతూనే ఉన్నాయి. ఇందుకోసం తమ ఉగ్రవాదులను సరిహద్దులు దాటిస్తున్నాయి. అలా ప్రస్తుతం జమ్మూకశ్మీర్లో కనీసం 38 మంది పాకిస్థానీ ఉగ్రవాదులు ఉన్నట్లు నిఘా వర్గాలు అంచనావేశాయి. ఈ ముష్కరుల కదలికలపై భద్రతాబలగాలు నిఘా పెట్టినట్లు సమాచారం.
కశ్మీర్ లోయలో ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడుతున్న పాకిస్థానీ ఉగ్రవాదుల జాబితాను నిఘా వర్గాలు తయారుచేసినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఆ జాబితా ప్రకారం.. ప్రస్తుతం 38 మంది ఉగ్రవాదులు కశ్మీర్లో ఉన్నారు. వీరిలో 27 మంది లష్కరే తోయిబా ముఠాకు చెందినవారు కాగా.. మిగతా 11 మంది జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థకు చెందినవారని సదరు వర్గాలు పేర్కొన్నాయి. వీరంతా ఉగ్రదాడుల్లో శిక్షణ తీసుకుని భారత్కు వచ్చినట్లు తెలిసింది.
వీరిలో అత్యధికంగా పుల్వామా, బారాముల్లా ప్రాంతాల్లో నక్కినట్లు సమాచారం. ఈ ప్రాంతాల్లో 10 మంది చొప్పున పాక్ ముష్కరులు దాగి ఉండగా.. శ్రీనగర్లో నలుగురు, కుల్గామ్లో ముగ్గురు ఉన్నట్లు నిఘా వర్గాలు అంచనాకొచ్చాయి. మిగిలిన 11 మంది ఇతర ప్రాంతాల్లో ఉండి కార్యకలాపాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. వీరంతా వేర్వేరు ప్రాంతాల్లో ఉండి హైబ్రీడ్ ఉగ్రవాదులను రిక్రూట్ చేసుకుంటున్నారని, వారితో భద్రతా బలగాలపై దాడులకు పాల్పడుతున్నారని నిఘా వర్గాలు పేర్కొన్నాయి.
నిఘా వర్గాల సమాచారంతో జమ్మూకశ్మీర్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఉగ్రదాడులను అరికట్టేందుకు అదనపు బలగాలను మోహరించారు. ఇటీవల కశ్మీర్ లోయలో మైనార్టీలు, వలసదారులపై వరుస దాడులు జరిగిన విషయం తెలిసిందే. దీంతో రంగంలోకి దిగిన ఎన్ఐఏ, ఇంటెలిజెన్స్ బ్యూరో కశ్మీర్ వ్యాప్తంగా విస్తృత తనిఖీలు చేపట్టి ఇప్పటి వరకు 30 మంది ఉగ్రవాదులు, వారి అనుచరులను అరెస్టు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన
రక్షణ శాఖ మాజీ మంత్రి ఏకే ఆంటోనీ (AK Antony)కి కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh)కు ఓ సూచన చేశారు. -
నూతన నావికాదళాధిపతిగా వైస్ అడ్మిరల్ దినేశ్ త్రిపాఠి
Navy Chief: అడ్మిరల్ దినేశ్ కుమార్ త్రిపాఠి త్వరలో భారత నేవీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం ఆయన వైస్ చీఫ్గా వ్యవహరిస్తున్నారు. -
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు (5)
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి
-
మీ ప్రాంతంలో బ్రాడ్బ్యాండ్ సేవలందించే సంస్థలేవో ఎలా తెలుసుకోవాలి?
-
మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్రెడ్డి నామినేషన్.. ర్యాలీలో పాల్గొన్న సీఎం రేవంత్
-
త్వరలో ఫీల్డింగ్కు వస్తా.. 40 ఓవర్లూ మైదానంలో ఉంటా: సూర్య
-
వైకాపా అడ్డుపడుతోంది.. మీ ఇళ్ల వద్దకు రాలేకపోతే మన్నించండి: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM