Long Covid: దీర్ఘకాలిక కొవిడ్లో 200 లక్షణాల గుర్తింపు!
కరోనా సోకిన ప్రతి ఆరుగురిలో ఒకరు దీర్ఘకాలిక కొవిడ్తో బాధపడుతున్నారని గతంలో బ్రిటన్లో జరిగిన అధ్యయనంలో వెల్లడైన సంగతి తెలిసిందే. అయితే తాజాగా అంతర్జాతీయ స్థాయిలో..........
ఇంటర్నెట్ డెస్క్: కరోనా సోకిన ప్రతి ఆరుగురిలో ఒకరు దీర్ఘకాలిక కొవిడ్తో బాధపడుతున్నారని గతంలో బ్రిటన్లో జరిగిన అధ్యయనంలో వెల్లడైన సంగతి తెలిసిందే. అయితే తాజాగా అంతర్జాతీయ స్థాయిలో జరిగిన మరో అధ్యయనంలో దీర్ఘకాలిక కొవిడ్ బారిన పడ్డవారిలో దాదాపు 200 లక్షణాలు ఉంటాయని గుర్తించారు. వారిలో బ్రెయిన్ ఫాగ్ నుంచి మొదలుకుని టిన్నిటస్(చెవిలో మోత) వరకు అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తాయనీ, కొందరిలో చిత్తభ్రమలు, వణుకు కూడా కనిపించాయని కనుగొన్నారు. అంతేకాదు, దీనివల్ల శరీరంలోని పది ముఖ్య వ్యవస్థలు ప్రభావితమయ్యాయి. కనీసం ఆరు నెలల వరకు తీవ్రమైన ఇబ్బందులు రోగులను వెంటాడాయి. జ్ఞాపక శక్తి సమస్యలు, మానసిక అశాంతి,నీరసం, దురద, నెలసరిలో హెచ్చుతగ్గులు, లైంగిక బలహీనత, గుండెదడ, ఆయాసం తదితర సమస్యలు వేధించాయి.
ఆయాసమే కాదు.. చాలా సమస్యలు ఉన్నాయి!
ఈ అధ్యయనంలో పాల్గొన్న యూనివర్సిటీ కాలేజ్ లండన్లోని న్యూరో సైంటిస్ట్ అథెనా అక్రమి మాట్లాడుతూ, ‘‘బ్రిటన్లోని చాలా పోస్ట్ కొవిడ్ క్లినిక్కులు శ్వాసపరమైన సమస్యలపైనే ఎక్కువగా దృష్టి పెట్టాయి. నిజమే, ఎక్కువమందిలో ఆయాసం కనిపిస్తుంది. అయితే దీంతోపాటు ఇంకా చాలా సమస్యలు కూడా ఉన్నాయి. అందువల్ల ఈ క్లినిక్కులు హోలిస్టిక్(సంపూర్ణ) దృష్టితో రోగులను పరిశీలించాలి’’ అన్నారు. కరోనా బారిన పడి 16 నెలలైనా రోగ లక్షణాలతో బాధపడుతున్నవారు కూడా ఉన్నారని ఆమె చెప్పారు. వారికి గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీ, థైరాయిడ్ పరీక్షలు చేయించాల్సి ఉంటుందని చెప్పారు.
‘‘వేలాదిమంది కొవిడ్ బారిన పడ్డ రోగులు పలు రోగాలతో బాధపడుతున్నారు. ఇంకా కొందరికి అసలు ఈ సమస్యలన్నీ కొవిడ్తో ముడిపడినవనే సంగతి కూడా తెలీదు’’ అని అన్నారు. ‘‘లాంగ్ కొవిడ్ లక్షణాలతో బాధపడుతున్నవారికోసం దేశవ్యాప్తంగా ఓ కార్యక్రమాన్ని చేపట్టాలనీ, క్లినిక్కుల నెట్వర్క్ను స్థాపించి, ఎక్కడికక్కడ జనావాసాల్లో డయాగ్నసిస్ చేస్తూ, చికిత్స అందించడం చాలా అవసరం’’ అని ఆమె చెప్పారు.
అధ్యయనం జరిగిందిలా..
ప్రఖ్యాత అంతర్జాతీయ పత్రిక ‘లాన్సెట్’లో తాజా అధ్యయనం ప్రచురితమైంది. ఇందులో 56 దేశాల నుంచి లాంగ్ కొవిడ్తో బాధపడుతున్న 3,672 మందిని పరిశీలించారు. ఆ తర్వాత 203 రోగ లక్షణాలను గుర్తించారు. అందులో 66 లక్షణాలు ఏడు నెలల వరకూ కొనసాగాయని తేలింది. సాధారణంగా చాలామందిలో కనిపించిన సమస్యలు.. నీరసం, నిస్సత్తువ, జ్ఞాపకశక్తి క్షీణించడం, గుండెదడ, మసక దృష్టి, డయేరియా, దద్దుర్లు, మూత్రాశయంపై నియంత్రణ కోల్పోవడం లాంటివి. 2,454 మంది రోగులు ఏడునెలల వరకు 14 శాతం లక్షణాలను తాము చవిచూశామని తెలిపారు. కొంతమందిలో ఈ అనారోగ్య సమస్యలు మరింత పెరిగాయి.
‘‘చాలా మందిలో 9 శారీరక వ్యవస్థల్లో మార్పులు కనిపించాయి. వారికి చికిత్స అందించేందుకు ఈ అధ్యయనం వైద్యులకు తోడ్పడుతుంది. అలాగే కొవిడ్ అనుబంధం సమస్యలపై దృష్టి సారించే పరిశోధకులకు కూడా ఇదెంతో అవసరం’’ అని అథెనా అక్రమి అన్నారు. అలాగే ఈ సర్వేలో పాల్గొన్న 22 శాతం మంది రోగులు కొవిడ్ సోకిన తర్వాత తమకు పని చేసేందుకు చేతకాకపోవడంతో ఉద్యోగాలను కోల్పోవడమో, దీర్ఘకాలిక సెలవులు తీసుకోవడమో జరిగిందని చెప్పారు. మరో 45 శాతం మంది తమకు అంతకు ముందులా పని చేసేందుకు సాధ్యం కాకపోవడంతో తక్కువ పనిని తీసుకున్నామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు (5)
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు
-
నడుం నొప్పి, కుంగుబాటు, తలనొప్పి.. అనారోగ్యానికి ప్రధాన కారణాలివే
-
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. డిఫెన్స్ చీఫ్తో పాటు 9 మంది అధికారులు మృతి
-
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు