Australia Murder: ఆ ఆస్ట్రేలియా యువతి హత్య వెనక అసలు కారణమదే..!
రాజ్విందర్ సింగ్ ఆస్ట్రేలియా యువతిని హత్య చేయడానికి గల కారణాలను పోలీసులు వెల్లడించారు. క్షణికావేశమే ఈ ఘటనకు కారణంగా కనిపిస్తోంది.
దిల్లీ: నాలుగేళ్ల క్రితం ఆస్ట్రేలియాలో ఓ యువతిని హత్య చేసి భారత్లో తలదాచుకుంటున్న నిందితుడు రాజ్విందర్ సింగ్ను దిల్లీ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అసలు ఆ యువతిని హత్య చేయడానికి గల కారణాలను దర్యాప్తు బృందం వెల్లడించింది.
తన భార్యతో గొడవపడి నిందితుడు రాజ్విందర్ సింగ్(38) క్వీన్స్లాండ్లోని వాంగెట్టి బీచ్కు వెళ్లాడు. ఆ సమయంలో వెంట కొన్ని పండ్లు, కూరగాయల కత్తిని తీసుకెళ్లాడు. అదే సమయంలో మృతురాలు తొయా కార్డింగ్లే ఆ బీచ్లో వాకింగ్ చేస్తున్నారు. అప్పుడు తన వెంట పెంపుడు శునకం కూడా ఉంది. అయితే అది సింగ్ వైపు చూసి మొరిగింది. అది నచ్చని అతడు యువతితో గొడవకు దిగాడు. తర్వాత ఘర్షణ తీవ్రం కావడంతో ఆగ్రహానికి గురైన సింగ్ ఆమెపై దాడిచేసి, చంపేశాడని పోలీసుల విచారణలో వెల్లడైంది. ఆ తర్వాత ఆమెను అక్కడి ఇసుకలో పాతిపెట్టి, కుక్కను అక్కడి చెట్టుకు కట్టేసి ఘటనా స్థలం నుంచి పారిపోయాడు. పంజాబ్కు చెందిన సింగ్ నర్సింగ్ అసిస్టెంట్. కార్డింగ్లే ఫార్మసీ ఉద్యోగిని. 2018, అక్టోబర్ 21న కనిపించకుండాపోయారు. తర్వాత రోజు వాంగెట్టి బీచ్లో ఆమె మృతదేహం దొరికింది.
ఈ హత్య జరిగిన రెండు రోజుల తర్వాత సింగ్ తన ఉద్యోగం, భార్య, ముగ్గురు పిల్లల్ని వదిలేసి భారత్కు వచ్చేశాడు. అతడి ఆచూకీ కోసం ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీసు జారీచేసింది. అతడి అప్పగింతకు భారత్ నుంచి ఆమోదం లభించడంతో పటియాలా కోర్టు నవంబర్ 21న నాన్బెయిల్ వారెంట్ను జారీ చేసింది. ఇంతకుముందు క్వీన్స్లాండ్ పోలీసులు.. రాజ్విందర్ ఆచూకీ తెలిపిన వారికి మిలియన్ డాలర్లు (రూ.8.17 కోట్లు) బహుమతిగా ఇస్తామని ప్రకటించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దుస్తుల్లేని చిన్ననాటి ఫొటోపై అభ్యంతరం.. అకౌంట్ను నిలిపివేసిన గూగుల్
చిన్నప్పటి ఫొటోను డ్రైవ్లోకి అప్లోడ్ చేసిన వ్యక్తికి గూగుల్ షాకిచ్చింది. అతడి అకౌంట్ను నిలిపివేసింది. దీనిపై ఏడాదిగా గూగుల్తో పోరాడుతున్నా ఫలితం లేకపోవడంతో బాధితుడు గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. -
ఎన్నికల బాండ్ల సమాచారమంతా వెల్లడించాల్సిందే
ఎన్నికల బాండ్ల అంశంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) అనుసరిస్తున్న వైఖరిపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎంపిక చేసుకున్న సమాచారాన్ని మాత్రమే ఇవ్వాలన్న ధోరణిని బ్యాంక్ విడనాడాలని, మొత్తం వివరాలు ఈ నెల 21లోపు బహిర్గతం చేయాలని ఆదేశించింది. -
పశ్చిమ బెంగాల్ డీజీపీపై వేటు
సార్వత్రిక ఎన్నికల వేళ కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) సంచలన నిర్ణయం తీసుకుంది. పశ్చిమ బెంగాల్ డీజీపీతోపాటు 6 రాష్ట్రాల హోంశాఖ కార్యదర్శులను తప్పించింది. వారితోపాటు రెండు రాష్ట్రాల్లో సాధారణ పరిపాలనశాఖ కార్యదర్శులను బదిలీ చేసింది. -
సర్కార్ సొమ్ము కోసం అన్నాచెల్లెళ్ల పెళ్లి
ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన సీఎం సామూహిక వివాహ పథకం ద్వారా వచ్చే ప్రయోజనాలను పొందేందుకు అన్నాచెల్లెళ్లు పెళ్లి చేసుకున్నారు. మహారాజ్గంజ్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. -
ఆజం ఖాన్కు ఏడేళ్ల జైలుశిక్ష
ఉత్తర్ప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ నేత ఆజం ఖాన్కు స్థానిక కోర్డు ఏడేళ్ల జైలుశిక్షను విధించింది. 2016లో దుంగార్పుర్లో ఒక ఇంటిని బలవంతంగా కూల్చివేసిన కేసులో ఈ శిక్షను ఖరారు చేసింది. -
‘సామాజిక’ ప్రచారం
ప్రపంచంలోనే అతి పెద్ద ఎన్నికల ప్రక్రియకు దేశం సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే ఓటర్లను ఆకర్షించేందుకు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రయత్నాలను ప్రారంభించాయి. ఇందులో భాగంగా వాట్సప్, సామాజిక మాధ్యమాలు, ఇన్ఫ్లుయెన్సర్లకు గిరాకీ పెరిగింది. -
వేడెక్కుతున్న ఉత్తర భారతం
ఉత్తర భారతంలో 1970 నుంచి శీతాకాలం క్రమంగా ఎండా కాలంగా మారిపోతోందని అమెరికన్ శాస్త్రజ్ఞుల బృందం క్లైమేట్ సెంట్రల్ హెచ్చరించింది. ఈ బృందం 1970 నుంచి డిసెంబరు-ఫిబ్రవరి కాలంలో ఉత్తర భారత్లో ఉష్ణోగ్రతల తీరుతెన్నులను విశ్లేషించింది. -
స్నేహమంటే అదే కదా.. నేవీ ఆపరేషన్పై జై శంకర్ స్పందన
సోమాలియా సముద్రపు దొంగల చేతిలో హైజాక్కు గురైన ఓ వాణిజ్య ఓడను భారత నౌకాదళం కాపాడిన విషయం తెలిసిందే. దాంతో మన రక్షణ సిబ్బంది చేసిన ఆపరేషన్పై బల్గేరియా నుంచి కృతజ్ఞతలు వ్యక్తమయ్యాయి. -
మమ్మల్ని దర్యాప్తు సంస్థలా మార్చకండి
గుజరాత్ యూనివర్సిటీలో గత వారాంతంలో విదేశీ విద్యార్థులపై చోటు చేసుకున్న దాడిని సుమోటోగా స్వీకరించాలంటూ ఓ న్యాయవాది దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని(పిల్) ఆ రాష్ట్ర హైకోర్టు సోమవారం తిరస్కరించింది. -
పోలీసు కాల్పుల్లో ఉపాధ్యాయుడి మృతి
ఉత్తర్ప్రదేశ్లోని ముజఫర్నగర్లో చిన్నపాటి ఘర్షణ కారణంగా హెడ్ కానిస్టేబుల్ కాల్పులు జరపడంతో ఓ ఉపాధ్యాయుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన సివిల్ లైన్స్ ప్రాంతంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. -
హిమాచల్ప్రదేశ్ కాంగ్రెస్ రెబల్స్కు సుప్రీంకోర్టులో దక్కని ఊరట
కాంగ్రెస్ పార్టీ విప్ను ధిక్కరించి ఎమ్మెల్యే పదవికి అనర్హులైన ఆరుగురు రెబల్స్కు సర్వోన్నత న్యాయస్థానంలో ఊరట లభించలేదు. -
వివక్షతో ఉద్యోగాలు నిరాకరించొద్దు
ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో పనిచేసే ట్రాన్స్జెండర్లపై వివక్ష ఉండకూడదని, వారికి సమాన అవకాశాలు కల్పించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. -
వ్యక్తిగత హోదాలోనే విరాళాలిచ్చాను
ప్రముఖ ఔషధ తయారీ సంస్థ బయోకాన్ లిమిటెడ్.. ఏ పార్టీకీ ఎన్నికల బాండ్ల ద్వారా విరాళాలివ్వలేదని ఆ సంస్థ ఛైర్పర్సన్ కిరణ్ మజుందార్ షా సోమవారం వెల్లడించారు. -
ఈడీ సమన్లను లెక్కచేయని కేజ్రీవాల్
నగదు అక్రమ చలామణి కేసులో ప్రశ్నలకు జవాబివ్వడానికి సోమవారం రావాలంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జారీచేసిన సమన్లను దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ లెక్కచేయలేదు. -
సాంక్రమికేతర వ్యాధులను పెంచుతున్న ఆహారపుటలవాట్లు
భారతీయుల ఆహారంలో మితిమీరిన ఉప్పు వినియోగం, సరిపడా పొటాషియం లేకపోవడం వంటి ఆందోళనకర పోకడలు పెరుగుతున్నాయని తాజా పరిశోధన తేల్చింది. -
భారత నౌకాదళం భేష్: అమెరికా రక్షణ మంత్రి ప్రశంస
హిందూ మహాసాగరంలో సముద్రపు దొంగల ఆటకట్టించే ఆపరేషన్ల నిర్వహణలో భారత నౌకాదళ పాత్రను అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ కొనియాడారు. శుక్రవారం భారత నౌకాదళం నడి సముద్రంలో సాహసోపేత ఆపరేషన్ నిర్వహించి.. -
సంక్షిప్త వార్తలు
కబేళాలు, మాంసం ప్రాసెసింగ్ యూనిట్లను ‘పర్యావరణ ప్రభావ మదింపు(ఈఐఏ)-2006’ పరిధిలోకి చేర్చాల్సిన అవసరం లేదని జాతీయ హరిత ట్రైబ్యునల్(ఎన్జీటీ)కు కేంద్ర ప్రభుత్వం సూచించింది. -
Indian Navy: కొచ్చిలో కుప్పకూలిన నిఘా ఎయిర్క్రాఫ్ట్
భారత నేవీకి చెందిన రిమోట్లీ పైలెటెడ్ ఎయిర్క్రాఫ్ట్ (RPA) కొచ్చిలోని ఐఎన్ఎస్ గరుడ బేస్ వద్ద కూలిపోయింది. -
Bengaluru: రోజుకు 50 కోట్ల లీటర్ల నీటి కొరత.. బెంగళూరు కష్టాలపై కర్ణాటక సీఎం
బెంగళూరులో రోజుకు 2600 ఎంఎల్డీ (మిలియన్ లీటర్స్ పర్ డే) నీటి అవసరం ఉండగా.. దాదాపు 500 ఎంఎల్డీ కొరత ఉందని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య వెల్లడించారు. -
Kolkata: భవనం కుప్పకూలిన ఘటనలో తొమ్మిదికి చేరిన మృతులు
కోల్కతాలో భవనం కుప్పకూలిన ఘటనలో 9 మంది మృతి చెందారు. 17 మందికి గాయాలు అయ్యాయి.