Iran: ‘ఐదో ముప్పు’తో ఆంక్షల్లోకి ఇరాన్!
ఏడాదికాలంగా కరోనా వైరస్కు వణికిపోతోన్న ఇరాన్లో ఐదు ముప్పు (Fifth Wave) పొంచివుందన్న నివేదికల నేపథ్యంలో ఈ చర్యలు తప్పవని అక్కడి ప్రభుత్వం వెల్లడించింది.
డెల్టా వేరియంట్ భయంతో మరోసారి ఆంక్షలు
తెహ్రాన్: కొత్తగా వెలుగు చూసిన డెల్టా వేరియంట్తో ప్రపంచ దేశాలు మరోసారి ఆందోళనకు గురవుతున్నాయి. తాజాగా ఇరాన్లోనూ ఈ వేరియంట్ కేసులు బయటపడ్డాయి. దీంతో అప్రమత్తమైన ఇరాన్, దాదాపు అన్ని నగరాల్లో మరోసారి ఆంక్షలు విధించింది. ముఖ్యంగా ఏడాది కాలంగా కరోనా వైరస్కు వణికిపోతోన్న ఇరాన్లో ఐదో ముప్పు (Fifth Wave) పొంచి ఉందన్న నివేదికల నేపథ్యంలో ఈ చర్యలు తప్పవని అక్కడి ప్రభుత్వం వెల్లడించింది.
డెల్టా రకంతో ఐదో ముప్పు..?
గడిచిన ఏడాది కాలంలో నాలుగు సార్లు కరోనా వైరస్ విజృంభించడంతో ఇరాన్ వణికిపోయింది. ఇప్పటివరకూ అక్కడ 32లక్షల కరోనా పాజిటివ్ కేసులు బయటపడగా దాదాపు 85వేల మంది మృత్యువాతపడ్డారు. ఈ మధ్య కాలంలో వైరస్ ఉద్ధృతి కాస్త తగ్గినట్లు కనిపించడంతో కొవిడ్ ఆంక్షలను సడలించారు. ఇదే సమయంలో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న డెల్టా వేరియంట్ కేసులు వెలుగు చూశాయి. గడిచిన రెండు వారాల్లోనే కేసుల సంఖ్య భారీగా పెరగడం కనిపించింది. దీంతో దేశంలో ‘ఐదో ముప్పు (Fifth Wave)’కు డెల్టా వేరియంట్ కారణమయ్యే ప్రమాదముందని ఇరాన్ అధ్యక్షుడు హస్సాన్ రౌహాని ఆందోళన వ్యక్తం చేశారు. గత రెండు వారాల నుంచి పెరుగుతున్న కేసుల సంఖ్యను చూస్తే అలాగే కనిపిస్తోందన్నారు. ఈ నేపథ్యంలో వైరస్ కట్టడికి మరోసారి ఆంక్షలు విధించడం తప్పనిసరి అని స్పష్టంచేశారు.
275 పట్టణాల్లో ఆంక్షలు..
పక్షం రోజుల్లోనే రోజువారి కేసులు రెట్టింపు కావడంతో అప్రమత్తమైన ఇరాన్ ప్రభుత్వం, వైరస్ ఉద్ధృతి అధికంగా ఉన్న నగరాల మధ్య ప్రయాణాలపై ఆంక్షలు విధించింది. దాదాపు 275 పట్టణాల్లో అత్యవసరం కాని వాణిజ్య, వ్యాపార కార్యకలాపాలను మూసివేయాలని ఆదేశించింది. మాల్స్, పార్కులు, రెస్టారెంట్లు, సెలూన్లు, బుక్స్టోర్లను రెడ్ జోన్లుగా ప్రకటించింది. ఐదో ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో వైరస్ వ్యాప్తి కట్టడికి ఇలాంటి చర్యలు తప్పవని స్పష్టం చేసింది.
2శాతం మందికే వ్యాక్సిన్..
ఓ వైపు వైరస్ తీవ్రత పెరుగుతున్న సమయంలోనే.. ఇరాన్లో వ్యాక్సిన్ పంపిణీ మందకొడిగానే సాగుతోంది. ఇప్పటివరకూ అక్కడ 63లక్షల డోసులను అందించినట్లు ఇరాన్ ప్రభుత్వం పేర్కొంది. దాదాపు 8.4కోట్ల జనాభా కలిగిన ఇరాన్లో కేవలం 2శాతం కంటే తక్కువ మందికి మాత్రమే రెండు డోసులను అందించారు. వ్యాక్సిన్ల కోసం ఇరాన్ ‘కొవాక్స్’ కార్యక్రమంపై ఆధారపడంతో పాటు చైనాకు చెందిన సినోఫార్మ్, రష్యాకు చెందిన స్పుత్నిక్ వ్యాక్సిన్లను దిగుమతి చేసుకుంటోంది. అయితే, అమెరికా, బ్రిటన్ నుంచి వ్యాక్సిన్ను దిగుమతి చేసుకోవడాన్ని ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమైనీ వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే స్థానికంగా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ (COVIran Barakat)కు అక్కడి ప్రభుత్వం అత్యవసర వినియోగ అనుమతులు ఇచ్చింది. దీంతో దేశీయ వ్యాక్సిన్పై అక్కడి ప్రజలకు విశ్వాసం కలిగించడంలో భాగంగా ఇరాన్ సుప్రీం లీడర్ మీడియా సమక్షంలోనే వ్యాక్సిన్ తీసుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘అగ్నివీర్’లో మార్పులకు సిద్ధం: రాజ్నాథ్
ప్రస్తుతం అమలవుతున్న అగ్నివీర్/అగ్నిపథ్ నియామక పథకంలో అవసరమైతే మార్పులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. -
టికెట్ రాలేదని ఆత్మహత్యాయత్నం చేసిన ఎంపీ కన్నుమూత
ఎన్నికల ముంగిట తమిళనాడులో విషాదం చోటుచేసుకుంది. టికెట్ దక్కలేదనే మనస్తాపంతో ఈ నెల 24న ఆత్మహత్యాయత్నం చేసిన ఈరోడ్ ఎంపీ, ఎండీఎంకే సీనియర్ నేత ఎ.గణేశమూర్తి(77) కోయంబత్తూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం చనిపోయారు. -
తేజస్ ఎంకే1ఏ తొలి విహారం విజయవంతం
తేజస్ ఎంకే1ఏ శ్రేణిలో రూపొందిన యుద్ధ విమానం ఎల్ఏ-5003 తన తొలి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. పూర్తిస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) ఈ యుద్ధ విమానాన్ని రూపొందించింది. -
ఐరాస సెక్రటరీ జనరల్ ప్రత్యేక ప్రతినిధిగా కమల్ కిశోర్
జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(ఎన్డీఎంఏ) ఉన్నతాధికారి కమల్ కిశోర్ (55).. ఐక్యరాజ్యసమితి(ఐరాస) సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ప్రత్యేక ప్రతినిధిగా నియమితులయ్యారు. -
గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో ఆస్పత్రిలో మృతి
ఉత్తర్ప్రదేశ్ జైలులో శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్స్టర్, రాజకీయవేత్త ముఖ్తార్ అన్సారీ (63) గురువారం గుండెపోటుతో మృతిచెందినట్లు బాందాలోని రాణీ దుర్గావతి వైద్య కళాశాల ప్రిన్సిపల్ సునీల్ కౌశల్ ప్రకటించారు. -
‘కాలివేళ్లతో’ విధిరాత లిఖించుకున్న అపరబ్రహ్మ
సంకల్పబలం ఉంటే లక్ష్య సాధనకు ఏ వైకల్యమూ అడ్డుకాదని నిరూపిస్తున్నారు ఉత్తరాఖండ్కు చెందిన 58 ఏళ్ల దేవ్కీనందన్ శర్మ. -
ఎలాంటి తప్పూ జరగలేదు
నేషనల్ ఏవియేషన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్ఏసీఐఎల్) విమానాల లీజు అంశంలో ఎలాంటి అవకతవకలు జరగలేదని సీబీఐ పేర్కొంది. -
ఈస్టర్ రోజున పనిదినం.. వెనక్కు తగ్గిన మణిపుర్ ప్రభుత్వం
ఈస్టర్ రోజును పనిదినంగా ప్రకటిస్తూ మణిపుర్ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను గురువారం వెనక్కు తీసుకుంది. -
కేజ్రీవాల్ పాస్వర్డులు చెప్పలేదు
మద్యం విధానానికి సంబంధించిన కేసులో అరెస్టయిన దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ 4 డిజిటల్ పరికరాల పాస్వర్డులను చెప్పలేదని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తెలిపింది. -
మరోసారి తండ్రైన పంజాబ్ సీఎం మాన్
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్(50) మరోసారి తండ్రయ్యారు. ఆయన సతీమణి గుర్ప్రీత్ కౌర్ గురువారం పండంటి పాపకు జన్మనిచ్చారు. -
మేం జోక్యం చేసుకోలేం
మద్యం విధానానికి సంబంధించిన కేసులో అరెస్టయిన ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ను సీఎం పదవి నుంచి తప్పించాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) దిల్లీ హైకోర్టు గురువారం కొట్టివేసింది. -
ఐరాస శాంతి పరిరక్షకుల నేరాలపై డేటాబేస్ ప్రారంభించిన భారత్
ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షకులపై నమోదైన నేరాల నిక్షిప్తానికి, సదరు నిందితుల విచారణలో పురోగతిని పర్యవేక్షించడానికి భారతదేశం కొత్త డేటాబేస్ను రూపొందించిందని ఐరాస భారత ప్రతినిధి రుచిరా కాంబోజ్ గురువారం తెలిపారు. -
నెట్ మార్కుల ఆధారంగా పీహెచ్డీ ప్రవేశాలు: యూజీసీ
వచ్చే విద్యా సంవత్సరం నుంచీ జాతీయ అర్హత పరీక్ష (ఎన్ఈటీ) మార్కుల ఆధారంగా పీహెచ్డీ ప్రవేశాలు కల్పించనున్నట్లు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) తెలిపింది. -
అండర్ గ్రాడ్యుయేట్ ప్రవేశాలకు కామన్ కౌన్సెలింగుకు యోచన!
మెడికల్, ఇంజినీరింగ్ కోర్సుల తరహాలో సీయూఈటీ (కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్) మార్కుల ఆధారంగా అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల ప్రవేశాలకు కామన్ కౌన్సెలింగు నిర్వహించాలని యూజీసీ యోచిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. -
గురుద్వారా కర్ సేవా చీఫ్పై కాల్పులు
ఉత్తరాఖండ్లోని ఉధాంసింగ్ నగర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. నానక్మత్తా సాహిబ్ గురుద్వారాకు చెందిన డేరా కర్ సేవా చీఫ్ బాబా తర్సేమ్ సింగ్ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. -
కస్టోడియల్ మృతి కేసుల్లో.. పోలీసులకు బెయిల్ విషయంలో కఠినంగా వ్యవహరించాలి: సుప్రీం
కస్టోడియల్ మరణాల కేసులో పోలీసు అధికారులకు బెయిలిచ్చే విషయంలో న్యాయస్థానాలు కఠినంగా వ్యవహరించాలని సుప్రీంకోర్టు పేర్కొంది. -
నా భర్త అనుమానాస్పద మృతిపై దర్యాప్తు జరగాలి: సీతా సోరెన్
ఝార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) అధినేత శిబు సోరెన్ కుటుంబానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన పెద్ద కోడలైన సీత తన భర్త దుర్గా సోరెన్ అనుమానాస్పద మరణంపై ఉన్నతస్థాయి దర్యాప్తు జరగాలని గురువారం డిమాండ్ చేశారు. -
సంక్షిప్త వార్తలు (10)
మాజీ ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్కు 1996 నాటి డ్రగ్స్ కేసులో గురువారం గుజరాత్లోని బనాస్కాంఠా జిల్లా కోర్టు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. -
స్కైరూట్ ఏరోస్పేస్ రాకెట్ స్టేజ్-2 పరీక్ష విజయవంతం
హైదరాబాద్కు చెందిన స్టార్టప్ సంస్థ స్కైరూట్ ఏరోస్పేస్ బుధవారం నిర్వహించిన రాకెట్ స్టేజ్-2 పరీక్ష విజయవంతమైంది. -
4 వాంగ్మూలాలతో సీఎం అరెస్టా?
ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)ని అణచివేసేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ప్రయత్నిస్తోందని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. -
నిరంతర ప్రేరణ శక్తి.. స్వామి స్మరణానంద
రామకృష్ణమఠం, రామకృష్ణ మిషన్లకు 16వ అధిపతిగా ఉన్న స్వామి స్మరణానంద కన్నుమూత తనను నిర్ఘాంతపరిచిందని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
పాపాల పెద్దిరెడ్డికి దళితులంటే ఎందుకంత చులకన?
-
భయపెడుతున్న భువన్.. శివారు మున్సిపాలిటీల్లో ఆస్తిపన్ను నాలుగైదు రెట్లు పెంపు
-
నకిలీ కరెన్సీ నోట్లతో దొరికిన వైకాపా నేత బంధువు
-
రేటింగుల పేరుతో మోసం కేసులో రూ.32 కోట్ల జప్తు
-
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
-
కన్నారా.. ఇది విన్నారా?