
Cyber Attack: సైబర్ దాడి.. ఆ దేశమంతా నిలిచిపోయిన పెట్రోల్ పంపిణీ
టెహ్రాన్: ఇరాన్పై మంగళవారం సైబర్దాడి జరిగింది. దీని కారణంగా దేశవ్యాప్తంగా గ్యాస్ స్టేషన్లలో ఇంధన పంపిణీ వ్యవస్థ నిలిచిపోయినట్లు అధికారిక మీడియా ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ బ్రాడ్కాస్టింగ్(ఐఆర్ఐబీ) వెల్లడించింది. ఈ సైబర్ దాడి కారణంగా రాయితీ పెట్రోల్ విక్రయాలకు అంతరాయం ఏర్పడిందని, దీంతో దేశవ్యాప్తంగా గ్యాస్ స్టేషన్ల వద్ద జనాలు భారీ ఎత్తున బారులు తీరారని పేర్కొంది. ‘సైబర్ అటాక్ కారణంగా కొన్ని గంటలుగా గ్యాస్ స్టేషన్లలో ఇంధనం నింపే వ్యవస్థలో అంతరాయం ఏర్పడింది. సాంకేతిక నిపుణులు సమస్యను పరిష్కరించేందుకు యత్నిస్తున్నారు. త్వరలో పరిస్థితులు సాధారణానికి చేరుకుంటాయి’ అని తెలిపింది.
‘అప్రమత్తంగానే ఉన్నాం’
ఇంధన ధరల పెరుగుదలను వ్యతిరేకిస్తూ.. 2019 నవంబర్లో ఇరాన్ పౌరులు పెద్దఎత్తున నిరసనలకు దిగారు. ఆ సందర్భంలో భద్రతా దళాలు వందల మందిని హతమర్చాయని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ ఘటనకు మరికొద్ది రోజుల్లో రెండేళ్లు పూర్తికానున్న తరుణంలో తాజాగా ఈ అంతరాయం కలగడం స్థానికంగా చర్చనీయాంశమైంది. అయితే.. ఆన్లైన్ దాడుల విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉన్నామని ఇరాన్ పేర్కొంది. గతంలోనూ ఈ దేశంలో సైబర్ దాడులు జరిగాయి. అమెరికా, ఇతర పాశ్చాత్య శక్తులే తమ నెట్వర్క్లకు అంతరాయం కలిగించడానికి యత్నిస్తున్నాయని ఇరాన్ ఆరోపించింది. జులైలోనూ రవాణా మంత్రిత్వ శాఖ వెబ్సైట్ మాయం కాగ, అధికారిక మీడియా దాన్ని సైబర్ అంతరాయంగా పేర్కొంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Hyderabad: దోషం ఉంది.. శాంతి చేయాలని ₹37 లక్షలు స్వాహా
-
Technology News
HTC Smartphone: హెచ్టీసీ నుంచి తొలి మెటావర్స్ ఫోన్
-
Sports News
IND vs ENG : కనీసం రెండు సెషన్లు ఆడలేకపోయారా..? భారత ప్రదర్శనపై రవిశాస్త్రి తీవ్ర అసంతృప్తి
-
Politics News
T Congress: విష్ణువర్ధన్రెడ్డి ఇంట్లో లంచ్.. వస్తామని ముఖం చాటేసిన కాంగ్రెస్ సీనియర్లు!
-
Business News
Services PMI: ధరలు పెరిగినా.. సేవలకు డిమాండ్ తగ్గలే
-
Technology News
Location Tracking:యాప్స్ మీ లొకేషన్ను ట్రాక్ చేస్తున్నాయని అనుమానమా..? ఇలా చేయండి!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Upasana: ‘ఉపాసన.. పిల్లలెప్పుడు’.. అని అడుగుతున్నారు.. సద్గురు సమాధానం
- IND vs ENG : మొత్తం మారిపోయింది
- Raghurama: రఘురామ ఇంట్లోకి ప్రవేశించే యత్నంలో దొరికిపోయిన ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్!
- Double BedRooms: అమ్మకానికి.. రెండు పడక గదుల ఇళ్లు!
- Vishal: ఫైట్ సీన్స్ చేస్తుండగా కుప్పకూలిన హీరో విశాల్
- China’s real estate crisis: పుచ్చకాయలకు ఇళ్లు.. సంక్షోభంలో చైనా రియల్ ఎస్టేట్ ..!
- Emirates: గాల్లో విమానానికి రంధ్రం.. అలాగే 14 గంటల ప్రయాణం!
- Hyderabad News: సాఫ్ట్వేర్ ఇంజినీర్ హత్యకు రూ.4.50 లక్షల సుపారీ!
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (05/07/22)
- Hyderabad News: రోజూ ‘బయోమెట్రిక్’ వేసి వెళ్తే నెలకు రూ. 15 వేలు!