
Iran: అమెరికా అనుకుంటే ఒప్పందం కుదురుతుంది..!
ఇంటర్నెట్డెస్క్: పీ5+1 దేశాలతో అణుఒప్పందం కోసం వియన్నాలో జరుగుతున్న చర్చలపై ఇరాన్ స్పందించింది. చిత్తశుద్ధి ఉంటే ఈ ఒప్పందం అసాధ్యమేమీ కాదని పేర్కొంది. అమెరికా గతంలో ఈ ఒప్పందానికి తూట్లు పొడించిందని విమర్శించింది. చర్చల్లో చాలా ప్రతిపాదనలు తామే చేసినట్లు ఇరాన్ తెలిపింది. ఈ విషయాన్ని ఇరాన్ విదేశాంగశాఖ ప్రతినిధి సయిద్ ఖాతిబ్జాదే పేర్కొన్నారు. ‘‘ఒప్పందం సాధ్యమని ఇప్పటికీ భావిస్తున్నాం. ట్రంప్ విఫల చరిత్రను వదిలించుకోవాలని అమెరికా భావించాలి. ఇరాన్ ఇంకెప్పుడు దీనిపై చర్చలు జరపదు’’ అని ఆయన ట్విటర్లో పేర్కొన్నారు.
పీ5+1 దేశాలతో 2015లో కుదుర్చుకొన్న ఒప్పందాన్ని పునరుద్ధరించేందుకు ఇరాన్ ప్రయత్నాలు చేస్తోంది. ఈ ఒప్పందం నుంచి 2018లో అమెరికా వైదొలగింది. ప్రస్తుతం జరుగుతున్న చర్చల్లో కొన్ని అడ్డంకులు తొలగాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. ‘పర్యవేక్షణ ఒప్పందం’ రద్దుకావడంతో దానిపై చర్చలు ఓ కొలిక్కి రావడంలేదు. అణు ఒప్పందం కుదిరితే ఇరాన్పై అంతర్జాతీయ ఆంక్షలు తొలగే అవకాశం ఉంది. ఈ చర్చలు ఏప్రిల్లో మొదలయ్యాయి. తొలుత ఇవి జులై నాటి ముగిసే అవకాశం ఉందని భావించినా.. పరిస్థితులు చూస్తుంటే మరింతకాలం కొనసాగే అవకాశం ఉంది.
ఇవీ చదవండి
Advertisement