4th Wave: భారత్లో కొత్త వేవ్ వస్తుందా..? ప్రభావం ఎలా ఉండనుంది?
భారీస్థాయిలో వ్యాక్సినేషన్ పూర్తికావడం, ఇప్పటికే చాలామంది వైరస్కు గురికావడం వల్ల రోగనిరోధకత పెరగడం వంటి అంశాల కారణంగా భారత్పై కొత్త వేవ్ తీవ్రప్రభావం చూపెట్టక పోవచ్చని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.
కొత్త వేరియంట్లపై నిపుణులు ఏమంటున్నారంటే
దిల్లీ: ప్రపంచవ్యాప్తంగా కొవిడ్-19 వ్యాప్తి అదుపులోనే ఉన్నప్పటికీ పూర్తిగా ముప్పు మాత్రం ఇంకా ముగిసిపోలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచ దేశాలను హెచ్చరిస్తోంది. ఇదే సమయంలో యూరప్తోపాటు దక్షిణాసియాలో కొవిడ్ కేసులు పెరుగుతున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. భారత్లో ఒకవేళ కొత్త వేవ్ రూపంలో వైరస్ మళ్లీ విరుచుకుపడితే ప్రభావం ఏవిధంగా ఉంటుందనే విషయంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అయితే, మనదేశంలో భారీస్థాయిలో వ్యాక్సినేషన్ పూర్తికావడం, ఇప్పటికే చాలామంది వైరస్కు గురికావడం వల్ల రోగనిరోధకత పెరగడం వంటి అంశాల కారణంగా భారత్పై కొత్త వేవ్ తీవ్రప్రభావం చూపెట్టక పోవచ్చని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో మాస్కును తప్పనిసరిగా ధరించాలనే నిబంధనను కూడా సడలించవచ్చని ప్రభుత్వానికి సూచిస్తున్నారు.
1000 మ్యుటేషన్లు.. అయినప్పటికీ..
దేశంలో కొవిడ్ విస్తృతి తగ్గుతున్నప్పటికీ భవిష్యత్తులో వైరస్లో మ్యుటేషన్లు సంభవిస్తాయని కొవాగ్జిన్ ప్రయోగాల నిర్వహణలో కీలకపాత్ర వహించిన డాక్టర్ సంజయ్ రాయ్ పేర్కొన్నారు. అయితే, ఇప్పటివరకు 1000 మ్యుటేషన్లు జరిగినప్పటికీ వాటిలో కేవలం ఐదు మాత్రమే ఆందోళనకరమైనవని గుర్తుచేశారు. ఇక సహజంగా ఇన్ఫెక్షన్కు గురికావడం వల్ల పొందిన రక్షణ ఉత్తమమైనది కావడంతోపాటు ఎక్కువ కాలం రక్షణ ఇస్తుందన్నారు. వీటికితోడు భారీ స్థాయిలో వ్యాక్సిన్ అందించడం వల్ల భవిష్యత్తులో వచ్చే వేవ్ల ప్రభావం తీవ్రంగా ఉండకపోవచ్చని ఎయిమ్స్ వైద్య నిపుణులైన డాక్టర్ రాయ్ స్పష్టం చేశారు. ఇటువంటి సమయంలో మాస్క్ తప్పనిసరి నిబంధననను సడలించే విషయాన్ని ప్రభుత్వం పరిశీలించవచ్చన్న ఆయన.. వృద్ధులు, ముప్పు ఎక్కువగా ఉన్నవారు మాత్రం మాస్క్ ధరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వీటితోపాటు భవిష్యత్తులో కొత్త వేరియంట్లను పసిగట్టేందుకు జీనోమ్ సీక్వెన్సింగ్తో పర్యవేక్షిస్తూనే ఉండాలన్నారు.
హైబ్రిడ్ ఇమ్యూనిటీతో..
దేశంలో కొత్త వేరియంట్ వచ్చినా ప్రభావం మాత్రం తక్కువగానే ఉండనున్నట్లు ప్రముఖ ఎపిడమాలజిస్ట్ డాక్టర్ చంద్రకాంత్ లహారియా పేర్కొన్నారు. ‘సీరోసర్వేలు, వ్యాక్సినేషన్ కవరేజ్, ఒమిక్రాన్ వ్యాప్తి ఫలితాలను విశ్లేషిస్తే.. దేశంలో ప్రస్తుతానికి కొవిడ్ మహమ్మారి ముప్పు ముగిసినట్లే. మరికొన్ని నెలల్లో కొత్త వేరియంట్ పుట్టుకొచ్చినా ప్రభావం మాత్రం తక్కువే. ఎందుకంటే, మూడు వేవ్ల తర్వాత హైబ్రిడ్ (వైరస్కు గురికావడం, వ్యాక్సిన్, వైరస్ సోకాల్సిన వారిసంఖ్య తక్కువగా ఉండడం వల్ల) ఇమ్యూనిటీ సాధించారు. యాంటీబాడీ స్థాయిలు తగ్గినప్పటికీ హైబ్రిడ్ ఇమ్యూనిటీ రక్షణ కల్పిస్తుంది. ఇటువంటి సమయంలో కేసుల కన్నా అవి కలిగించే ప్రభావాలే వైరస్ తీవ్రతను అంచనా వేసేందుకు అతి ముఖ్యమైన అంశాలు’ అని డాక్టర్ లహారియా వెల్లడించారు. ఈ నేపథ్యంలో విదేశాల్లో వైరస్ తీరును ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ వ్యాక్సిన్ పంపిణీ ముమ్మరంగా కొనసాగించాలన్న ఆయన.. ఇది కొవిడ్తో కలిసి జీవించేందుకు సిద్ధంగా ఉండే సమయమన్నారు. ఇదే సమయంలో మెజారిటీ ప్రజలకు మాస్క్ తప్పనిసరిగా అవసరం లేదని అభిప్రాయపడ్డారు.
అయినప్పటికీ.. నిర్లక్ష్యం వద్దు
దేశంలో ఇప్పటికే 80 నుంచి 90శాతం ప్రజలు వైరస్ బారినపడ్డారని.. కొత్తవేవ్ వచ్చినప్పటికీ తీవ్ర లక్షణాలు ఉండకపోవచ్చని సఫ్దార్గంజ్ ఆస్పత్రికి చెందిన ప్రజారోగ్య వైద్య నిపుణులు డాక్టర్ గుజాల్ కిశోర్ వెల్లడించారు. విస్తృత వ్యాక్సినేషన్ వల్ల దేశంలో తీవ్ర ప్రభావం చూపే కొత్త వేవ్ వచ్చే అవకాశాలు తక్కువనే కొవిడ్ వర్కింగ్ గ్రూప్ చీఫ్ డాక్టర్ ఎన్కే అరోఢా ఇటీవల పేర్కొన్నారు. అయినప్పటికీ కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చే ప్రమాదం ఉన్నందున నిర్లక్ష్యం వహించకూడదని స్పష్టం చేశారు. ప్రస్తుతం పలు ప్రాంతాల్లో విజృంభణకు ఒమిక్రాన్తోపాటు దాని ఉపరకాలే కారణమని చెప్పిన ఆయన.. విదేశాల్లో నమోదవుతున్న కొవిడ్ మరణాల్లో ఎక్కువ భాగం వ్యాక్సిన్ తీసుకోని వారిలోనని స్పష్టం చేశారు. ఈ తరుణంలో మూడో డోసు తీసుకోవాల్సిన వారితోపాటు 12 నుంచి 18ఏళ్ల పిల్లలూ వ్యాక్సిన్ తప్పక తీసుకోవాలని డాక్టర్ అరోఢా సూచించారు.
జీనోమ్ సీక్వెన్సింగ్తో పర్యవేక్షణ
దేశంలో కొత్త వేరియంట్ల ప్రభావాన్ని అంచనా వేసేందుకు ఇన్సాకాగ్కు నమూనాలను ఎప్పటికప్పుడు పంపించాలని కేంద్ర ఆరోగ్యశాఖ రాష్ట్రాలకు సూచించింది. వైరస్ విస్తృతిపై ఇటీవల ఉన్నత స్థాయి సమీక్ష జరిపిన కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ.. జీనోమ్ సీక్వెన్సింగ్ను విస్తృతంగా నిర్వహించాలని రాష్ట్రాలకు స్పష్టం చేశారు. ఇదిలాఉంటే, భారత్లో రోజువారీ కొవిడ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. దేశవ్యాప్తంగా ఆదివారం కేవలం 1761 కేసులు నమోదుకాగా 127 మరణాలు చోటుచేసుకున్నాయి. గడిచిన 688 రోజుల్లో ఈ స్థాయిలో తక్కువ కేసులు నమోదుకావడం ఇదే తొలిసారి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రధాని మోదీ, బిల్గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
Modi-Bill Gates: ప్రధాని మోదీతో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్గేట్స్ ‘చాయ్ పే చర్చ’లో పాల్గొన్నారు. డిజిటల్ విప్లవం, ఆరోగ్యం, విద్య తదితర అంశాలపై ఇరువురు చర్చించారు. -
‘అగ్నివీర్’లో మార్పులకు సిద్ధం: రాజ్నాథ్
ప్రస్తుతం అమలవుతున్న అగ్నివీర్/అగ్నిపథ్ నియామక పథకంలో అవసరమైతే మార్పులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. -
టికెట్ రాలేదని ఆత్మహత్యాయత్నం చేసిన ఎంపీ కన్నుమూత
ఎన్నికల ముంగిట తమిళనాడులో విషాదం చోటుచేసుకుంది. టికెట్ దక్కలేదనే మనస్తాపంతో ఈ నెల 24న ఆత్మహత్యాయత్నం చేసిన ఈరోడ్ ఎంపీ, ఎండీఎంకే సీనియర్ నేత ఎ.గణేశమూర్తి(77) కోయంబత్తూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం చనిపోయారు. -
తేజస్ ఎంకే1ఏ తొలి విహారం విజయవంతం
తేజస్ ఎంకే1ఏ శ్రేణిలో రూపొందిన యుద్ధ విమానం ఎల్ఏ-5003 తన తొలి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. పూర్తిస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) ఈ యుద్ధ విమానాన్ని రూపొందించింది. -
ఐరాస సెక్రటరీ జనరల్ ప్రత్యేక ప్రతినిధిగా కమల్ కిశోర్
జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(ఎన్డీఎంఏ) ఉన్నతాధికారి కమల్ కిశోర్ (55).. ఐక్యరాజ్యసమితి(ఐరాస) సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ప్రత్యేక ప్రతినిధిగా నియమితులయ్యారు. -
గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో ఆస్పత్రిలో మృతి
ఉత్తర్ప్రదేశ్ జైలులో శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్స్టర్, రాజకీయవేత్త ముఖ్తార్ అన్సారీ (63) గురువారం గుండెపోటుతో మృతిచెందినట్లు బాందాలోని రాణీ దుర్గావతి వైద్య కళాశాల ప్రిన్సిపల్ సునీల్ కౌశల్ ప్రకటించారు. -
‘కాలివేళ్లతో’ విధిరాత లిఖించుకున్న అపరబ్రహ్మ
సంకల్పబలం ఉంటే లక్ష్య సాధనకు ఏ వైకల్యమూ అడ్డుకాదని నిరూపిస్తున్నారు ఉత్తరాఖండ్కు చెందిన 58 ఏళ్ల దేవ్కీనందన్ శర్మ. -
ఎలాంటి తప్పూ జరగలేదు
నేషనల్ ఏవియేషన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్ఏసీఐఎల్) విమానాల లీజు అంశంలో ఎలాంటి అవకతవకలు జరగలేదని సీబీఐ పేర్కొంది. -
ఈస్టర్ రోజున పనిదినం.. వెనక్కు తగ్గిన మణిపుర్ ప్రభుత్వం
ఈస్టర్ రోజును పనిదినంగా ప్రకటిస్తూ మణిపుర్ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను గురువారం వెనక్కు తీసుకుంది. -
కేజ్రీవాల్ పాస్వర్డులు చెప్పలేదు
మద్యం విధానానికి సంబంధించిన కేసులో అరెస్టయిన దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ 4 డిజిటల్ పరికరాల పాస్వర్డులను చెప్పలేదని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తెలిపింది. -
మరోసారి తండ్రైన పంజాబ్ సీఎం మాన్
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్(50) మరోసారి తండ్రయ్యారు. ఆయన సతీమణి గుర్ప్రీత్ కౌర్ గురువారం పండంటి పాపకు జన్మనిచ్చారు. -
మేం జోక్యం చేసుకోలేం
మద్యం విధానానికి సంబంధించిన కేసులో అరెస్టయిన ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ను సీఎం పదవి నుంచి తప్పించాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) దిల్లీ హైకోర్టు గురువారం కొట్టివేసింది. -
ఐరాస శాంతి పరిరక్షకుల నేరాలపై డేటాబేస్ ప్రారంభించిన భారత్
ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షకులపై నమోదైన నేరాల నిక్షిప్తానికి, సదరు నిందితుల విచారణలో పురోగతిని పర్యవేక్షించడానికి భారతదేశం కొత్త డేటాబేస్ను రూపొందించిందని ఐరాస భారత ప్రతినిధి రుచిరా కాంబోజ్ గురువారం తెలిపారు. -
నెట్ మార్కుల ఆధారంగా పీహెచ్డీ ప్రవేశాలు: యూజీసీ
వచ్చే విద్యా సంవత్సరం నుంచీ జాతీయ అర్హత పరీక్ష (ఎన్ఈటీ) మార్కుల ఆధారంగా పీహెచ్డీ ప్రవేశాలు కల్పించనున్నట్లు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) తెలిపింది. -
అండర్ గ్రాడ్యుయేట్ ప్రవేశాలకు కామన్ కౌన్సెలింగుకు యోచన!
మెడికల్, ఇంజినీరింగ్ కోర్సుల తరహాలో సీయూఈటీ (కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్) మార్కుల ఆధారంగా అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల ప్రవేశాలకు కామన్ కౌన్సెలింగు నిర్వహించాలని యూజీసీ యోచిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. -
గురుద్వారా కర్ సేవా చీఫ్పై కాల్పులు
ఉత్తరాఖండ్లోని ఉధాంసింగ్ నగర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. నానక్మత్తా సాహిబ్ గురుద్వారాకు చెందిన డేరా కర్ సేవా చీఫ్ బాబా తర్సేమ్ సింగ్ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. -
కస్టోడియల్ మృతి కేసుల్లో.. పోలీసులకు బెయిల్ విషయంలో కఠినంగా వ్యవహరించాలి: సుప్రీం
కస్టోడియల్ మరణాల కేసులో పోలీసు అధికారులకు బెయిలిచ్చే విషయంలో న్యాయస్థానాలు కఠినంగా వ్యవహరించాలని సుప్రీంకోర్టు పేర్కొంది. -
నా భర్త అనుమానాస్పద మృతిపై దర్యాప్తు జరగాలి: సీతా సోరెన్
ఝార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) అధినేత శిబు సోరెన్ కుటుంబానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన పెద్ద కోడలైన సీత తన భర్త దుర్గా సోరెన్ అనుమానాస్పద మరణంపై ఉన్నతస్థాయి దర్యాప్తు జరగాలని గురువారం డిమాండ్ చేశారు. -
సంక్షిప్త వార్తలు (10)
మాజీ ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్కు 1996 నాటి డ్రగ్స్ కేసులో గురువారం గుజరాత్లోని బనాస్కాంఠా జిల్లా కోర్టు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. -
స్కైరూట్ ఏరోస్పేస్ రాకెట్ స్టేజ్-2 పరీక్ష విజయవంతం
హైదరాబాద్కు చెందిన స్టార్టప్ సంస్థ స్కైరూట్ ఏరోస్పేస్ బుధవారం నిర్వహించిన రాకెట్ స్టేజ్-2 పరీక్ష విజయవంతమైంది. -
4 వాంగ్మూలాలతో సీఎం అరెస్టా?
ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)ని అణచివేసేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ప్రయత్నిస్తోందని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ దేవరకొండను పార్టీ అడిగిన రష్మిక.. ఎందుకంటే..?
-
ప్రధాని మోదీ, బిల్గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
-
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
-
నిన్న అమెరికా, నేడు ఐరాస.. భారత అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యలు!
-
మేనల్లుడికి అత్యున్నతాధికారి నజరానా!
-
ముఖ్యమంత్రితో ముఖాముఖిలో వాలంటీరు