Mumbai: అంబానీ-పీరామల్‌ వారసులకు అపూర్వ స్వాగతం

ఈశా అంబానీ దంపతులు తమ చిన్నారులతో ముంబయిలో అడుగుపెట్టారు. నవంబరు 19న ఇద్దరు కవలలకు జన్మనిచ్చిన ఈశా.. తన భర్త ఆనంద్‌ పీరామల్‌తో కలిసి అమెరికా నుంచి ముంబయి వచ్చారు.

Updated : 24 Dec 2022 17:02 IST

ముంబయి: రిలయన్స్‌ సంస్థల అధినేత ముకేశ్‌ అంబానీ (Mukesh Ambani) కుమార్తె ఈశా అంబానీ (Isha Ambani), ఆనంద్ పీరామల్‌ (Ananda piramal) దంపతులు తమ చిన్నారులతో ముంబయి (Mumbai)లో అడుగుపెట్టారు. వారికి అంబానీ, పీరామల్‌ కుటుంబ సభ్యులు అపూర్వ స్వాగతం పలికారు. ఈశా అంబానీ గత నెలలో ఇద్దరు కవలలకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. చిన్నారుల రాక సందర్భంగా ముకేశ్‌ అంబానీ సతీసమేతంగా వర్లిలోని ఈశా దంపతుల నివాసానికి వెళ్లి స్వాగతం పలికారు. ఆయన వెంట కుమారులు అనంత్‌ అంబానీ, ఆకాశ్‌ అంబానీ కూడా ఉన్నారు. ఒక చిన్నారిని ఈశా అంబానీ ఎత్తుకోగా..మరో శిశువును అమ్మమ్మ నీతా అంబానీ ఎత్తుకున్న వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

ఈశా అంబానీ, ఆనంద్‌ పీరామల్‌ దంపతులకు నవంబరు 19న కవలలు జన్మించిన సంగతి తెలిసిందే. వారికి ఆద్య, కృష్ణ అని పేర్లు పెట్టారు. తల్లీపిల్లలంతా క్షేమంగా ఉన్నట్లు అంబానీ కుటుంబం అప్పట్లో ప్రకటన విడుదల చేసింది. డెలివరీ కోసం అమెరికా వెళ్లిన ఈశా తాజాగా స్వదేశానికి చేరుకున్నారు. దీంతో ఆ కుటుంబ సభ్యుల ఆనందానికి అవధుల్లేవు. ఇరుకుటుంబాల సభ్యులు తమ వారసులకు అపూర్వ స్వాగతం పలికారు. దీనికి సంబంధించిన వీడియోను వి. భయానీ అనే ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్టు చేయడంతో వైరల్‌గా మారాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని