Terrorism: ‘ఐసిస్’ ముప్పు కాదు.. కానీ, తలనొప్పి వ్యవహారం!
అఫ్గాన్కు ఐసిస్ ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉందనే వాదనను కొట్టిపారేస్తూ.. వారిని త్వరలోనే అణచివేస్తామని తాలిబన్లు పేర్కొన్నారు. ఐసిస్ను అఫ్గానిస్థాన్కు ముప్పుగా పరిగణించడం లేదు.. కానీ, అదొక తలనొప్పిలా మారిందని తాలిబన్ల ప్రతినిధి, మంత్రి జబిహుల్లా...
అఫ్గాన్ మంత్రి జబిహుల్లా ముజాహిద్
కాబుల్: అఫ్గాన్కు ఐసిస్ ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉందనే వాదనను కొట్టిపారేస్తూ.. వారిని త్వరలోనే అణచివేస్తామని తాలిబన్లు పేర్కొన్నారు. ఐసిస్ను అఫ్గానిస్థాన్కు ముప్పుగా పరిగణించడం లేదు.. కానీ, అదొక తలనొప్పిలా మారిందని తాలిబన్ల ప్రతినిధి, మంత్రి జబిహుల్లా ముజాహిద్ పేర్కొన్నట్లు ఓ వార్త సంస్థ వెల్లడించింది. ‘ఐసిస్.. దేశంలో కొన్ని చోట్ల చేసే పనులు తలనొప్పిగా మారాయి. కానీ.. ఆయా ఘటనలు జరిగిన వెంటనే వారిని తరిమికొట్టాం. వారి స్థావరాలూ కనుగొన్నాం’ అని ముజాహిద్ వివరించారు. ఈ క్రమంలోనే తాలిబన్లు ఇటీవల కాబుల్ శివారులో ఐసిస్- ఖొరసాన్కు చెందిన ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చినట్లు సమాచారం. వారి రహస్య స్థావరాలను ధ్వంసం చేసేందుకూ ముమ్మర ఆపరేషన్లు నిర్వహిస్తున్నట్లు స్థానిక వార్తాసంస్థలు తెలిపాయి.
‘ఇప్పటికిప్పుడు ముప్పు లేదు’
ఇటీవల కాబుల్లోని ఈద్గా మసీదు వద్ద ఆత్మాహుతి దాడి జరిగిన విషయం తెలిసిందే. జబిహుల్లా ముజాహిద్ తల్లి సంస్మరణ కార్యక్రమానికి హాజరైన తాలిబన్లు, పౌరులే లక్ష్యంగా జరిపిన ఈ దాడిలో పది మందికి పైగా మరణించగా, 20 మందికి పైగా గాయపడినట్లు సమాచారం. అఫ్గాన్ నుంచి అమెరికా బలగాలు వైదొలిగాక నగరంలో జరిగిన మొదటి ప్రధాన ఉగ్రదాడి ఇదే. ఈ ఘటన అనంతరం తాలిబన్లు.. ఐసిస్ ఉగ్రవాదుల ఏరివేత మొదలుపెట్టారు. మరోవైపు అఫ్గాన్ భూభాగంపై ఉగ్రవాద కార్యకలాపాల విషయమై గత నెలలో అమెరికా జాయింట్ చీఫ్స్ ఛైర్మన్ జనరల్ మార్క్ మిల్లీ కీలక వ్యాఖ్యలు చేశారు. రానున్న ఆరు నుంచి 36 నెలల్లో అఫ్గాన్లో అల్ ఖైదా, ఐసిస్ మళ్లీ బలపడేందుకు అవకాశం ఉందని చెప్పారు. కానీ, ఇప్పటికిప్పుడు వారి నుంచి ఉగ్ర ముప్పు 9/11 దాడుల ఘటన కంటే తక్కువేనని వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దిల్లీ హైకోర్టులోనూ కాంగ్రెస్కు ఎదురుదెబ్బ
ఆదాయపు పన్ను అంశంలో కాంగ్రెస్ పార్టీకి మళ్లీ ఎదురుదెబ్బ తగిలింది. 2017 నుంచి 2021 మధ్య కాలానికి ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం చేపట్టిన పునఃపరిశీలన ప్రక్రియను నిలిపివేయాలంటూ ఆ పార్టీ దాఖలు చేసిన పిటిషన్లను గురువారం దిల్లీ హైకోర్టు కొట్టివేసింది. -
‘అగ్నివీర్’లో మార్పులకు సిద్ధం: రాజ్నాథ్
ప్రస్తుతం అమలవుతున్న అగ్నివీర్/అగ్నిపథ్ నియామక పథకంలో అవసరమైతే మార్పులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. -
దేశం అప్పు రూ.160 లక్షల కోట్లు
కేంద్ర ప్రభుత్వ అప్పులు గత డిసెంబరు నాటికి రూ.160.69 లక్షల కోట్లకు చేరాయి. గత సెప్టెంబరు నాటికి రూ.157.84 లక్షల కోట్లు ఉన్న అప్పులు డిసెంబరు నాటికి మరింత పెరిగాయి. -
ఉపాధిహామీ వేతనాల సవరణ
ఉపాధిహామీ పథకం కింద చెల్లించే వేతనాలను కేంద్ర ప్రభుత్వం సవరించింది. రాష్ట్రాలవారీగా 4 నుంచి 10 శాతం మేర ఇవి పెరిగాయి. -
ఈడీ విచారణకు మహువా గైర్హాజరు
విదేశీ మారక నిర్వహణ చట్టం (ఫెమా) ఉల్లంఘన కేసులో దిల్లీలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యాలయంలో గురువారం నాటి విచారణకు తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలు మహువా మొయిత్రా గైర్హాజరయ్యారు. -
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
గ్యాంగ్స్టర్ నుంచి రాజకీయ నాయకుడిగా ఎదిగిన ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి చెందారు.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్