Pegasus: హ్యాకింగ్‌ వ్యహారంపై దర్యాప్తు చేపట్టిన ఇజ్రాయెల్‌

భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న పెగసస్ హ్యాకింగ్ వ్యవహారంపై

Published : 30 Jul 2021 23:55 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న పెగసస్ హ్యాకింగ్ వ్యవహారంపై ఇజ్రాయెల్ దర్యాప్తు ప్రారంభించింది. పెగసస్ స్పైవేర్‌ను రూపొందించిన ఎన్‌ఎస్‌ఓ గ్రూప్‌నకు చెందిన కార్యాలయాల్లో ఇజ్రాయెల్‌కు చెందిన వివిధ దర్యాప్తు సంస్ధలు సోదాలు నిర్వహించాయి. ఇజ్రాయెల్ రక్షణ శాఖకు చెందిన ఎగుమతుల నియంత్రణ విభాగం, జాతీయ భద్రతా మండలికి చెందిన సిబ్బంది ఈ సోదాల్లో పాల్గొన్నారు. ఎగుమతుల నియంత్రణ విభాగం ఇచ్చిన అనుమతుల మేరకు ఎన్‌ఎస్‌ఓ గ్రూప్ పని చేసిందా లేదా అన్న అంశంపై ప్రధానంగా దర్యాప్తు సాగుతోంది. 

ఇజ్రాయిల్‌కు చెందిన ఎన్‌ఎస్‌ఓ గ్రూప్‌ పెగాసస్‌ స్పైవేర్‌ను ఉగ్రవాదం, నేరాల కట్టడి కోసం విదేశాలకు ఎగుమతి చేసేందుకు ఆ దేశ ప్రభుత్వం నుంచి అనుమతి పొందింది. భారత్‌ సహా వివిధ దేశాల్లోని రాజకీయ నాయకులు, పాత్రికేయులు, న్యాయమూర్తులపై పెగాసస్‌ సాఫ్ట్‌వేర్‌ ద్వారా ఫోన్ల హ్యాకింగ్‌ జరిగిందని ఇటీవల ది వైర్‌ వెబ్‌సైట్‌ వెల్లడింది. ఈ ఆరోపణల పరిశీలనకు ఇజ్రాయెల్‌ ప్రభుత్వం గతవారమే ఒక కమిటీని ఏర్పాటు చేసింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని