Isro: మరికొద్ది గంటల్లో ఆకాశంలో ఉత్కంఠ దృశ్యం.. పెను సవాల్కు ఇస్రో సై..!
మరికొద్ది గంటల్లో భారత గగనతల చరిత్రలో ఉత్కంఠ దృశ్యం ఆవిష్కృతం కానుంది. భారత్ ఓ ఉపగ్రహాన్ని పూర్తి నియంత్రిత విధానంలో సముద్రంలో కూల్చివేయనుంది.
ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
చైనా ఉపగ్రహాలు తరచూ కక్ష్య నుంచి అదుపుతప్పి భూవాతవరణంలోకి దూసుకొచ్చిన ఘటనలు ఈ మధ్య కాలంలో తరచూ చూస్తూనే ఉన్నాం. చైనా ఉపగ్రహ శకలాలు ప్రపంచాన్నివణికించాయి. ఈ నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. కాలం చెల్లిన తన ఉపగ్రహాలను నియంత్రిత విధానంలో కూల్చివేయడంపై ఇస్రో(Isro) కసరత్తు మొదలుపెట్టింది. వాస్తవానికి అంతరిక్షంలోనే ఉపగ్రహాన్ని పేల్చివేసే సామర్థ్యం భారత్కు ఉంది. కానీ, అలా చేస్తే వాటి శకలాలు భవిష్యత్తులో సమస్యాత్మకంగా మారతాయి. ఈ క్రమంలో కాలం చెల్లిన ఓ ఉపగ్రహాన్ని పూర్తి నియంత్రిత విధానంలో సముద్రంలో కూల్చివేసేందుకు రంగం సిద్ధం చేసింది. నేటి సాయంత్రం ఈ ఘట్టం ఆవిష్కృతం కానుంది.
ఏ ఉపగ్రహాన్ని ఎంచుకుంది..
తక్కువ భూకక్ష్యలో పరిభ్రమించే ‘మేఘ-ట్రోపికస్-1(ఎంటీఐ) ఉపగ్రహాన్ని ఇస్రో(Isro) ఈ ప్రయోగానికి ఎంచుకుంది. దీనిని 2011 అక్టోబర్ 12న ఫ్రాన్స్ స్పేస్ ఏజెన్సీ సీఎన్ఈసీ కలిసి సంయుక్తంగా ప్రయోగించాయి. ఉష్ణమండల వాతావరణ, పర్యావరణంపై అధ్యయనానికి దీనిని వాడాయి. వాస్తవానికి మూడేళ్లు మాత్రమే ఈ ఉపగ్రహం పనిచేస్తుందని తొలుత అంచనావేశారు. కానీ, ఇది 2021 వరకు నిరంతరాయంగా సేవలు అందించింది.
బాధ్యతగా తొలగించాలి..
ది ఇంటర్ ఏజెన్సీ స్పేస్ డెబ్రిస్ కోఆర్డినేషన్ కమిటీ అంతరిక్షంలో శకలాలను తగ్గించడానికి మార్గదర్శకాలు జారీ చేసింది. వీటి ప్రకారం భూ దిగువ కక్ష్యలో తిరిగే ఉపగ్రహాల జీవిత కాలం ముగిశాక వాటిని నియంత్రిత పద్ధతిలో భూమిపై సురక్షిత స్థానంలో కూల్చివేయాలని చెబుతోంది. లేదా ఆర్బిటాల్ లైఫ్ టైమ్ 25 ఏళ్లకంటే తక్కువ ఉన్నవాటిని భూదిగువకక్ష్యలో ప్రవేశపెట్టాలని పేర్కొంటోంది. ఈ కక్ష్యలో తిరిగే ఉపగ్రహాలు మెల్లగా భూవాతావరణంలోకి వచ్చేందుకు పట్టే సమయాన్ని ఆర్బిటాల్ లైఫ్టైమ్గా పరిగణిస్తారు. ఇస్రో ప్రయోగించిన టన్ను బరువున్న ‘మేఘ’ ఉపగ్రహా ఆర్బిటాల్ లైఫ్టైమ్ 100 సంవత్సరాలు. దీనిలో ఇంకా 125 కిలోల ఇంధనం మిగిలి ఉంది. ఫలితంగా సుదీర్ఘకాలం కక్ష్యలో ఉంటే ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది. వాస్తవానికి దానిలో ఉన్న ఇంధనం నియంత్రిత విధానంలో భూవాతావరణంలో ప్రవేశించడానికి సరిపోతుంది. 2022 ఆగస్టు నుంచి దీనిని కక్ష్య నుంచి కిందకు తీసుకురావడానికి 18 భ్రమణాలు చేయించారు.
సవాళ్లు ఏమిటీ..?
సాధారణంగా పెద్ద ఉపగ్రహాలు, రాకెట్ శకలాలు భూవాతావరణంలోకి ప్రవేశించిన తర్వాత ఏర్పడే ఘర్షణకు తట్టుకొనే అవకాశం ఉంది. ఇటువంటి వాటిని నియంత్రిత విధానంలో కూలిస్తే ప్రమాదాలు జరిగే అవకాశాలు దాదాపు ఉండవు. అటువంటి ఉపగ్రహాలు మొత్తం ఈ విధంగా కూల్చివేసేలా డిజైన్ చేస్తారు. ఇక్కడే ఇస్రోకు అసలైన సవాలు ఉంది. మేఘను నియంత్రిత విధానంలో భూకక్ష్యలోకి తెచ్చేలా డిజైన్ చేయలేదు. ఇదే సవాలుగా మారనుంది. ఈ ఉపగ్రహంలోని కాలం చెల్లిన పరికరాల పనితీరు ఏమాత్రం బాగోదు. దీనికి తోడు భూమిపైకి తిరిగి వచ్చే సమయంలో కఠిన వాతావరణ పరిస్థితులను ఉపగ్రహ సబ్సిస్టమ్స్ తట్టుకోలేవు. ‘మేఘ’ ఉపగ్రహ కూల్చివేత సమయంలో ఎదురయ్యే సవాళ్లను అధ్యయనం చేయవచ్చని ఇస్రో భావిస్తోంది.
* కూల్చివేత సమయంలో ఉపగ్రహం నిర్దేశించిన మార్గంలోనే భూవాతావరణంలోకి ప్రవేశించి ప్రయాణించాలి. అప్పుడే నిర్దేశిత ప్రదేశంలో కూలుతుంది. ఒక వేళ ఉపగ్రహం అదుపు తప్పితే జనావాసాలపై పడే ప్రమాదం ఉంది.
* భూవాతావరణ ఘర్షణ కారణంగా విద్యుదయస్కాంత రేడియేషన్కు గురై ఉపగ్రహంలోని వ్యవస్థలు పనిచేయకపోవచ్చు. అప్పుడు ఇది నియంత్రణ కోల్పోతుంది. లేకపోతే కమ్యూనికేషన్ కోల్పోయి.. నిర్దేశిత మార్గం తప్పి ప్రయాణించవచ్చు.
* భూవాతావరణంలోని ఘర్షణకు లోనై ఉపగ్రహం శకలాలు విడిపోయి వెదజల్లే ప్రమాదం ఉంది.
* నియంత్రణ సరిగా లేకపోతే ఉప్రగ్రహంలో వాడే విషపూరిత పదార్థాలు, రేడియోయాక్టివ్ ఐసోటోప్లు, రసాయనాల నుంచి ముప్పు ఉండవచ్చు.
* కూలిపోయే ఉపగ్రహ మార్గాన్ని బలమైన గాలులు, తుపానులు వంటివి మార్చవచ్చు.
ఎప్పుడు ఎక్కడ కూలుతుంది..?
ఈ ఉపగ్రహం మార్చి 7వ తేదీన సాయంత్రం 4.30 నుంచి రాత్రి 7.30లోపు భూమిపై కూలిపోవచ్చని అంచనా వేస్తున్నారు. పసిఫిక్ మహాసముద్రంలోని నిర్జన ప్రదేశంలో ఇది పడేలా మార్గాన్ని నిర్దేశించారు. భూవాతవరణ ఘర్షణకు కూడా ఈ ఉపగ్రహం తట్టుకొంటుందని చెబుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మామిడిపండ్లను మూడుసార్లే తిన్నా
బెయిల్ కోసం ఉద్దేశపూర్వకంగా చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకుంటున్నానని ఈడీ తనపై చేసిన ఆరోపణలపై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఘాటుగా స్పందించారు. -
మూడు రోజుల్లో తేల్చాలి
ఎన్నికలు సమీపిస్తున్నాయనే ఏకైక సాకుతో సభలు, సమావేశాలు, ఓటరు చైతన్య యాత్రలు, నిరసనలు, ధర్నాలు తదితరాలపై జిల్లా, రాష్ట్ర అధికార యంత్రాంగాలు నిషేధం విధించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. -
శరద్ పవార్ వైపు దూసుకొచ్చిన మైక్రోఫోన్!
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ ఓ సభలో మాట్లాడుతుండగా ఆయన వైపు మైక్రోఫోన్ ఒకటి దూసుకురావడం చిన్నపాటి కలకలం రేపింది. -
నౌకాదళ నూతన అధిపతిగా దినేశ్కుమార్ త్రిపాఠి
నూతన నౌకాదళాధిపతిగా వైస్ అడ్మిరల్ దినేశ్ కుమార్ త్రిపాఠి నియమితులయ్యారు. ఈ నెలాఖర్లో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. -
వేదమంత్రాల సాక్షిగా శ్రీకృష్ణుడితో యువతి పెళ్లి
మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో ఓ యువతి చిన్నప్పటి నుంచి తాను ఆరాధించిన శ్రీకృష్ణుణ్ని పెళ్లి చేసుకుంది. -
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
చిన్నపిల్లలు అశ్లీల వీడియోలు చూడటం నేరం కాకపోవచ్చేమో గానీ, పిల్లలను ఉపయోగించి అశ్లీల వీడియోలు తీయడం తీవ్రమైన ఆందోళన కలిగించే విషయమేగాక నేరమని శుక్రవారం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
తిరస్కృత నామినేషన్లపై పిటిషన్ను తోసిపుచ్చిన సుప్రీం
తిరస్కృత నామినేషన్లకు పరిష్కారం నామినేషన్లు దాఖలు చేయడంలోనే ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
‘సైన్స్శక్తి’గా ఎదిగేందుకు భారత్ సిద్ధం
ప్రబల ఆర్థికశక్తిగా ఎదుగుతున్న భారత్.. శాస్త్ర, సాంకేతిక రంగంలోనూ సత్తా చాటేందుకు సిద్ధమవుతోందని ప్రముఖ సైన్స్ వారపత్రిక ‘నేచర్’ పేర్కొంది. -
వివాహేతర సంబంధం విడాకులకు మాత్రమే కారణం.. పిల్లల కస్టడీ మంజూరుకు కాదు
వివాహేతర సంబంధం కారణం చూపి విడాకులు పొందవచ్చు కానీ, పిల్లల కస్టడీని పొందలేరని బొంబాయి హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. -
అభ్యర్థుల మార్కులను వెల్లడించిన యూపీఎస్సీ
సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో అభ్యర్థులు సాధించిన మార్కుల వివరాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) శుక్రవారం విడుదల చేసింది. -
దుబాయ్ ప్రయాణాలు వాయిదా వేసుకోండి
అత్యవసరమేమీ కానట్లయితే దుబాయ్కి, ఇక్కడి నుంచి వేరే దేశాలకు వెళ్లేందుకు భారతీయులు తమ ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని యూఏఈలోని భారత దౌత్య కార్యాలయం సూచించింది. -
స్కూల్లో హెచ్ఎంకు ఫేషియల్ వీడియో తీసిన టీచరుపై దాడి
ఉత్తర్ప్రదేశ్లోని ఉన్నావ్ జిల్లా దండమౌ గ్రామ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సంగీతాసింగ్ పనివేళల్లో ఫేషియల్ చేయించుకున్నారు. -
ఆరోగ్యకర ఆయుర్దాయాన్ని పెంచేందుకు ప్రాజెక్టు
మానవుల ఆరోగ్యకర ఆయుర్దాయాన్ని పెంచేందుకు బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) ఒక ప్రాజెక్టును చేపట్టింది. -
ఓటు స్ఫూర్తిని చాటిన సైలెంట్ విలేజ్
ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేందుకు వైకల్యం అడ్డుకాదని చాటారు జమ్మూకశ్మీర్లోని ధడ్కాహి గ్రామస్తులు. డోడా జిల్లాలోని ధడ్కాహి.. ఉధమ్పుర్ లోక్సభ స్థానం పరిధిలోకి వస్తుంది. -
రోజూ 15 నిమిషాలు వైద్యుడిని సంప్రదించేందుకు అనుమతివ్వండి
తిహాడ్ జైలులో తాను ఇన్సులిన్ వినియోగించేందుకు అనుమతినిచ్చేలా జైలు అధికారులకు ఆదేశాలు ఇవ్వాలంటూ దిల్లీ కోర్టులో కేజ్రీవాల్ అభ్యర్థనను దాఖలు చేశారు. -
ఫిలిప్పీన్స్ చేతికి భారత్ బ్రహ్మోస్
బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూజ్ క్షిపణుల మొదటి బ్యాచ్ను భారత్.. శుక్రవారం ఫిలిప్పీన్స్కు అందజేసింది. -
యోగాగురు రాందేవ్ కేసుల పరిస్థితేంటి?
యోగాగురు రాందేవ్పై నమోదైన ఫిర్యాదుల పరిస్థితిని, ఎఫ్ఐఆర్ వివరాలను సమర్పించాలని బిహార్, ఛత్తీస్గఢ్ ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. -
కోల్కతా హైకోర్టులో న్యాయవాదులు గౌను ధరించాల్సిన అవసరం లేదు
రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో కోల్కతా హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. -
బాలిక 28 వారాల గర్భం తొలగింపుపై వైద్యుల సలహా కోరిన సుప్రీంకోర్టు
అత్యాచార బాధితురాలైన 14 ఏళ్ల బాలిక అభ్యర్థన మేరకు ఆమె 28 వారాల గర్భం తొలగించటానికి అనుమతించే విషయమై సర్వోన్నత న్యాయస్థానం వైద్యుల సలహా కోరింది. -
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
వేసవి రద్దీని తీర్చేందుకు రైల్వేశాఖ సిద్ధమైంది. ఈ సీజన్లో దేశవ్యాప్తంగా 9,111 అదనపు ట్రిప్పులు నడపనున్నట్లు ప్రకటించింది. -
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా? UPSC పరీక్షల మార్కుల షీట్లు విడుదల
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో తొలి 10 మంది టాపర్లు సాధించిన మార్కులు ఇవే..
తాజా వార్తలు (Latest News)
-
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
-
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి
-
స్కూల్లో హెచ్ఎంకు ఫేషియల్ వీడియో తీసిన టీచరుపై దాడి
-
సైబర్ యుద్ధాలను ఎదుర్కొనేందుకు చైనా సైన్యంలో కొత్త విభాగం
-
MS Dhoni: ధోని.. ఇంకా నాటౌటే
-
వైకాపా పాలనలో చంద్రబాబుపై 22 కేసులు