ISRO-NASA: యూఎస్ ఎయిర్ఫోర్స్ విమానంలో బెంగళూరుకు చేరిన ఇస్రో-నాసా శాటిలైట్!
నాసా-ఇస్రో సింథటిక్ అపార్చర్ (NISAR) అనే పేరుతో పిలిచే ఈ ఉపగ్రహం (Satellite) సాయంతో ప్రపంచవ్యాప్తంగా భూమి ఉపరితలంపై మంచు ప్రాంతాల్లో మార్పులను పరిశీలించనున్నారు.
బెంగళూరు: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO), అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (NASA) సంయుక్తంగా రూపొందించిన ఉపగ్రహాన్ని (Satellite) త్వరలో ఇస్రో అంతరిక్ష కక్ష్యలోకి ప్రవేశపెట్టనుంది. ఇందుకోసం ఈ ఉపగ్రహాన్ని అమెరికా వాయుసేనకు చెందిన సీ-17 ప్రత్యేక రవాణా విమానంలో బెంగళూరుకు తీసుకొచ్చారు. నాసా-ఇస్రో సింథటిక్ అపార్చర్ (NISAR) అనే పేరుతో పిలిచే ఈ ఉపగ్రహం సాయంతో ప్రపంచవ్యాప్తంగా భూమి ఉపరితలంపై మంచు ప్రాంతాల్లో మార్పులను పరిశీలించనున్నారు. నిసార్ ఉపగ్రహం ద్వారా పరిశోధకులు భూమి పొరల్లో జరిగే కదలికలు, భూకంపాలు, అగ్నిపర్వతాల పేలుళ్లు, సముద్రమట్టం పెరుగుదల ప్రకృతి వైపరీత్యాలకు కారణమయ్యే పరిస్థితులు, వాటి ముందస్తు సంకేతాలను గుర్తించేందుకు జరిపే అధ్యయనాలకు దీన్ని ఉపయోగించనున్నారు.
ఈ ఉపగ్రహం సాయంతో ఇస్రో హిమాలయాల్లోని హిమనీనదాల ప్రవాహ తీరు, కొండచరియలు విరిగిపడే అవకాశం ఉన్న ప్రాంతాల పర్యవేక్షించనుంది. ఎస్యూవీ వాహనం పరిమాణంలో ఉండే ఈ ఉపగ్రహం 2,800 కిలోల బరువు ఉంటుందని నాసా పేర్కొంది. ఈ ఉపగ్రహంలో ఎల్-బ్యాండ్, ఎస్-బ్యాండ్, సింథటిక్ అపార్చర్ రాడార్ (SAR) వంటి పరికరాలు ఉన్నాయి. ఇవి ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా మేఘాలు, దట్టమైన అడవుల్లో కూడా హై-రిజల్యూషన్ ఫొటోలను తీస్తుంది. 2024లో శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!