చంద్రయాన్ 3 పరీక్షలు పూర్తి.. లాంచ్ అయ్యేది ఆ నెలలోనే
ఈ ఏడాది ఆగస్టులో చంద్రయాన్-3 ప్రయోగం చేపట్టనున్నట్లు భారత అంతరిక్ష విభాగం వెల్లడించింది. చంద్రయాన్-2 మిషన్ నుంచి నేర్చుకున్న పాఠాలు, అంతర్జాతీయ నిపుణుల సూచనల ఆధారంగా.. చంద్రయాన్-3 మిషన్కు
దిల్లీ: ఈ ఏడాది ఆగస్టులో చంద్రయాన్-3 ప్రయోగం చేపట్టనున్నట్లు భారత అంతరిక్ష విభాగం వెల్లడించింది. చంద్రయాన్-2 మిషన్ నుంచి నేర్చుకున్న పాఠాలు, అంతర్జాతీయ నిపుణుల సూచనల ఆధారంగా.. చంద్రయాన్-3 మిషన్కు సంబంధించిన పనులు జరుగుతున్నాయని లోక్సభకు రాతపూర్వక సమాధానంలో తెలిపింది. ఇప్పటికే అవసరమైన పరీక్షలు పూర్తయ్యాయని, ఆగస్టులో లాంచ్ చేయనున్నట్లు చెప్పింది. 2019 జులైలో చేపట్టిన చంద్రయాన్- 2 ప్రయోగంలో భాగంగా ఇందులోని ల్యాండర్, రోవర్.. చంద్రుడి ఉపరితలంపై క్రాష్ ల్యాండ్ అయిన విషయం తెలిసిందే. ఇది జరిగిన దాదాపు మూడేళ్ల తరువాత.. ఇస్రో ‘చంద్రయాన్-3’కి సిద్ధమైంది. చంద్రుడిపై పరిశోధనల కోసం భారత్ ప్రకటించిన చంద్రయాన్ కార్యక్రమంలో ఇది మూడో యాత్ర కానుంది. దీంతోపాటు అంతరిక్ష విభాగం తన 2022 టైమ్లైన్నూ విడుదల చేసింది.
వాస్తవానికి చంద్రయాన్-3ని 2021లోనే ప్రయోగించాల్సి ఉంది. అయితే, ఈ మిషన్ వెనుక నిరంతర జాప్యంపై ప్రశ్నలకు శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి డా.జితేంద్ర సింగ్ సమాధానమిస్తూ.. కొవిడ్ పరిస్థితుల కారణంగా ఇదివరకే షెడ్యూల్ చేసిన అనేక అంతరిక్ష కార్యక్రమాలు ప్రభావితమైనట్లు తెలిపారు. అంతరిక్ష రంగంలో సంస్కరణలు, డిమాండ్ ఆధారిత ప్రాధాన్యాల ప్రాతిపదికన ఈ ఏడాదిలో 19 ప్రయోగాలు చేపట్టేందుకు అంతరిక్ష విభాగం ప్రణాళికలు రూపొందించినట్లు చెప్పారు. ఇందులో ఎనిమిది రాకెట్, ఏడు స్పేస్క్రాఫ్ట్, నాలుగు సాంకేతిక ప్రదర్శన సంబంధిత మిషన్లు ఉన్నాయని కేంద్ర మంత్రి తన రాతపూర్వక సమాధానంలో వెల్లడించారు. మరోవైపు, ఈ ఏడాది తొలి అంతరిక్ష ప్రయోగం ఫిబ్రవరి మధ్యలో చేపట్టే అవకాశాలు ఉన్నాయి. పీఎస్ఎల్వీ సాయంతో రాడార్ ఇమేజింగ్, నిఘా కోసం ఉపయోగించే ‘రిశాట్-1ఏ’ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ను ప్రయోగించేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు సిద్ధమవుతున్నారు. దీనికి సంబంధించిన తేదీని వెల్లడించాల్సి ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)