Oxygen: భారత్కు 24 క్రయోజెనిక్ కంటైనర్లు
దేశంలో కరోనా విలయం సృష్టిస్తున్న తరుణంలో మెడికల్ ఆక్సిజన్కు తీవ్ర కొరత ఏర్పడింది. దేశీయ ప్లాంట్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతున్నప్పటికీ అవసరాలకు సరిపడా ఆక్సిజన్ అందడం లేదు. దీంతో కొరతను అధిగమించేందుకు ఇతర దేశాల నుంచి...
దిల్లీ: దేశంలో కరోనా విలయం సృష్టిస్తున్న తరుణంలో మెడికల్ ఆక్సిజన్కు తీవ్ర కొరత ఏర్పడింది. దేశీయ ప్లాంట్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతున్నప్పటికీ అవసరాలకు సరిపడా ఆక్సిజన్ అందడం లేదు. దీంతో కొరతను అధిగమించేందుకు ఇతర దేశాల నుంచి భారత్ ప్రాణవాయువును దిగుమతి చేసుకుంటోంది. పొరుగు దేశాల నుంచి త్వరలోనే వాయుమార్గంలో 24 క్రయోజెనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లు భారత్కు బయలు దేరుతున్నట్లు ఐటీసీ లిమిటెడ్ ట్విటర్ ద్వారా వెల్లడించింది. ఆక్సిజన్ ఉత్పత్తి ప్రదేశం నుంచి సరఫరా వేగాన్ని పెంచేందుకే ఈ చర్యలు తీసుకున్నట్లు వెల్లడించింది. ‘‘ భారత్లో ఏర్పడిన మెడికల్ ఆక్సిజన్ కొరతను నివారించేందుకు, కరోనా బాధితులకు సకాలంలో వైద్యసేవలు అందించేందుకు లిండే ఇండియాల లిమిటెడ్ సౌజన్యంతో 24 క్రయోజెనిక్ ఆక్సిజన్ కంటైనర్లను ఎయిర్లిఫ్ట్ చేస్తున్నాం’’ అంటూ ఐటీసీ ట్వీట్ చేసింది.
మరోవైపు ఆక్సిజన్ను దిగుమతి చేసేందుకు భారత్ ప్రభుత్వం సింగపూర్తోనూ సంప్రదింపులు జరిపింది. చర్చలు ఫలించడంతో ఇండియన్ ఎయిర్ఫోర్సుకు చెందిన ఖాళీ యుద్ధవిమానాలు అక్కడికి బయల్దేరి వెళ్లాయి. అత్యవసర పరిస్థితుల్లో ఎయిర్ఫోర్సు సేవలను కూడా వినియోగించుకోవచ్చని కేంద్రం రాష్ట్రాలకు అవకాశమిచ్చింది. అంతేకాకుండా దేశంలో ఆక్సిజన్ కొరతను నివారించేందుకు రక్షణ శాఖ కూడా చర్యలు మొదలు పెట్టింది. జర్మనీ నుంచి 23 మొబైల్ ఆక్సిజన్ తయారీ ప్లాంట్లను దిగుమతి చేసుకునేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. మరో వారం రోజుల్లో అవి కూడా అందుబాటులోకి రానున్నాయి. గత మూడు రోజులుగా భారత్లో తీవ్ర ఆక్సిజన్ కొరత వేధిస్తోంది. ఆక్సిజన్ అందుబాటులో లేకపోవడంతో చాలా ఆస్పత్రులు చేతులెత్తేస్తున్నాయి. తాజా పరిస్థితుల నేపథ్యంలో 50 వేల మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ను దిగుమతి చేసుకునేందుకు భారత్ ప్రణాళికలు తయారు చేస్తోంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Easter Attacks: ‘నన్ను క్షమించండి..’ శ్రీలంక మాజీ అధ్యక్షుడు సిరిసేన
-
India News
Khushbu Sundar: వీల్ఛైర్ కోసం 30 నిమిషాలా?.. ఎయిరిండియాపై ఖుష్బూ అసహనం
-
Sports News
PCB: మికీ ఆర్థర్ పాక్ ‘ఆన్లైన్ కోచ్’.. సోషల్ మీడియాలో మీమ్స్ వెల్లువ
-
Technology News
WhatsApp: వాట్సాప్ వీడియో.. ఈ మార్పు గమనించారా..?
-
Movies News
RRR: ఆస్కార్ బరిలో నిలిచిన చిత్రాలను వెనక్కి నెట్టి.. నంబరు 1గా ‘ఆర్ఆర్ఆర్’
-
Politics News
AAP: కర్ణాటకపై ఆప్ గురి: అజెండాపై కసరత్తు.. పార్టీల హామీలపై కౌంటర్!