Jammu And Kashmir: ఉద్యోగం పోలీసు శాఖలో.. విధులు ఉగ్రవాదంలో..!
ఉగ్రవాదులతో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్న ఓ డీఎస్పీని జమ్మూకశ్మీర్ పోలీసులు అరెస్టు చేశారు. ఉగ్రవాదులను కాపాడేందుకు సదరు అధికారి ఏకంగా పోలీసులపై తప్పుడు ఫిర్యాదులు సృష్టించాడని తేలింది. ఇక, ట్విటర్లోనూ ఇతడో సెలబ్రిటి.. ఏకంగా 44వేల మంది ఫాలోవర్లు ఉండటం గమనార్హం.
ఇంటర్నెట్డెస్క్: ఉద్యోగమేమో పోలీసు శాఖలో.. చేసేదేమో ఉగ్రవాదులకు సహకారం. ఇదేదో చిన్నా చితకా ఉద్యోగి వ్యవహారం కాదు.. ఏకంగా ఓ డీఎస్పీ నిర్వాకం. జమ్మూకశ్మీర్ పోలీసు శాఖలో డీఎస్పీగా పనిచేస్తున్న షేక్ ఆదిల్ ముస్తాక్.. ఉగ్ర ఆపరేటీవ్లకు సహకరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అంతేకాదు.. అతడిపై దర్యాప్తు చేస్తున్న అధికారిని దీనిలో ఇరికించాలని యత్నించాడు. తాజాగా ముస్తాక్ను పోలీసులు అరెస్టు చేశారు. అతడిని శ్రీనగర్లోని న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చి ఆరు రోజుల కస్టడీకి తీసుకొన్నారు.
ఉగ్రవాదిని ఇంటరాగేట్ చేస్తే బయటపడింది..
జులైలో పోలీసులు ఓ ఉగ్రవాదిని అరెస్టు చేశారు. అతడి ఫోన్ను విశ్లేషించారు. అనంతరం సదరు ఉగ్రవాదిని విచారించగా.. డీఎస్పీ ఆదిల్ ముస్తాక్తో తాను నిరంతరం టచ్లో ఉన్నట్లు వెల్లడించాడు. చట్టం కన్ను గప్పడంలో అతడు తనకు సాయం చేసినట్లు ఉగ్రవాది వెల్లడించాడు.
టెలిగ్రామ్ యాప్ ద్వారా ముస్తాక్ ఉగ్రవాదితో మాట్లాడటం, మెసేజ్లు చేయడం వంటివి చేసినట్లు సీనియర్ అధికారులు గుర్తించారు. ‘‘డీఎస్పీకి ఉగ్రవాదికి మధ్య 40 ఫోన్కాల్ సంభాషణలు జరిగాయి. అరెస్టును తప్పించుకోవడం, న్యాయసాయం పొందడంపై డీఎస్పీ అతడికి సలహాలు ఇస్తున్నాడు’’ అని ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీనియర్ అధికారి వెల్లడించారు.
దర్యాప్తు అధికారులనే ఇరికించేందుకు..
సదరు డీఎస్పీకి వ్యతిరేకంగా టెక్నికల్ సాక్ష్యాలతోపాటు నగదు ఎలా అతడి వద్దకు చేరిందనే అంశాలను కూడా సేకరించినట్లు దర్యాప్తు వర్గాలు వెల్లడించాయి. ఈ క్రమంలో ఉగ్ర నగదు సేకరణపై దర్యాప్తు చేస్తున్న అధికారినే కేసులో ఇరికించాలని ఆదిల్ యత్నించినట్లు పోలీసులు చెబుతున్నారు. ‘ ‘ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉగ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.31 లక్షలు స్వాధీనం చేసుకొన్నారు. ఈ కేసులో ముజ్మిల్ జహూర్ అనే వ్యక్తి కీలకమని గుర్తించి వేట మొదలుపెట్టారు. మరో వైపు అరెస్టు అయిన వారిలో ఒక వ్యక్తి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్పై అవినీతి ఆరోపణలు చేసినట్లు ఆదిల్ ఓ ఫిర్యాదును సృష్టించాడు’ అని దర్యాప్తు అధికారి పేర్కొన్నారు.
లష్కరే తొయిబాకు నిధులు సేకరించే ముజ్మిల్ జహూర్తో డీఎస్పీ ఆదిల్కు సన్నిహిత సంబంధాలున్నాయి. అతడిని ఆదిల్ అరెస్టు నుంచి తప్పించినట్లు తెలిసింది. ఈ క్రమంలో ఉగ్రవాదుల నుంచి డీఎస్పీ రూ.5లక్షలు సొమ్ము తీసుకొన్నట్లు తేలింది. దర్యాప్తు అధికారులపైనే ఉగ్రవాదులు ఆరోపించినట్లు తప్పుడు ఫిర్యాదులను కూడా ఆదిల్ సృష్టించాడు. జులైలో ముజ్మిల్ను పోలీసులు అరెస్టు చేయటంతో అతడు విషయం వెలుగులోకి వచ్చింది. అంతేకాదు.. జమ్మూకశ్మీర్లో బలవంతపు వసూళ్లు, బ్లాక్మెయిలింగ్కు పాల్పడినట్లు ఆదిల్పై ఆరోపణలు ఉన్నాయి. అతడి బాధితులు క్రమంగా పోలీసుల వద్దకు వచ్చి ఫిర్యాదులు చేస్తున్నారు. నిందితుడు ఆదిల్ ట్విటర్లో చాలా చురుగ్గా ఉన్నాడు. అతడికి ఏకంగా 44 వేల మంది ఫాలోవర్లు ఉండటం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేజ్రీవాల్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) నియామకం విషయంలో కేంద్రంతో నెలకొన్న వివాదంలో దిల్లీలోని కేజ్రీవాల్ సర్కారుకు ఎదురుదెబ్బ తగిలింది. -
విమానంలో భార్యాభర్తల గొడవ.. దారి మళ్లించి దిల్లీలో దించివేత
బ్యాంకాక్కు బయలుదేరిన మ్యూనిక్ - బ్యాంకాక్ ‘లుఫ్తాన్సా’ విమానాన్ని బుధవారం దారి మళ్లించి దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దింపారు. -
విధానసౌధ వాకిట గజరాజులు
చారిత్రక బెంగళూరు విధానసౌధ ఆవరణలో అసలైన ఏనుగులను తలపించేలా గజరాజుల బొమ్మలు ఏర్పాటు చేశారు. -
గవర్నర్ ఏడీసీగా తొలిసారిగా మహిళ
దేశంలో గవర్నర్ ఏడీసీ (ఎయిడ్ ది క్యాంప్)గా తొలిసారి ఓ మహిళ నియమితులయ్యారు. ఇండియన్ ఎయిర్ఫోర్స్ 2015 బ్యాచ్కు చెందిన స్క్వాడ్రన్ లీడర్ మనీషా పాఢిని తన ఏడీసీగా నియమిస్తూ మిజోరం గవర్నర్ కంభంపాటి హరిబాబు బుధవారం ఉత్తర్వులిచ్చారు. -
భారత్కు తిరిగొచ్చిన అంజూ
ఫేస్బుక్లో పరిచయమైన యువకుడి కోసం పాకిస్థాన్కు వెళ్లి.. అక్కడే రెండోపెళ్లి చేసుకున్న మధ్యప్రదేశ్లోని గ్వాలియర్కు చెందిన వివాహిత అంజూ (34) తిరిగి భారత్కు వచ్చింది. -
81.35 కోట్ల మందికి అయిదేళ్లపాటు ఉచితంగా ఆహార ధాన్యాలు
వ్యవసాయానికి మహిళా సంఘాల ద్వారా డ్రోన్ల సాయం.. ప్రధాన మంత్రి జన్జాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ ద్వారా గిరిజనుల అభివృద్ధి.. 81.35 కోట్ల మందికి ఐదేళ్లపాటు ఉచిత ఆహార ధాన్యాల పంపిణీ.. వంటి కీలక నిర్ణయాలకు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. -
భారత్లో అసాధారణ వాతావరణం
భారత్లో ఈ ఏడాది మొదటి తొమ్మిది నెలల్లో సుమారు ప్రతిరోజు అసాధారణ వాతావరణ పరిణామాలు చోటుచేసుకున్నాయని బుధవారం తాజా అధ్యయనం ఒకటి పేర్కొంది. -
2026 ఆగస్టు నాటికి తొలి బుల్లెట్ రైలు
అహ్మదాబాద్ - ముంబయి మార్గంలో అందుబాటులోకి రానున్న బుల్లెట్ రైలు ప్రాజెక్టులో కొంతభాగం 2026 ఆగస్టు నాటికి సిద్ధం కానుందని రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. -
మేం దిల్లీ వీడుతాం!
ముంబయి, దిల్లీ నగర వాసులను వాయు కాలుష్యం బెంబేలెత్తిస్తోంది. దీని బారి నుంచి తప్పించుకోవడానికి ఇతర ప్రాంతాలకు వెళ్లే యోచన కూడా చేస్తున్నారు. -
సంక్షిప్త వార్తలు
హిమాలయ ప్రాంత పర్యావరణ వ్యవస్థ సున్నితత్వం, సంక్లిష్టతలను సిల్క్యారా సొరంగ ప్రమాద ఘటన మన కళ్లకు కట్టింది. ఇక్కడి ప్రాజెక్టుల మదింపు ప్రక్రియ వైఫల్యం కూడా వెలుగులోకి వచ్చింది. -
సొరంగం నుంచి కుమారుడు బయటకు రావడానికి కొన్ని గంటల ముందే తండ్రి మరణం
సిల్క్యారా సొరంగంలో చిక్కుకున్న తన కుమారుడి కోసం 16 రోజులు ఊపిరి బిగపట్టి ఎదురుచూసిన ఓ తండ్రి.. చివరకు తన బిడ్డ బయటకు రావడానికి కొన్ని గంటల ముందు కన్నుమూసిన హృదయ విదారక ఘటన ఇది. -
చైనాలో శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల కలకలం.. భారత్లో 6 రాష్ట్రాలు అప్రమత్తం
చైనాలో గత కొంతకాలంగా చిన్నారుల్లో వ్యాపిస్తున్న శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల్లు ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురిచేస్తున్నాయి. -
గురుపత్వంత్ హత్యకు కుట్రపై దర్యాప్తునకు కమిటీ
సిక్స్ ఫర్ జస్టిస్’ నాయకుడు గురుపత్వంత్ సింగ్ పన్నును అమెరికా భూభాగంపై హతమార్చేందుకు కుట్ర పన్నారన్న ఆరోపణలపై విచారణకు ఓ ఉన్నతస్థాయి కమిటీని భారత్ ఏర్పాటు చేసింది. -
దిల్లీ విమానం ఆరున్నర గంటల ఆలస్యం
దిల్లీ విమాన సర్వీస్ ఆరున్నర గంటలు ఆలస్యంగా వెళ్లిన సంఘటన శంషాబాద్ విమానాశ్రయంలో బుధవారం చోటు చేసుకుంది. -
16వ ఆర్థిక సంఘానికి శ్రీకారం
కేంద్ర ప్రభుత్వం 16వ ఆర్థిక సంఘం ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. దానికి సంబంధించిన విధి విధానాలకు ప్రధాని మోదీ అధ్యక్షతన మంగళవారం రాత్రి జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోద ముద్ర వేసింది. -
మణిపుర్లో శాంతి వీచిక
జాతుల ఘర్షణలతో అట్టుడికిన మణిపుర్లో శాంతియుత పరిస్థితులకు కీలక ముందడుగు పడింది. -
గంటన్నరలో బాలుడి ఆచూకీ కనుగొన్న పోలీసు జాగిలం లియో
ముంబయిలో అపహరణకు గురైన ఆరేళ్ల బాలుడి జాడను పోలీసు జాగిలం ‘లియో’ కేవలం గంటన్నర వ్యవధిలో గుర్తించింది. -
కౌన్బనేగా కరోడ్పతిలో రూ.కోటి గెలుచుకున్న 14 ఏళ్ల బాలుడు
బాలీవుడ్ దిగ్గజం అమితాబ్బచ్చన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న గేమ్ షో ‘కౌన్ బనేగా కరోడ్పతి’ (కేబీసీ)లో 14 ఏళ్ల బాలుడు ఏకంగా రూ.కోటి గెలుచుకొని రికార్డు సృష్టించాడు. -
విద్వేష ప్రసంగాలపై చర్యలకు ప్రత్యేక పాలనా యంత్రాంగం
దేశవ్యాప్తంగా విద్వేష ప్రసంగాల కట్టడికి పాలనా యంత్రాంగాన్ని నెలకొల్పే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు సుప్రీంకోర్టు బుధవారం వెల్లడించింది. -
పార్లమెంటు సమావేశాల్లో 18 బిల్లులు
పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో 18 బిల్లులను ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో 2 జమ్మూ కశ్మీర్, పుదుచ్చేరిలలో మహిళా రిజర్వేషన్ల వర్తింపు బిల్లులు, 3 నేర శిక్షాస్మృతి బిల్లులు ఉన్నాయి. -
రాష్ట్రపతికి బిల్లులను ఎప్పుడు పంపించాలి?
శాసనసభ ఆమోదించిన బిల్లులను రెండేళ్ల పాటు కేరళ గవర్నర్ తన వద్దే నిలిపి ఉంచడంపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. రాష్ట్రపతి సమ్మతి కోసం గవర్నర్లు ఎప్పుడు బిల్లులను పంపించాలనే అంశంపై మార్గదర్శకాలను రూపొందించే విషయాన్ని పరిశీలించనున్నట్లు బుధవారం తెలిపింది.


తాజా వార్తలు (Latest News)
-
Kiraak RP: సైలెంట్గా.. కిరాక్ ఆర్పీ వివాహం
-
Ashish Nehra: టీ20లకు భారత్ కోచ్ పదవి.. ఆశిశ్ నెహ్రా వద్దనడానికి కారణాలు ఇవేనా?
-
Expensive Cities: ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరాలు ఇవే..
-
Chandrababu: ఏపీలో తెదేపా అధినేత చంద్రబాబు పర్యటన షెడ్యూల్ విడుదల
-
Supreme court: చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా
-
Cricket News: ఇప్పుడెందుకు ఈ టీ20 సిరీస్..? పందెం కోల్పోయానంటున్న కెవిన్.. టీమ్ఇండియాతోనూ బజ్బాల్!