Gujarat Conman: ప్రధాని కార్యాలయ అధికారినంటూ హడావుడి చేసి.. పోలీసులకు చిక్కి..!
పీఎంవోకు చెందిన ఉన్నతాధికారినంటూ జమ్మూకశ్మీర్(Jammu and Kashmir ) అధికారులను మోసగించిన గుజరాత్ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. వెంటవెంటనే చేసిన పర్యటనలే అతడు పోలీసులకు చిక్కేలా చేశాయి.
శ్రీనగర్: తాను ప్రధానమంత్రి కార్యాలయ(PMO) అధికారినంటూ గుజరాత్(Gujarat)కు చెందిన ఓ వ్యక్తి జమ్మూకశ్మీర్ యంత్రాంగాన్ని మాయచేశాడు. అక్కడి ఉన్నతాధికారులతో సమావేశాలు నిర్వహించాడు. ఫైవ్స్టార్ వసతి, బుల్లెట్ ప్రూఫ్ వాహనం, జడ్ ప్లస్ భద్రతతో హల్చల్ చేశాడు. సరిహద్దుల్లోని సున్నిత ప్రాంతాల్లో పర్యటించాడు. చివరకు పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యాడు.
జమ్మూకశ్మీర్(Jammu and Kashmir ) పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆ వ్యక్తి పేరు కిరణ్ భాయ్ పటేల్. పీఎంఓ (PMO)లో అడిషనల్ డైరెక్టర్ అని తనను తాను జమ్మూకశ్మీర్ అధికారులకు పరిచయం చేసుకున్నాడు. ఈ క్రమంలో గత అక్టోబర్ నుంచి ఈ కేంద్రపాలిత ప్రాంతంలో పర్యటిస్తున్నట్లు సమాచారం. అలాగే నియంత్రణ రేఖకు సమీపంలోని ఉరి(Uri)లోని కమాన్ పోస్టు(Kaman Post)నుంచి శ్రీనగర్లోని లాల్ చౌక్కు వెళ్లాడు. ఇతడు మాటలకు మోసపోయిన అధికారులు.. ప్రభుత్వ ఆతిథ్యం ఇచ్చారు. వ్యక్తిగత భద్రతాధికారిని నియమించారు. ఇక అతడేమో తన పర్యటనకు సంబంధించిన చిత్రాలన్నింటినీ ఎప్పటికప్పుడు నెట్టింట్లో షేర్ చేసేవాడు. అయితే, రెండు వారాల వ్యవధిలో రెండోసారి పర్యటనకు రావడంతో అతడిపై అనుమానం మొదలైంది. దీనిపై నిఘా వర్గాలు పోలీసును అప్రమత్తం చేశాయి. అతడి గత చరిత్రను గురించి ఆరా తీయగా బండారం బయటపడింది. దాంతో అతడున్న హోటల్లోనే 10 రోజుల క్రితం అరెస్టు చేశారు. ఈ కేసు విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై గుజరాత్ పోలీసులు కూడా దర్యాప్తు చేపట్టారు.
పటేల్కు వెరిఫైడ్ ట్విటర్ ఖాతా కూడా ఉంది. దానిలో అతడిని అనుసరించే వారిలో గుజరాత్(Gujarat)కు చెందిన భాజపా సీనియర్ నేతలు కూడా ఉన్నారు. తనకు పారామిలిటరీ బలగాలు భద్రత కల్పించిన చిత్రాలు, మంచులో నడిచిన దృశ్యాలను పోస్టు చేశాడు. అతడి ట్విటర్ బయో ప్రకారం ఉన్నత విద్యను అభ్యసించినట్లు తెలుస్తోంది. అలాగే అందులో తనను తాను ‘థింకర్, స్ట్రాటజిస్ట్, అనలిస్ట్, క్యాంపైన్ మేనేజర్’ గా అభివర్ణించుకున్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
జగనన్న నవ్వులు.. జనాలకు చుక్కలు
-
కూలీ బిడ్డకు 993 మార్కులు
-
ఏ ముఖం పెట్టుకుని రాజధాని రైతులను సీఎం ఓట్లు అడుగుతారు
-
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?