Drone Attack: డ్రోన్దాడిలో లష్కరే హస్తం..?
జమ్మూ సైనిక స్థావరంపై జరిగిన డ్రోన్ దాడిలో పాకిస్థాన్కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా హస్తం ఉన్నట్లు జమ్మూ కశ్మీర్ పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.
జమ్మూ పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడి
దిల్లీ: జమ్మూ సైనిక స్థావరంపై జరిగిన డ్రోన్ దాడిలో పాకిస్థాన్కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా హస్తం ఉన్నట్లు జమ్మూ కశ్మీర్ పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఇప్పటికే దీన్ని ఉగ్రదాడిగా నిర్ధారించిన పోలీసులు.. దర్యాప్తును వేగవంతం చేశారు. పోలీసులు జరిపిన ప్రాథమిక దర్యాప్తులో ఉగ్రవాదుల వ్యూహాలకు సంబంధించిన పలు కీలక విషయాలు వెల్లడయ్యాయి. ఇదే సమయంలో ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (NIA)కు కేంద్ర ప్రభుత్వం అప్పగించింది.
జమ్మూలోని భారత వైమానిక కేంద్రంపై ఆదివారం జరిగిన డ్రోన్ దాడిని ఉగ్రదాడేనని జమ్మూ&కశ్మీర్ డీజీపీ దిల్బాగ్ సింగ్ ఇదివరకే స్పష్టం చేశారు. ఆ కోణంలో దర్యాప్తు జరుపుతోన్న పోలీసులు.. ఉగ్రవాదులు అనుసరిస్తోన్న వ్యూహాలకు సంబంధించి పలు ఆసక్తికరమైన విషయాలు గుర్తించారు. దాడులు జరిపేందుకు చీకటి సమయాన్ని ఎంచుకున్న ముష్కరులు.. తక్కువ ఎత్తులో ఎగిరే డ్రోన్ల సహాయంతో పేలుడు పదార్థాలను వైమానిక స్థావరంపై వేసేందుకు ప్రయత్నించారని తేలింది. ఈ తరహా దాడి జరగడం ఇదే మొదటిసారి అని జమ్మూ పోలీసులు పేర్కొన్నారు. పేలుడు పదార్థాలను జారవిడిచిన అనంతరం రాత్రి వేళల్లో ఆ డ్రోన్లు సరిహద్దు వెంట వెనక్కి తిరిగి వెళ్లిపోయాయా? లేక మరో లక్ష్యం వైపు వెళ్లాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నామని చెప్పారు. ఆ పేలుడు పదార్థాలను మోసుకొచ్చిన డ్రోన్ల మార్గాన్ని గుర్తించేందుకు వైమానిక కేంద్రం సరిహద్దు గోడలకు ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.
ఇక ఆదివారం వాయుసేన వైమానిక స్థావరంపై డ్రోన్ల దాడి జరిగి 24 గంటలు కాకముందే (సోమవారం తెల్లవారుజామున) మరో భారత సైనిక స్థావరంపై దాడి చేసేందుకు భారీ కుట్ర జరిగింది. అయితే, సైన్యం అప్రమత్తతతో అది భగ్నమైంది. రత్నచక్, కాలూచక్ సైనిక ప్రాంతంపై ఆదివారం రాత్రి 11.45 గంటలకు ఒక డ్రోన్, అర్ధరాత్రి తర్వాత 2.40 గంటలకు ఇంకో డ్రోన్ తిరిగాయి. రెండూ క్వాడ్కాప్టర్లే. వీటి కదలికలను వెంటనే కనిపెట్టిన సైన్యం 25 రౌండ్ల కాల్పులు జరిపింది. దీంతో అవి చీకట్లో వేగంగా తప్పించుకొన్నాయి.
ఇదిలాఉంటే, జమ్మూ వైమానిక స్థావరంపై జరిగిన డ్రోన్ దాడి ఘటన దర్యాప్తును కేంద్ర ప్రభుత్వం జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ)కు అప్పగించింది. మరోవైపు దాడికి ఉపయోగించిన పేలుడు పదార్థాలపై జాతీయ భద్రతాదళం (ఎన్ఎస్జీ)కు చెందిన ప్రత్యేక స్క్వాడ్ బృందం విచారణ చేపట్టింది. దాడిలో ఆర్డీఎక్స్ లేదా టీఎన్టీ బాంబులను ఉపయోగించి ఉంటారనే అనుమానిస్తున్నారు. అయితే, ఫుడ్, మెడిసిన్ డెలివరీ కోసం పాకిస్థాన్ చైనా నుంచి కొనుగోలు చేసిన డ్రోన్లను ఇందుకు ఉపయోగించి ఉండవచ్చనే అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. దాడి జరిగిన జమ్మూ ఎయిర్పోర్టు నుంచి అంతర్జాతీయ సరిహద్దు మధ్యదూరం 14కి.మీ ఉన్నట్లు సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.