
Kumaraswamy: జన్ధన్ ఖాతాలను హ్యాక్ చేసి.. రూ.6వేల కోట్లు దోచుకున్నారు..!
బిట్కాయిన్ నిందితుడే సూత్రధారి అన్న కుమారస్వామి
బెంగళూరు: బిట్కాయిన్ కుంభకోణం వ్యవహారం కర్ణాటక రాజకీయాలను కుదిపేస్తోంది. ఈ వ్యవహారంలో భాజపా నేతలున్నట్లు విపక్షాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. తాజాగా ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ నేత హెచ్డీ కుమారస్వామి మరిన్ని సంచలన ఆరోపణలు చేశారు. బిట్కాయిన్ స్కామ్ నిందితుడు.. జన్ధన్ ఖాతాలను హ్యాక్ చేసి వాటి నుంచి రూ.6వేల కోట్లు దోచుకున్నాడని ఆరోపించారు.
జేడీఎస్ పార్టీ జనతా పర్వ వర్క్షాపులో పాల్గొన్న కుమారస్వామి అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘‘జన్ధన్ ఖాతాలను హ్యాక్ చేసి.. వాటి నుంచి నగదును అక్రమంగా బదిలీ చేసినట్లు నా వద్ద సమాచారం ఉంది. ఆ మొత్తం విలువ రూ.6వేల కోట్లు. బిట్కాయిన్ కుంభకోణం నిందితుడే ఈ హ్యాకింగ్ సూత్రధారి. ఈ విషయం ప్రధానికి కూడా తెలుసనుకుంటా..’’ అని కుమారస్వామి వ్యాఖ్యానించారు.
కర్ణాటకకు చెందిన హ్యాకర్ శ్రీకృష్ణ అలియాస్ శ్రీకీ అనే వ్యక్తి నుంచి ఇటీవల అధికారులు రూ.9కోట్ల విలువైన బిట్కాయిన్లను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారం రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తోంది. ఈ కుంభకోణంలో ప్రభావవంతమైన రాజకీయ నేతలు ఉన్నట్లు ప్రతిపక్ష కాంగ్రెస్ ఆరోపిస్తోంది. బిట్కాయిన్ వ్యాపారాల్లో అధికార పక్షానికి చెందిన ప్రముఖులు, వారి పిల్లలు ఉన్నట్లు విపక్షనేత సిద్ధరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ తదితరులు తీవ్రంగా ఆరోపించారు. అధికారంలో ఉన్న భాజపా తక్షణమే ఈ వ్యవహారాన్ని సీబీఐ, ఈడీతో విచారణ జరిపించాలని సిద్ధరామయ్య డిమాండ్ చేశారు.
ఇదిలా ఉండగా.. శ్రీకృష్ణ గతంలో ప్రభుత్వ వెబ్సైట్లను హ్యాకింగ్ చేసిన కేసుల్లోనూ నిందితుడిగా ఉన్నాడు. క్రిప్టో కరెన్సీ ద్వారా డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నట్లు కూడా అతడిపై ఆరోపణలున్నాయి.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Chemist killing: నుపుర్ శర్మ వివాదంలో మరో హత్య ..! దర్యాప్తు ఎన్ఐఏ చేతికి..
-
India News
IRCTC: కప్ టీ ₹70.. రైల్వే ప్రయాణికుడి షాక్.. ట్వీట్ వైరల్!
-
Politics News
Pawan Kalyan: కుల, మతాల ప్రస్తావన లేని రాజకీయాలు రావాలి: పవన్
-
General News
Diabetes food chart: ఇవి తినండి...షుగర్ తగ్గించుకోండి
-
Movies News
Samantha: విజయ్ దేవరకొండ రూల్స్ బ్రేక్ చేయగలడు: సమంత
-
World News
Ukraine crisis: ఉక్రెయిన్కు అమెరికా మరోసారి చేయూత.. 820 మిలియన్ డాలర్ల సాయం ప్రకటన
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- RaviShastri: బుమ్రా బ్యాటింగ్కు రవిశాస్త్రి ఫిదా.. బీసీసీఐ ప్రత్యేక వీడియో..!
- IND vs ENG: ముగిసిన రెండో రోజు ఆట.. టీమ్ఇండియాదే పైచేయి
- Vikram: విక్రమ్ న్యూ ఏజ్ కల్ట్ క్లాసిక్.. అందుకు నా అర్హత సరిపోదు: మహేశ్బాబు
- Diabetes food chart: ఇవి తినండి...షుగర్ తగ్గించుకోండి
- తప్పుడు కేసుపై 26 ఏళ్లుగా పోరాటం.. నిర్దోషిగా తేలిన 70ఏళ్ల వృద్ధుడు
- social look: లవ్లో పడిన రష్మి.. జిమ్లో పడిన విద్యురామన్.. ‘శ్రద్ధ’గా చీరకడితే..
- Health Tips:అధిక రక్తపోటుతో కిడ్నీలకు ముప్పు..నివారణ ఎలాగో తెలుసా..?
- Congress: తెలంగాణ కాంగ్రెస్లో చిచ్చు రేపిన యశ్వంత్సిన్హా పర్యటన
- Raghurama: రెండేళ్ల తర్వాత భీమవరం రానున్న రఘురామ.. అభిమానుల బైక్ ర్యాలీ
- IND vs ENG: యువరాజ్ సింగ్ను గుర్తుచేసిన బుమ్రా