Karnataka Polls: సంప్రదింపులు షురూ..! మరి జేడీఎస్ మద్దతు ఎవరికో..?
కర్ణాటక ఎన్నికల్లో (Karnataka Elections) ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవచ్చని.. జేడీఎస్ మరోసారి కింగ్మేకర్ అవనుందని ఎగ్జిట్ పోల్స్ (Exit Polls) అంచనా వేశాయి. దీంతో తమ మద్దతు కోసం కాంగ్రెస్, భాజపాలు తమను సంప్రదించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాయని జేడీఎస్ చెబుతోంది.
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల (Karnataka Elections) ఫలితాలపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఈ ఎన్నికలను జాతీయ పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ఈ తరుణంలో కాంగ్రెస్వైపు ఓటర్లు మొగ్గుచూపారని.. అధికార భాజపాకు ప్రతికూల ఫలితం రావొచ్చని ఎగ్జిట్ పోల్స్ (Exit Polls) అంచనా వేశాయి. దీంతో హంగ్ ప్రభుత్వం తప్పకపోవచ్చని.. దేవేగౌడ నేతృత్వంలోని జేడీఎస్ (JDS) మరోసారి ‘కింగ్మేకర్’ అయ్యే అవకాశాలున్నాయని పేర్కొన్నాయి. దీంతో భాజపా, కాంగ్రెస్ పార్టీలు ముందస్తుగానే జేడీఎస్తో సంప్రదింపులు జరిపేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాయనే వార్తలు వినిపిస్తున్నాయి.
కర్ణాటకలో కింగ్మేకర్ కాకుండా తామే ‘కింగ్’ అవుతామంటూ జేడీఎస్ నేత కుమారస్వామి మొదటి నుంచి చెబుతున్నారు. అయితే, ఎవరికి మద్దతు ఇస్తారనే విషయంపై మాత్రం ఏవిధమైన ప్రకటన చేయలేదు. అటు భాజపా, కాంగ్రెస్లు కూడా జేడీఎస్తో చేతులు కలిపే ప్రసక్తే లేదని ప్రకటనలు చేస్తున్నాయి. ఈ విషయంపై భాజపా ఇదివరకే ప్రకటన చేయగా.. కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ కూడా ఎన్నికల తర్వాత జేడీఎస్తో పొత్తుపెట్టుకునే విషయాన్ని తోసిపుచ్చారు.
ఇప్పటికే నిర్ణయం జరిగిందా..?
మీడియా కథనాల ప్రకారం.. జేడీఎస్ ఇప్పటికే ఓ నిర్ణయం తీసుకుందట. సరైన సమయంలో విషయం వెల్లడిస్తామని జేడీఎస్ ఓ సీనియర్ నేత తన్వీర్ అహ్మద్ వెల్లడించారు. కాంగ్రెస్, భాజపా రెండు పార్టీలు తమను సంప్రదించేందుకు ప్రయత్నాలు చేస్తాయని.. తమ మద్దతు లేకుండా ఏ పార్టీ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితిలో లేవన్నారు. హెచ్డీ కుమారస్వామి ప్రస్తుతం సింగపూర్లో ఉన్నారు. సాధారణ వైద్య పరీక్షల కోసం ఆయన అక్కడికి వెళ్లినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. కౌంటింగ్ రోజున (మే 13) కుమారస్వామి తిరిగి బెంగళూరుకు చేరుకుంటారని తెలిపాయి. అయితే, తాజా రాజకీయాలపై అక్కడ నుంచే ఆయన మంతనాలు జరుపుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.
తాజా ఎన్నికల్లో కర్ణాటక ఓటర్లు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపినట్లు మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. అయినప్పటికీ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ ఏ పార్టీకి రాకపోవచ్చని చెప్పాయి. ఈ నేపథ్యంలో మాజీ ప్రధాని దేవేగౌడ అభిలాష మేరకు జేడీఎస్ కాంగ్రెస్కే మద్దతు ఇవ్వనుందని పార్టీ వర్గాల నుంచి వచ్చిన విశ్వసనీయ సమాచారం. ఏఐసీసీ జనరల్ సెక్రటరీ రణ్దీప్ సింగ్ సూర్జేవాలా ఇదే విషయంపై సిద్ధరామయ్యతో మంతనాలు కొనసాగిస్తున్నారు. అయితే, జేడీఎస్ను సంప్రదించినట్లు వస్తున్న వార్తలను భాజపా, కాంగ్రెస్లు తోసిపుచ్చాయి. తమకి స్పష్టమైన మెజార్టీ వస్తుందని.. సంకీర్ణ ప్రభుత్వానికి అవకాశమే లేదని భాజపా విశ్వాసం వ్యక్తం చేసింది. కాంగ్రెస్ కూడా తమ పార్టీ 141 సీట్లు సాధించి ఒంటరిగానే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని వెల్లడించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
-
మంత్రి కాకాణి అనుచరుడి రైస్ మిల్లులో మద్యం స్వాధీనం
-
జగనన్న నవ్వులు.. జనాలకు చుక్కలు
-
తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. కూలీ బిడ్డకు 993 మార్కులు
-
ఏ ముఖం పెట్టుకుని రాజధాని రైతులను సీఎం ఓట్లు అడుగుతారు
-
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి