JEE Main పరీక్షలు వాయిదా
శంలో కరోనా ఉద్ధృతి దృష్ట్యా జేఈఈ మెయిన్ (మే సెషన్) పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి. విద్యార్థుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని ....
దిల్లీ: దేశంలో కరోనా ఉద్ధృతి దృష్ట్యా జేఈఈ మెయిన్ (మే సెషన్) పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి. విద్యార్థుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని ఈ పరీక్షలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) వాయిదా వేసినట్టు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ వెల్లడించారు. మే 24 నుంచి 28వరకు మే సెషన్ జేఈఈ మెయిన్స్ పరీక్షలు జరగాల్సి ఉంది. తదుపరి అప్డేట్స్ కోసం ఎన్టీఏ వెబ్సైట్ను సందర్శించాలని విద్యార్థులకు పోఖ్రియాల్ విజ్ఞప్తి చేశారు.
విద్యార్థుల సౌకర్యార్థం ఈ ఏడాది నాలుగు విడతల్లో జేఈఈ మెయిన్స్నిర్వహించేందుకు ఎన్టీఏ షెడ్యూల్ ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే రెండు విడతలు ఫిబ్రవరి (23 నుంచి 26 వరకు); మార్చి 16 నుంచి 18 తేదీల్లో పరీక్షలు పూర్తయ్యాయి. మూడో విడత పరీక్షలు ఏప్రిల్ 27 నుంచి 30 వరకు జరగాల్సి ఉన్నప్పటికీ కొవిడ్ ఉద్ధృతి వేళ వాటినీ ఇటీవల వాయిదా పడ్డాయి. దీంతో ఏప్రిల్, మే సెషన్లకు సంబంధించిన పరీక్ష తేదీలను రీషెడ్యూల్ చేయనున్నారు. తొలి విడత పరీక్షలను 6,20,978 మంది విద్యార్థులు రాయగా.. రెండో సెషన్ పరీక్షలను 5,56,248మంది విద్యార్థులు రాసినట్టు ఎన్టీఏ తెలిపింది. మరోవైపు, ఎన్టీఏ అభ్యాస్ యాప్ ద్వారా ఈ పరీక్షలకు విద్యార్థులు ప్రిపేర్ కావొచ్చని సూచించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.