జేఈఈ మెయిన్స్ దరఖాస్తుల గడువు పొడిగింపు
జేఈఈ మెయిన్స్ మొదటి పరీక్ష ఆన్లైన్ దరఖాస్తుల గడువును జాతీయ పరీక్షల సంస్థ (ఎన్టీఏ) పొడిగించింది.......
దిల్లీ: జేఈఈ మెయిన్స్ మొదటి పరీక్ష ఆన్లైన్ దరఖాస్తుల గడువును జాతీయ పరీక్షల సంస్థ (ఎన్టీఏ) పొడిగించింది. ఈ నెల 23వరకు దరఖాస్తులు చేసుకోవచ్చని తెలిపింది. ఆన్లైన్లో పరీక్ష ఫీజు చెల్లించేందుకు ఈ నెల 24వ తేదీ వరకు గడువు విధించింది. ఈనెల 27 నుంచి 30 వరకు దరఖాస్తుల్లో మార్పులు, చేర్పులు చేసుకోవచ్చని విద్యార్థులకు ఎన్టీఏ సూచించింది. గత ఏడాది డిసెంబరు 16న మొదలైన జేఈఈ మెయిన్స్ దరఖాస్తు గడువు శనివారంతో ముగిసింది. అయితే గోరఖ్పూర్లోని మదన్మోహన్ మాలవీయ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీలో బీటెక్ సీట్లను జేఈఈ మెయిన్స్ స్కోర్ ఆధారంగా భర్తీ చేయాలని తాజాగా నిర్ణయించారు. ఈ నేపథ్యంలో జేఈఈ మెయిన్స్ దరఖాస్తుల గడువును పొడిగించినట్లు ఎన్టీఏ వెల్లడించింది.
ఇవీ చదవండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
వేసవి రద్దీని తీర్చేందుకు రైల్వేశాఖ సిద్ధమైంది. ఈ సీజన్లో దేశవ్యాప్తంగా 9,111 అదనపు ట్రిప్పులు నడపనున్నట్లు ప్రకటించింది. -
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా? UPSC పరీక్షల మార్కుల షీట్లు విడుదల
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో తొలి 10 మంది టాపర్లు సాధించిన మార్కులు ఇవే..