మ్యాజిక్ ఫిగర్కి చేరువలో బైడెన్
అమెరికా ఎన్నికల్లో అధ్యక్షుడు ట్రంప్, ప్రత్యర్థి బైడెన్ హోరాహోరీగా తలపడుతున్నారు. అయితే డెమొక్రటిక్ అభ్యర్థి బైడెన్ కీలక రాష్ట్రాలను గెలుచుకుంటూ వెళ్తున్నారు. తాజాగా మిషిగన్(16)లో బైడెన్ విజయం సాధించారు. ఈ గెలుపుతో బైడెన్ 264 ఎలక్టోరల్ ఓట్లు సాధించారు. దీంతో శ్వేత సౌధానికి వైపుగా
కీలక రాష్ట్రం మిషిగన్లో గెలిచిన డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి
ఇంటర్నెట్డెస్క్: అమెరికా ఎన్నికల్లో అధ్యక్షుడు ట్రంప్, ప్రత్యర్థి బైడెన్ హోరాహోరీగా తలపడుతున్నారు. అయితే డెమొక్రటిక్ అభ్యర్థి బైడెన్ కీలక రాష్ట్రాలను గెలుచుకుంటూ వెళ్తున్నారు. తాజాగా మిషిగన్(16)లో బైడెన్ విజయం సాధించారు. ఈ గెలుపుతో బైడెన్ 264 ఎలక్టోరల్ ఓట్లు సాధించారు. దీంతో శ్వేత సౌధానికి వైపుగా బైడెన్ అడగులు పడుతున్నాయి. ప్రస్తుతం ట్రంప్ 214 ఓట్లు సాధించారు. మిషిగన్ ఎన్నికల ఫలితాలపై అధ్యక్షుడు ట్రంప్ అక్కడి రాష్ట్ర కోర్టులో దావా వేశారు. ఓటింగ్ ప్రక్రియలో అవకతవకలు జరిగాయని రిపబ్లిక్ ప్రచార బృందం దావాలో పేర్కొంది.
72ఏళ్ల తర్వాత అరిజోనాలో డెమొక్రాట్లు..
ఏడు దశాబ్దాల సుదీర్ఘ విరామం తర్వాత డెమొక్రాట్లకు అరిజోనా మద్దతు లభించింది. అరిజోనాలో ఉన్న 11ఎలక్టోరల్ ఓట్ల మద్దతు ఈసారి బైడెన్కే లభించింది. అంతేకాకుండా సెనేట్ స్థానాన్ని కూడా డెమొక్రాట్లకే కైవసం చేసుకున్నారు. 1952 సంవత్సరం నుంచి ఇక్కడ రిపబ్లికన్లే గెలుస్తూ వస్తున్నారు. ఎన్నో దశాబ్దాలుగా ఇక్కడ పాగా వేసి ఆధిపత్యం చెలాయించిన రిపబ్లికన్లపై పైచేయి సాధించడంతో డెమొక్రాట్లు ఆనందంలో ఉన్నారు. ఇక్కడ గెలిచేందుకు గత దశబ్దం కాలంగా తీవ్ర ప్రయత్నం చేస్తోన్న డెమొక్రాట్లు చివరకు విజయం సాధించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా