ఒక్క డోసులో టీకా..ఆశాజనకంగా ఫలితాలు
ఒకే ఒక్క డోసుతో కొవిడ్-19 నుంచి రక్షణ కల్పించగల సామర్థ్యమున్న టీకాను అభివృద్ధి చేస్తున్న అమెరికాకు చెందిన జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ మరో ముందడుగేసింది. ఇప్పటికే ప్రభుత్వ అనుమతితో 1000 మంది వాలంటీర్లపై ఈ వ్యాక్సిన్ను ప్రయోగించగా ఉత్తమ ఫలితాలు వచ్చాయి. దీంతో బుధవారం మానవులపై తుది దశ ప్రయోగపరీక్షలు ప్రారంభం కాగా....
న్యూయార్క్: ఒకే ఒక్క డోసుతో కొవిడ్-19 నుంచి రక్షణ కల్పించగల సామర్థ్యమున్న టీకాను అభివృద్ధి చేస్తున్న అమెరికాకు చెందిన జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ మరో ముందడుగేసింది. ఇప్పటికే ప్రభుత్వ అనుమతితో 1000 మంది వాలంటీర్లపై ఈ వ్యాక్సిన్ను ప్రయోగించగా ఉత్తమ ఫలితాలు వచ్చాయి. దీంతో బుధవారం మానవులపై తుది దశ ప్రయోగపరీక్షలు ప్రారంభం కాగా.. అందులోనూ ఫలితాలు ఆశాజనకంగా వస్తున్నట్లు సంస్థ మధ్యంతర ఫలితాలను విడుదల చేసింది. ఈ ప్రయోగాల్లో భాగంగా అమెరికా, దక్షిణాఫ్రికా, అర్జెంటీనా, బ్రెజిల్, చిలీ, కొలంబియా, మెక్సికో, పెరూల్లో మొత్తం 60 వేల మంది వాలంటీర్ల పై ఈ వ్యాక్సిన్ ప్రయోగిస్తున్నారు. అయితే 65 ఏళ్లకు పైబడిన 15 మందికి మాత్రమే ఈ వ్యాక్సిన్ ఇస్తున్నారు. వాలంటీర్లలో వ్యాధి నిరోధక స్థాయిలను ఎప్పటికప్పుడు గమనిస్తున్నామని సంస్థ వెల్లడించింది.
చివరి దశ ప్రయోగాలు విజయవంతమైతే ఈ ఏడాది చివరిలోగానీ, వచ్చే ఏడాది ప్రారంభంలో వ్యాక్సిన్ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు జాన్సన్ అండ్ జాన్సన్ వెల్లడించింది. మొదటి ప్రయోగదశలో భాగంగా గత జులైలో తొలుత కోతులపై ఈ వ్యాక్సిన్ను ప్రయోగించారు. అయితే కరోనా వైరస్ ముప్పు అధికంగా ఉన్న వయస్సు మళ్లినవారిపై ఈ టీకా ప్రభావం చూపిస్తుందా?అన్ని రకాల వయస్సుల వారికి ఒకే డోస్ ఇవ్వడం వల్ల వ్యతిరేక ప్రభావాలేమైనా కనిపిస్తాయా? అనే అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. దీనిపై పూర్తి వివరాలు తెలియాలంటే చివరిదశ ప్రయోగ ఫలితాలు వచ్చేంత వరకు వేచిచూడాల్సిందేనని హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డా.బ్యారీ బ్లూమ్ మీడియాకు తెలిపారు. సాధారణంగా ఏదైనా టీకా మంచి ఫలితాలనివ్వాలంటే కనీసం రెండు డోసులను తీసుకోవాల్సి ఉంటుందని.. అందుకు భిన్నంగా ఒకే ఒక్క డోసుతో కరోనా నుంచి రక్షణ కల్పించేలా తమ వ్యాక్సిన్ను అభివృద్ధి చేశామని జాన్సన్ అండ్ జాన్సన్ ప్రధాన శాస్త్రీయ అధికారి డాక్టర్ పాల్ స్టోఫెల్స్ గతంలో చెప్పిన విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.