Joshimath: ప్రమాదం అంచున జోషీమఠ్.. ఇదే పరిస్థితి కొనసాగితే..!
జోషీమఠ్ ప్రాంతంలో భూమి ఏడాదికి దాదాపు 10 సెంటీమీటర్ల మేర కుంగిపోతోందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఈ ప్రక్రియ 2018 నుంచి జరుగుతున్నట్లు తెలిపింది.
దేహ్రాదూన్: ఉత్తరాఖండ్ (Uttarakhand)లోని జోషీమఠ్ (Joshimath) లో పరిస్థితులు గత కొంతకాలంగా ఆందోళన కలిగిస్తున్నాయి. కేవలం 12 రోజుల వ్యవధిలోనే 5.4 సెంటీమీటర్ల మేర అక్కడి భూమి కుంగిపోయినట్లు ఇస్రో (ISRO) ఇటీవల వెల్లడించింది. దీనికి మరింత బలం చేకూరేలా తాజా నివేదికలు వెల్లడిస్తున్న వివరాలు ఆందోళన కలిగిస్తున్నాయి. జోషీమఠ్లో భూమి కుంగిపోవడం ఇప్పుడు కొత్తేం కాదని, 2018 నుంచి ఏడాదికి దాదాపు 10 సెంటీమీటర్ల మేర భూమి కుంగిపోతోందని ఓ అధ్యయనంలో తేలింది. గ్రీస్ దేశంలో అరిస్టాటిల్ యూనివర్సిటీ ఆఫ్ థెస్సలోన్కి (ఏయూటీహెచ్), సెంటర్ నేషనల్ డి లా రీసెర్చ్ సైంటిఫిక్ యూనివర్సిటీ ఆఫ్ స్ట్రాస్బర్గ్ (సీఎన్ఆర్ఎస్-ఈఓఎస్టీ) సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనంలో ఈ మేరకు వెల్లడైంది. గత నాలుగు సంవత్సరాలుగా జోషీమఠ్ ప్రాంతంలో భౌగోళికంగా చోటు చేసుకుంటున్న మార్పులను శాస్త్రవేత్తలు ఉపగ్రహ ఛాయాచిత్రాల ఆధారంగా పరిశీలించారు. దీని కోసం అధునాతన సాంకేతికతను వినియోగించారు.
తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో జోషీమఠ్ రీజియన్లోని సరిహద్దు ప్రాంతాల్లో జనవరి 2018 నుంచి డిసెంబరు 31,2022 మధ్య ఉపగ్రహ ఛాయాచిత్రాలను శాస్త్రవేత్తలు పరిశీలించారు. పట్టణీకరణలో భాగంగా ఏటవాలు ప్రాంతాలను చదును చేయడం, నీటిపారుదల వ్యవస్థకు ఆటంకం కలిగించడంతో గడిచిన 4 ఏళ్లలో భూగర్భంలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయని, ఫలితంగా ఉపరితలంపై పగుళ్లు ఏర్పడుతున్నాయని తమ నివేదికలో పేర్కొన్నారు. భూ ఉపరితలంపై చోటు చేసుకుంటున్న మార్పులను గుర్తించేందుకు శాస్త్రవేత్తలు అధునాతన ఇంటర్ఫెరోమెట్రిక్ సింథటిక్ అపెర్చర్ రేడార్ (ఐఎన్ఎస్ఏఆర్) విధానాన్ని ఉపయోగించారు. ఒకే ప్రాంతానికి సంబంధించిన ఉపగ్రహ చిత్రాలను వాటిని, మునుపటి ఏడాదిలో అదే సమయంలో భూ ఉపరితలం ఎలా ఉందో సరిపోల్చారు. ఇలా రెండు చిత్రాల మధ్య తేడాను గుర్తించేందుకు సర్ఫేస్ మోషన్ మ్యాపింగ్ సంకేతికతను ఉపయోగించారు. ఇలా వరుసగా నాలుగేళ్ల చిత్రాలను సేకరించి పరిశోధిస్తే సరాసరిన ఏడాదికి 10 సెంటీమీటర్ల మేర భూమి కుంగిపోతున్నట్లు తేలింది.
గఢ్వాల్ హిమాలయ ప్రాంతంలో తొలిసారిగా పగుళ్లు ఏర్పడి తర్వాత.. దీనికి కారణాలు తెలుసుకోమని అప్పటి ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వం 1976లో మిశ్రా కమిటీని ఏర్పాటు ఏసింది. దీని ప్రకారం జోషీమఠ్ ప్రాంతం ఏటవాలు ప్రాంతంలో ఉందని, అంతేకాకుండా పురాతన శిలలపై నిర్మితమై ఉన్నందున ఇవి కుంగిపోయే ప్రమాదముందని ఆ కమిటీ నివేదిక ఇచ్చింది. భారీ కట్టడాలకు, బహుళ అంతస్తుల భవనాలకు ఈ నేల సరైనది కాదని అప్పట్లోనే నివేదిక ఇచ్చింది. అయితే ప్రభుత్వాలు మాత్రం ఆ నివేదికను పెద్దగా పట్టించుకోలేదు. తాజాగా ఏయూటీహెచ్, ఈఎన్ఆర్ఎస్ శాస్త్రవేత్తల బృందం కూడా మిశ్రా కమిటీ నివేదికను సమర్థించింది. సరైన మురుగునీటి వ్యవస్థలు కూడా లేకపోవడం భూ పొరల్లో మార్పులకు కారణమవుతోందని చెప్పింది. వెంటనే నివారణ చర్యలు చేపట్టాలని లేదంటే తీవ్ర పరిమాణాలు ఎదురయ్యే అవకాశముందని శాస్త్రవేత్తల బృందం హెచ్చరించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టెలికాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా..? అయితే జాగ్రత్త..!
Fake Calls: టెలికాం శాఖ పేరుతో మీకు కాల్స్ వస్తున్నాయా?ఫోన్ నంబరు డిస్కనెక్ట్ చేస్తామని బెదిరిస్తున్నారా? అయితే జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది కేంద్ర ప్రభుత్వం. -
‘పన్ను ఉగ్రవాదాన్ని ఆపండి’.. రూ.1823 కోట్ల నోటీసులపై కాంగ్రెస్ మండిపాటు
ఆదాయ పన్ను విభాగం నుంచి నోటీసు రావడంపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. లోక్సభ ఎన్నికలకు ముందు తమను ఆర్థికంగా కుంగదీసేందుకు భాజపా పన్ను ఉగ్రవాదానికి పాల్పడుతోందని ఆరోపించింది. -
కేజ్రీవాల్ కోసం మెసేజ్లు పంపండి.. వాట్సప్ నంబరు షేర్ చేసిన సతీమణి
Sunita Kejriwal: ఈడీ కస్టడీలో ఉన్న దిల్లీ సీఎం కేజ్రీవాల్కు మద్దతుగా ఆయన సతీమణి సునీత వాట్సప్ ప్రచారాన్ని ప్రారంభించారు. -
కేజ్రీవాల్ ఫోన్లోని ఎన్నికల వ్యూహాల కోసం.. ఈడీ ప్రయత్నాలు: ఆతిశీ
Arvind Kejriwal: కస్టడీలో ఉన్న దిల్లీ సీఎం కేజ్రీవాల్ ఫోన్ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ వ్యూహాలను తెలుసుకునేందుకు ఈడీ ప్రయత్నిస్తోందని ఆప్ మంత్రి ఆతిశీ ఆరోపించారు. -
ఉత్తర్ప్రదేశ్లో హైఅలర్ట్.. గ్యాంగ్స్టర్ ముఖ్తార్ మృతిపై కుటుంబం అనుమానాలు!
Mukhtar Ansari: గ్యాంగ్స్టర్, రాజకీయ నాయకుడు ముఖ్తార్ అన్సారీ మృతితో యూపీలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. మరోవైపు కుటుంబ సభ్యులు మాత్రం ఆయన గుండెపోటుతో మరణించలేదని ఆరోపిస్తున్నారు. -
కాంగ్రెస్కు మళ్లీ షాక్.. రూ.1800 కోట్ల పన్ను నోటీసులు
Congress: కాంగ్రెస్కు ఆదాయపు పన్ను విభాగం రూ.1800 కోట్లకు నోటీసులిచ్చింది. ఈ వ్యవహారంపై పార్టీ వేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టేసిన మరుసటి రోజే ఈ పరిణామం చోటుచేసుకుంది. -
ప్రధాని మోదీ, బిల్గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
Modi-Bill Gates: ప్రధాని మోదీతో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్గేట్స్ ‘చాయ్ పే చర్చ’లో పాల్గొన్నారు. డిజిటల్ విప్లవం, ఆరోగ్యం, విద్య తదితర అంశాలపై ఇరువురు చర్చించారు. -
‘అగ్నివీర్’లో మార్పులకు సిద్ధం: రాజ్నాథ్
ప్రస్తుతం అమలవుతున్న అగ్నివీర్/అగ్నిపథ్ నియామక పథకంలో అవసరమైతే మార్పులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. -
టికెట్ రాలేదని ఆత్మహత్యాయత్నం చేసిన ఎంపీ కన్నుమూత
ఎన్నికల ముంగిట తమిళనాడులో విషాదం చోటుచేసుకుంది. టికెట్ దక్కలేదనే మనస్తాపంతో ఈ నెల 24న ఆత్మహత్యాయత్నం చేసిన ఈరోడ్ ఎంపీ, ఎండీఎంకే సీనియర్ నేత ఎ.గణేశమూర్తి(77) కోయంబత్తూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం చనిపోయారు. -
తేజస్ ఎంకే1ఏ తొలి విహారం విజయవంతం
తేజస్ ఎంకే1ఏ శ్రేణిలో రూపొందిన యుద్ధ విమానం ఎల్ఏ-5003 తన తొలి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. పూర్తిస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) ఈ యుద్ధ విమానాన్ని రూపొందించింది. -
ఐరాస సెక్రటరీ జనరల్ ప్రత్యేక ప్రతినిధిగా కమల్ కిశోర్
జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(ఎన్డీఎంఏ) ఉన్నతాధికారి కమల్ కిశోర్ (55).. ఐక్యరాజ్యసమితి(ఐరాస) సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ప్రత్యేక ప్రతినిధిగా నియమితులయ్యారు. -
గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో ఆస్పత్రిలో మృతి
ఉత్తర్ప్రదేశ్ జైలులో శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్స్టర్, రాజకీయవేత్త ముఖ్తార్ అన్సారీ (63) గురువారం గుండెపోటుతో మృతిచెందినట్లు బాందాలోని రాణీ దుర్గావతి వైద్య కళాశాల ప్రిన్సిపల్ సునీల్ కౌశల్ ప్రకటించారు. -
‘కాలివేళ్లతో’ విధిరాత లిఖించుకున్న అపరబ్రహ్మ
సంకల్పబలం ఉంటే లక్ష్య సాధనకు ఏ వైకల్యమూ అడ్డుకాదని నిరూపిస్తున్నారు ఉత్తరాఖండ్కు చెందిన 58 ఏళ్ల దేవ్కీనందన్ శర్మ. -
ఎలాంటి తప్పూ జరగలేదు
నేషనల్ ఏవియేషన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్ఏసీఐఎల్) విమానాల లీజు అంశంలో ఎలాంటి అవకతవకలు జరగలేదని సీబీఐ పేర్కొంది. -
ఈస్టర్ రోజున పనిదినం.. వెనక్కు తగ్గిన మణిపుర్ ప్రభుత్వం
ఈస్టర్ రోజును పనిదినంగా ప్రకటిస్తూ మణిపుర్ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను గురువారం వెనక్కు తీసుకుంది. -
కేజ్రీవాల్ పాస్వర్డులు చెప్పలేదు
మద్యం విధానానికి సంబంధించిన కేసులో అరెస్టయిన దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ 4 డిజిటల్ పరికరాల పాస్వర్డులను చెప్పలేదని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తెలిపింది. -
మరోసారి తండ్రైన పంజాబ్ సీఎం మాన్
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్(50) మరోసారి తండ్రయ్యారు. ఆయన సతీమణి గుర్ప్రీత్ కౌర్ గురువారం పండంటి పాపకు జన్మనిచ్చారు. -
మేం జోక్యం చేసుకోలేం
మద్యం విధానానికి సంబంధించిన కేసులో అరెస్టయిన ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ను సీఎం పదవి నుంచి తప్పించాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) దిల్లీ హైకోర్టు గురువారం కొట్టివేసింది. -
ఐరాస శాంతి పరిరక్షకుల నేరాలపై డేటాబేస్ ప్రారంభించిన భారత్
ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షకులపై నమోదైన నేరాల నిక్షిప్తానికి, సదరు నిందితుల విచారణలో పురోగతిని పర్యవేక్షించడానికి భారతదేశం కొత్త డేటాబేస్ను రూపొందించిందని ఐరాస భారత ప్రతినిధి రుచిరా కాంబోజ్ గురువారం తెలిపారు. -
నెట్ మార్కుల ఆధారంగా పీహెచ్డీ ప్రవేశాలు: యూజీసీ
వచ్చే విద్యా సంవత్సరం నుంచీ జాతీయ అర్హత పరీక్ష (ఎన్ఈటీ) మార్కుల ఆధారంగా పీహెచ్డీ ప్రవేశాలు కల్పించనున్నట్లు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) తెలిపింది. -
అండర్ గ్రాడ్యుయేట్ ప్రవేశాలకు కామన్ కౌన్సెలింగుకు యోచన!
మెడికల్, ఇంజినీరింగ్ కోర్సుల తరహాలో సీయూఈటీ (కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్) మార్కుల ఆధారంగా అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల ప్రవేశాలకు కామన్ కౌన్సెలింగు నిర్వహించాలని యూజీసీ యోచిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఆ నగ్న ఊరేగింపు ఫొటోకు అవార్డు.. నెట్టింట ఆగ్రహం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుంది: కేటీఆర్
-
ఉపాధ్యాయ బదిలీల్లో రూ.వందల కోట్ల కుంభకోణం: నాదెండ్ల మనోహర్
-
ఏప్రిల్ 1 నుంచి ఇ-బీమా.. ఇంతకీ ఏమిటిది? ఎవరికి ప్రయోజనం?
-
కేజ్రీవాల్కు సమయం లేదు.. అందుకే ఈ ప్రయత్నాలు! : పూరి