Bombay High Court: అత్యాచారాలపై వివాదాస్పద తీర్పుల జడ్జి పుష్ప రాజీనామా!
చిన్నారులపై లైంగిక వేధింపుల కేసుల్లో వివాదాస్పద తీర్పులు ఇచ్చి.. కేంద్రబిందువుగా మారిన బాంబే హైకోర్టు మహిళా న్యాయముర్తి జస్టిస్ పుష్ప గనేడివాలా తన పదవికి రాజీనామా చేశారు.....
ముంబయి: చిన్నారులపై లైంగిక వేధింపుల కేసుల్లో వివాదాస్పద తీర్పులు ఇచ్చి.. కేంద్రబిందువుగా మారిన బాంబే హైకోర్టు మహిళా న్యాయముర్తి జస్టిస్ పుష్ప గనేడివాలా తన బాధ్యతలకు రాజీనామా చేశారు. అయితే పదవీ కాలం ముగిసే ఒక్క రోజు ముందే ఆమె రాజీనామా చేయటం గమనార్హం. అదనపు న్యాయమూర్తిగా ఆమె పదవీకాలం ఫిబ్రవరి 12తో పూర్తికానుంది.
జస్టిస్ గనేడివాలా ప్రస్తుతం బాంబే హైకోర్టులోని నాగ్పుర్ బెంచ్లో అదనపు న్యాయమూర్తిగా విధులు నిర్వర్తిస్తున్నారు. గతేడాది జనవరిలో రెండు లైంగిక వేధింపుల కేసుల్లో పుష్ప వివాదాస్పద తీర్పులు ఇచ్చారు. ఈ క్రమంలోనే పూర్తిస్థాయిలో న్యాయమూర్తి హోదా కల్పించాలనే ప్రతిపాదనను సుప్రీం కోర్టు కొలీజియం వెనక్కి తీసుకుంది. ఆమె అదనపు న్యాయమూర్తిగా పదవీ కాలాన్ని పొడగించటం, పూర్తిస్థాయి హోదా కల్పించటం వంటి వాటిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఫలితంగా పుష్ప డిమోట్ అయ్యి.. 2022, ఫిబ్రవరి 12 నుంచి జిల్లా సెషన్స్ జడ్జిగా వెళ్లాల్సి ఉంటుంది. ఈ కారణంగానే ఆమె రాజీనామా చేసినట్లు హైకోర్టు వర్గాలు వెల్లడించాయి. న్యాయమూర్తి రాజీనామాకు ఆమోదం లభించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
2021 జనవరిలో జస్టిస్ పుష్ప రెండు సంచలన తీర్పులు వెలువరించారు. 12 ఏళ్ల బాలిక ఛాతీ భాగాన్ని ఓ వ్యక్తి తడమగా.. చర్మం తగలనందున దీనిని లైంగిక వేధింపుల కింద పరిగణించలేమని జనవరి 19న జస్టిస్ పుష్ప నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం తీర్పు వెలువరించింది. దుస్తుల మీద నుంచి శరీరభాగాలను తాకడం వేధింపులుగా పేర్కొనలేమని.. లైంగిక ఉద్దేశంతో బాలిక దుస్తులు తొలగించి, లేదా దుస్తుల లోపలకి చేయి పెట్టి నేరుగా తాకితేనే అది లైంగిక వేధింపుల కిందకు వస్తుందని ధర్మాసనం పేర్కొంది.
అయిదేళ్ల బాలికపై లైంగిక వేధింపుల కేసులోనూ జస్టిస్ పుష్ప ఇలాంటి తీర్పునే ఇచ్చారు. మైనర్ బాలికల చేతులు పట్టుకోవడం, వారి ముందు పురుషుడు ప్యాంటు జిప్ విప్పుకోవడం లైంగిక వేధింపుల కిందికి రావని తీర్పు వెలువరించారు. వేధింపుల నుంచి బాలికలను రక్షించే పోక్సో చట్టం కింద వీటిని నేరంగా పరిగణించలేమని పేర్కొంటూ నిందితులకు కింది కోర్టు విధించిన శిక్షలను రద్దు చేశారు. కాగా ఈ తీర్పులు తీవ్ర దుమారం రేపాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
వేసవి రద్దీని తీర్చేందుకు రైల్వేశాఖ సిద్ధమైంది. ఈ సీజన్లో దేశవ్యాప్తంగా 9,111 అదనపు ట్రిప్పులు నడపనున్నట్లు ప్రకటించింది. -
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా? UPSC పరీక్షల మార్కుల షీట్లు విడుదల
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో తొలి 10 మంది టాపర్లు సాధించిన మార్కులు ఇవే..
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం