ఈ నెల 8న కేంద్ర కేబినెట్ విస్తరణ!
కేంద్ర మంత్రివర్గ విస్తరణ ఇప్పుడో అప్పుడో జరుగుతుందని అనిపిస్తోంది ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే..!! కేబినెట్ రేసులో ప్రధానంగా వినిపిస్తోన్న జ్యోతిరాదిత్య సింధియా
ఇప్పటికే దిల్లీ బయల్దేరిన సింధియా, సోనోవాల్
దిల్లీ: కేంద్ర మంత్రివర్గ విస్తరణకు మోదీ సర్కారు సిద్ధమైంది. ఈ నెల 8వ తేదీన కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. గురువారం ఉదయం 10.30 గంటలకు మంత్రివర్గ విస్తరణ చేపట్టనున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే కేబినెట్ రేసులో ప్రధానంగా వినిపిస్తోన్న జ్యోతిరాదిత్య సింధియా సహా పలువురు నేతలు నేడు దిల్లీకి పయనమయ్యారు. అటు కేంద్రమంత్రిగా ఉన్న థావర్చంద్ గహ్లోత్ను నేడు కర్ణాటక గవర్నర్గా నియమించారు. దీంతో మంత్రివర్గంలో మార్పులు చేర్పులు జరగడం ఖాయంగా కనిపిస్తోంది. కేంద్ర కేబినెట్లో కొత్తగా 22 మందికి చోటు కల్పించే అవకాశాలు ఉన్నాయి. పలువురు మంత్రుల శాఖల్లోనూ మార్పులు జరగనున్నట్లు తెలుస్తోంది.
సింధియా పూజలు..
భాజపా నేత జ్యోతిరాదిత్య సింధియా ఈ ఉదయం ఇండోర్ నుంచి దిల్లీకి పయనమయ్యారు. బయల్దేరే ముందు ఉజ్జయిని మహంకాళీ ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు చేసి అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. అటు అస్సాం మాజీ ముఖ్యమంత్రి శర్వానంద సోనోవాల్ కూడా గువాహటి నుంచి దిల్లీ వెళ్లారు. భాజపా ఎంపీ నారాయణ్ రాణె కూడా దేశ రాజధానికి బయల్దేరారు. మరో భాజపా నేత సీపీ సింగ్ ఇప్పటికే దిల్లీ చేరుకున్నారు. కేబినెట్ రేసులో ఆయన పేరు కూడా వినిపిస్తోంది. అటు జేడీయూ సీనియర్ నేతలు లల్లన్ సింగ్, ఆర్సీపీ సిన్హా ఈ ఉదయమే దిల్లీకి వచ్చినట్లు తెలుస్తోంది.
2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్ నుంచి భాజపాలో చేరారు. దీంతో మధ్యప్రదేశ్లో భాజపా ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ఈ నేపథ్యంలో ఆయనకు కేంద్ర మంత్రి పదవి ఇస్తామని అప్పట్లో పార్టీ అధిష్ఠానం హామీ ఇచ్చింది. ఇక అస్సాం సీఎం రేను నుంచి తప్పుకుని హిమంత బిశ్వ శర్మకు అవకాశమిచ్చిన మాజీ ముఖ్యమంత్రి శర్వానంద సోనోవాల్ను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశాలున్నాయి.
జేడీయూకు ఒకటా.. రెండా..?
భాజపా మిత్రపక్షమైన జేడీయూకు కూడా ఈ సారి కేబినెట్లో స్థానం కల్పించాలని మోదీ సర్కారు భావించింది. తమకు రెండు మంత్రి పదవులు ఇవ్వాలని జేడీయూ కోరింది. అయితే ఒకరికి కేబినెట్ పదవి ఇచ్చి.. మరొకరిని సహాయ మంత్రిని చేస్తామని భాజపా చెప్పినట్లు తెలుస్తోంది. 2019లో రెండో దఫా భాజపా ప్రభుత్వం ఏర్పాటు సమయంలోనే జేడీయూకు ఒక కేబినెట్ పదవి ఇస్తామని కాషాయ పార్టీ ఆఫర్ చేసింది. అయితే దాన్ని నితీశ్ కుమార్ తిరస్కరించారు.
2019లో మోదీ రెండో దఫా ప్రధాని పదవి చేపట్టిన తర్వాత జరుగుతున్న తొలి మంత్రివర్గ విస్తరణ ఇది. నిబంధనల ప్రకారం.. కేంద్ర మంత్రివర్గంలో గరిష్ఠంగా 81 మంది మంత్రులు ఉండొచ్చు. అయితే ప్రస్తుతం కేబినెట్లో 53 మంది మాత్రమే ఉన్నారు. అంటే ఇంకా 28 మందిని కేబినెట్లోకి తీసుకునే అవకాశముంది. కాగా.. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఉత్తరప్రదేశ్ నుంచి ఎక్కువ మందికి అవకాశాలిచ్చే సంకేతాలు కన్పిస్తున్నాయి. ఇదిలా ఉండగా.. కేంద్ర మంత్రులు, భాజపా జాతీయాధ్యక్షుడితో నేడు జరగాల్సిన ప్రధాని కీలక భేటీ రద్దవడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టైమ్ జాబితాలో సత్య నాదెళ్ల, ఆలియాభట్
ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగా, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, బాలీవుడ్ నటి ఆలియాభట్, నటుడు, డైరెక్టర్ దేవ్ పటేల్ టైమ్ మేగజీన్ 2024 ఏడాదికి రూపొందించిన ప్రపంచంలోనే అత్యంత ప్రభావశీలురైన 100 మంది వ్యక్తుల జాబితాలో చోటు సంపాదించారు. -
పదేళ్లలో పెరిగిన ఈడీ జోరు
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జోరు గత పదేళ్లలో పెరిగింది. సోదాలు, అరెస్టుల సంఖ్య భారీగా హెచ్చింది. యూపీఏ హయాంతో పోలిస్తే భాజపా పాలనలో దేశవ్యాప్తంగా 86 రెట్లు ఎక్కువగా ఈడీ సోదాలు నిర్వహించింది. -
భద్రతా బలగాల మానసిక యుద్ధం!
మావోయిస్టులపై భద్రతా బలగాలు మానసిక యుద్ధానికి తెరదీశాయి. ప్రస్తుతం దేశంలో మావోయిస్టులకు ఆయువుపట్టుగా ఉన్న అబూఝ్మాడ్లోకి చొచ్చుకెళ్లడమే లక్ష్యంగా ప్రత్యేక వ్యూహాలతో ముందుకెళ్తున్నాయి. -
ఎన్నికల సభల్లో ‘పర్యావరణ స్ఫూర్తి’
రాజకీయ పార్టీల బహిరంగ సభలు, రోడ్షోలు ముగియగానే.. రోడ్లపై వేసిన చెత్తాచెదారం అలాగే వదిలేసి ఎవరి దారి వారు చూసుకొంటారు. -
ప్రొఫెసర్ శోమా సేన్ జైలు నుంచి విడుదల
ఎల్గార్ పరిషద్-మావోయిస్టు సంబంధాల కేసులో నిందితురాలు, నాగపుర్ విశ్వవిద్యాలయం మాజీ ప్రొఫెసర్ శోమా సేన్ (66) బుధవారం మధ్యాహ్నం జైలు నుంచి విడుదలయ్యారు. -
త్వరలోనే నక్సలైట్లను పూర్తిగా ఏరివేస్తాం: అమిత్షా
రానున్న అతి కొద్ది కాలంలో నక్సలైట్లను వందశాతం ఏరివేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. -
దేశ జనాభా 144 కోట్లు
దేశ జనాభా ఈ ఏడాదికి సుమారుగా 144 కోట్లు ఉంటుందని యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ (యూఎన్ఎఫ్పీఏ) స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్-2024 నివేదికలో అంచనా వేసింది. -
పంజాబ్లో రైల్వేట్రాక్పై రైతుల బైఠాయింపు
హరియాణా పోలీసులు అరెస్టు చేసిన ముగ్గురు రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పంజాబ్లోని పటియాలా జిల్లాలో సంయుక్త కిసాన్ మోర్చా (రాజకీయేతర), కిసాన్ మజ్దూర్ మోర్చాల నేతృత్వంలో అన్నదాతలు బుధవారం ఆందోళన చేపట్టారు. -
పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని ఓటేయండి
పర్యావరణానికి సంబంధించిన అంశాల్లో దేశ పురోగతిని దృష్టిలో పెట్టుకొని సార్వత్రిక ఎన్నికల్లో ఓటేయాలని దేశ ప్రజలకు 70కిపైగా పర్యావరణ, పౌర సమాజ బృందాలు బుధవారం పిలుపునిచ్చాయి. -
జాబిల్లిపై భారతీయుడు కాలుమోపే వరకూ చంద్రయాన్ యాత్రలు: ఇస్రో ఛైర్మన్
చంద్రుడిపైకి భారత వ్యోమగామిని దించేవరకూ చంద్రయాన్ శ్రేణి ప్రయోగాలు కొనసాగుతూనే ఉంటాయని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఛైర్మన్ ఎస్.సోమనాథ్ తెలిపారు. -
ముంబయి మహిళకు పాక్లో చిత్రహింసలు
పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావిన్సులో భారతీయురాలైన భార్యను చిత్రహింసలు పెడుతున్న భర్తపై కేసు నమోదు చేసినట్లు లాహోర్ పోలీసులు బుధవారం వెల్లడించారు. -
సంక్షిప్త వార్తలు (5)
లోక్సభ ఎన్నికల మొదటి దశ పోలింగ్ నేపథ్యంలో కూచ్ బిహార్లో తలపెట్టిన పర్యటనను రద్దు చేసుకోవాలని ఎన్నికల సంఘం (ఈసీ) పశ్చిమ బెంగాల్ గవర్నర్కు స్పష్టంచేసింది. -
పీవీ, మన్మోహన్లపై మోదీ ప్రభుత్వం ప్రశంసలు
మాజీ ప్రధానులు పి.వి.నరసింహారావు, మన్మోహన్ సింగ్లపై మోదీ సర్కారు ప్రశంసల జల్లు కురిపించింది. -
అయోధ్య రాముడికి తిలకం దిద్దిన సూరీడు
శ్రీరామనవమి వేళ అయోధ్యలోని రత్నకిరీట ధారి బాలరాముడి నుదుటిపై బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు సూర్యకిరణాలతో తిలకం 4 - 5 నిమిషాలు సాక్షాత్కరించింది. -
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
మహారాష్ట్రలోని హర్సుల్ సెంట్రల్ జైలు అక్కడ ఉండే ఖైదీలు తమ వారితో మాట్లాడుకోవడానికి స్మార్ట్ కార్డులను జారీ చేసింది.