Havana syndrome: అమెరికన్లను భయపెడుతున్న హవానా సిండ్రోమ్..!
అమెరికా దౌత్యవేత్తలను ఓ ప్రత్యేమైన సిండ్రోమ్ తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. అది ఎందుకు వస్తోందో అగ్రరాజ్యం శాస్త్రవేత్తలకు అంతుపట్టడంలేదు.. ఎవరో తమపై కుట్ర పన్నుతున్నారన్న అనుమానం కూడా అమెరికాలో
ఉపాధ్యక్షురాలి పర్యటనలో తీవ్ర జాప్యం
ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
అమెరికా దౌత్యవేత్తలను ఓ ప్రత్యేమైన సిండ్రోమ్ తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. అది ఎందుకు వస్తోందో అగ్రరాజ్యం శాస్త్రవేత్తలకు అంతుపట్టడంలేదు.. ఎవరో తమపై కుట్ర పన్నుతున్నారన్న అనుమానం కూడా అమెరికాలో ఉంది. తాజాగా అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ వియత్నాం పర్యటన ఈ సిండ్రోమ్ కారణంగానే కొన్ని గంటలపాటు ఆలస్యమైంది. వియత్నాంలోని దౌత్య కార్యాలయం నుంచి ఓ వ్యక్తిని అత్యవసరంగా చికిత్స నిమిత్తం తరలించాల్సి వచ్చింది.
ఏమిటీ సమస్య..
అమెరికా దౌత్యవేత్తలను మాత్రమే పీడించే ఈ సమస్యను ‘హవానా సిండ్రోమ్’ అని అంటారు. 2016లో తొలిసారి దీనిని క్యూబాలో హవానా నగరంలోని అమెరికా దౌత్యకారాలయ సిబ్బందిలో గుర్తించారు. మెదడుపై ఏదో తెలియని తీవ్రమైన ఒత్తిడి కలుగుతుంది. కందిరీగల దండు తమ వద్ద తిరుగుతున్నట్లు చప్పుడు వినిపిస్తుంటుంది. ఈ శబ్దం భరించలేని స్థాయిలో ఉంటుంది. దీని ప్రభావానికి గురైన వ్యక్తికి వికారం కలుగుతుంది. అంతేకాదు, విపరీతంగా అలసటతో పాటు.. ఏ విషయాన్ని గుర్తుపెట్టుకోలేరు. క్యూబాలో ఈ ప్రభావానికి లోనైన వారిలో మూడోవంతు మందికి వినికిడి శక్తి దెబ్బతింది. వారి మెదడును స్కాన్ చేసిన డాక్టర్లకు ఆశ్చర్యకరమైన విషయాలు తెలిశాయి. ఈ సిండ్రోమ్ బారిన పడిన వారి మెదడు దెబ్బతిన్నట్లు గుర్తించారు. సాధారణంగా ఏదైనా ప్రమాదానికి గురైతే కానీ ఆ స్థాయిలో మెదడు దెబ్బతినదు. తొలిసారి హవానాలో బయటపడటంతో ఆ పేరుతోనే పిలుస్తున్నారు.
కొన్ని రకాల ఉద్యోగులు మాత్రమే ఈ సిండ్రోమ్ బారిన పడుతున్నారు. క్యూబా, చైనా దౌత్యకార్యాలయాల్లో పనిచేసే వారే ఎక్కువగా ఉన్నారు. దౌత్యవేత్తలు, గూఢచారులు, సైనిక సిబ్బంది, సీఐఏ సిబ్బంది, విదేశాగ శాఖ సిబ్బంది ఈ జాబితాలో ఉన్నారు. గత ఐదేళ్ల నుంచి దాదాపు 200 మంది దీని బారిన పడి ఉంటారని అంచనా. మైక్రోవేవ్ తరంగాల సాయంతో గుర్తుతెలియని ప్రత్యర్థులు దాడులు చేస్తున్నారని అమెరికా అనుమానిస్తోంది. చైనా, ఆస్ట్రియా, పోలాండ్, రష్యాలోని అమెరికా దౌత్య సిబ్బంది ఈ సిండ్రోమ్ బాధితుల జాబితాలో ఉన్నారు. కొందరు కెనడా దౌత్యవేత్తలు కూడా ఈ సిండ్రోమ్ బారినపడినట్లు వార్తలొచ్చాయి.
2019లో కారులో ఉన్న ఒక అమెరికా సైనిక అధికారికి ఒక్కసారిగా తీవ్ర వికారంగా అనిపించింది. అదే సమయంలో వెనుకసీటులో ఉన్న అతడి రెండేళ్ల కుమారుడు కూడా విపరీతంగా ఏడవటం మొదలు పెట్టాడు. వారు కారు నుంచి బయటకు వచ్చిన కొద్దిసేపటి తర్వాత ఆ లక్షణాలు తగ్గాయి. అతని కుమారుడు కూడా కుదుట పడ్డాడు. ఈ ఘటన అమెరికా ప్రభుత్వాన్ని కలవర పర్చింది.
క్యూబా పై నింద..
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఉన్న సమయంలో ఈ సిండ్రోమ్ వ్యాప్తికి క్యూబాను నిందించారు. కానీ, క్యూబా దీనిని తిరస్కరించింది. కానీ, ఆ తర్వాత అమెరికాలోని అధికారులు కూడా దీని బారిన పడినట్లు తేలింది. ప్రభుత్వం ఈ సిండ్రోమ్కు కారణమేంటో తెలుసుకొనే పనిలో పడింది. కొన్నాళ్ల క్రితం బైడెన్ కార్యవర్గం కూడా దీని సంగతేమిటో తేల్చాలని నిశ్చయించుకొంది. ఈ విషయంపై జూన్లో సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆంటోనీ బ్లింకన్ ఒక ప్రకటన చేశారు.
తొలుత అమెరికా కొన్ని రకాల ‘సానిక్’ శబ్ద తరంగాల కారణంగా ఈ పరిస్థితి తలెత్తుతోందని అనుమానించింది. కానీ, అది తప్పు అని తేలడంతో ఇప్పుడు మైక్రోవేవ్ తరంగాలను వినియోగిస్తున్నట్లు బలంగా నమ్ముతోంది. ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్స్, ఇంజినీరింగ్ అండ్ మెడిసిన్ (ఎన్ఏఎస్ఈఎం) పరిశోధనల ప్రకారం మైక్రోవేవ్ తరంగాలను వినియోగించే అవకాశం ఉందన్న అంచనాలకు వచ్చారు. సోవియట్ యూనియన్ 1950ల్లో మైక్రోవేవ్ తరంగాలను ఆయుధంలా వినియోగంచడంపై పరిశోధనలు చేసిన విషయాన్ని ప్రస్తావించారు. 2019లో జర్నల్ ఆఫ్ అమెరికన్ మెడికల్ అసోసియేషన్ కూడా ఎన్ఏఎస్ఈఎం నివేదికను బలపర్చింది.
కమలా హారిస్ పర్యటన జాప్యం..
అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ఆసియా దేశాల పర్యటనపై హవానా సిండ్రోమ్ ప్రభావం పడింది. వియత్నాంలోని అమెరికా దౌత్య సిబ్బంది హవానా సిండ్రోమ్ వంటి సమస్య బారిన పడినట్లు తేలింది. ఈ సారి దౌత్య సిబ్బంది ఇంటి వద్ద ఈ పరిస్థితి తలెత్తింది. గతంలో ఇక్కడి సిబ్బంది ఈ సమస్యతో ఇబ్బంది పడ్డారు. ఈ విషయాన్ని సీబీఎస్ న్యూస్ పేర్కొంది. దీంతో ఒక్కసారి అప్రమత్తమైన అమెరికా సిబ్బంది కమలా పర్యటన ఏర్పాట్లను మరింత కట్టుదిట్టం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.