Kargil Vijay Diwas: అరుణాచల్ టు లద్ధాఖ్.. ‘విజయ్ దివస్’లో ప్రత్యేక ఆకర్షణగా మహిళల యాత్ర!
23వ ‘కార్గిల్ విజయ్ దివస్’ సంస్మరణ కార్యక్రమాల నిర్వహణకు భారత సైన్యం సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే కార్గిల్ యుద్ధవీరుల త్యాగాలను మరోసారి గుర్తుచేసుకోనుంది...
లద్ధాఖ్: 23వ ‘కార్గిల్ విజయ్ దివస్’ సంస్మరణ కార్యక్రమాల నిర్వహణకు భారత సైన్యం సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే కార్గిల్ యుద్ధవీరుల త్యాగాలను మరోసారి గుర్తుచేసుకోనుంది. ప్రధాన కార్యక్రమాన్ని లద్ధాఖ్లోని ద్రాస్లో ఉన్న ‘కార్గిల్ యుద్ధ స్మారకం’ వద్ద.. జులై 24 నుంచి 26 వరకు నిర్వహించనున్నట్లు శ్రీనగర్లోని సైన్య ప్రజాసంబంధాల అధికారి కర్నల్ ఎమ్రాన్ ముసావి గురువారం వెల్లడించారు. ప్రముఖ పర్వతారోహకురాలు, పద్మభూషణ్ పురస్కార గ్రహీత బచేంద్రి పాల్ నేతృత్వంలో 50 ఏళ్లు పైబడిన 12 మంది మహిళల బృందం సాగిస్తోన్న అయిదు నెలల సుదీర్ఘ హిమాలయాల యాత్ర.. ఈ విడత ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నట్లు తెలిపారు.
విజయ్ దివస్లో భాగంగా ‘ఫిట్@50 ప్లస్’ పేరిట చేపట్టిన ఈ యాత్ర.. దాదాపు అయిదు నెలల క్రితం అరుణాచల్ప్రదేశ్లోని పాంగ్-సౌ పాస్ వద్ద ప్రారంభమైంది. ఇప్పటికే ఈ బృందం హిమాలయాల వెంబడి 37 పర్వత మార్గాలను దాటి.. 4,977 కిలోమీటర్లకుపైగా ప్రయాణించి, గురువారం నాటికి లమయూరు ప్రాంతానికి చేరుకుంది. ‘ఫైర్ అండ్ ఫ్యూరీ కోర్’ పరిధిలోని కార్గిల్ మీదుగా ప్రయాణించి 24న ద్రాస్లో ఈ యాత్ర ముగియనుంది. శారీరక, మానసిక దృఢత్వానికి.. ఆరోగ్యంగా ఉండటానికి.. వయస్సుతోపాటు ఆడామగా తేడాలు ఎటువంటి అవరోధాలు కావని ఈ ప్రయాణం చాటిచెప్పినట్లు కర్నల్ ముసావి తెలిపారు. ఈ క్రమంలోనే బచేంద్రి పాల్, బృంద సభ్యులను జులై 25న ఓ కార్యక్రమంలో సత్కరించనున్నట్లు చెప్పారు.
మరోవైపు.. ‘ఫరెవర్ ఇన్ ఆపరేషన్ డివిజన్’కు చెందిన దాదాపు 18 మంది ఆర్మీ సిబ్బంది బుధవారం ‘విక్టరీ మోటార్ సైకిల్ ర్యాలీ’ ప్రారంభించారు. లేహ్ జిల్లాలోని తుర్తుక్ నుంచి బయలుదేరిన ఈ బృందం.. జులై 26న ద్రాస్లోని కార్గిల్ వార్ మెమోరియల్ వద్దకు చేరుకోనుంది. లద్ధాఖ్లోని కఠినమైన భూభాగం గుండా మొత్తం 481 కి.మీల మేర ఈ ర్యాలీ సాగనుంది.
‘విజయ్ దివస్’ వెనుక చరిత్ర..
1999లో కార్గిల్ ఆక్రమణకు ప్రణాళిక రచించిన పాక్ సైన్యం.. అక్కడి ఉగ్రవాదులతో కలిసి భారత భూభాగంలోకి ప్రవేశించింది. గొర్రెల కాపర్లు ఇచ్చిన సమాచారంతో భారత సైన్యం అప్రమత్తమై ‘ఆపరేషన్ విజయ్’ పేరుతో సైనిక చర్యను ప్రారంభించింది. పాక్ సైన్యం ఆక్రమించుకున్న పర్వత శిఖరాలను భారత్ సైన్యం పూర్తిగా స్వాధీనం చేసుకుంది. 1999 మే నుంచి జులై వరకూ ఇది కొనసాగింది. ఈ విజయానికి గుర్తుగానే.. ఈ ఆపరేషన్ పేరిట ఏటా జులై 26న ‘విజయ్ దివస్’ జరుపుకొంటాం. ఈ యుద్ధంలో భారత్ వైపు 527 యోధులు ప్రాణాలు కోల్పోగా.. పాక్ వైపు అత్యధికంగా 400 నుంచి 4,000 మంది మరణించి ఉంటారని అంచనా.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
పట్నాలోని ఓ హోటల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఆరుగురు మరణించారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. -
విద్యార్థుల చిరునవ్వుల కోసం ఓ టీచర్ ఫన్నీ యాక్ట్.. వీడియో వైరల్
Students smile: విద్యార్థులంటే పుస్తకాలు ముందేసుకొని, టీచర్లు చెప్పే పాఠాలు వినడమే గుర్తుకువస్తుంది. కానీ ఆన్లైన్లో వైరల్గా మారిన ఓ వీడియో మాత్రం అందుకు భిన్నంగా ఆకట్టుకుంటోంది. -
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
Arunachal Pradesh: హైవేపై కొండచరియలు విరిగిపడటంతో చైనా సరిహద్దుల్లోని ఓ జిల్లాకు మిగిలిన ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. -
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ అధికారి ఒకరు రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గహ్లోత్ (Ashok Gehlot)పై తీవ్ర ఆరోపణలు చేశారు. -
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
Tamannaah: నిబంధనలకు వ్యతిరేకంగా ఐపీఎల్ను ప్రసారం చేసిన కేసులో నటి తమన్నాకు మహారాష్ట్ర సైబర్ పోలీసులు సమన్లు జారీ చేశారు. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
-
విద్యార్థుల చిరునవ్వుల కోసం ఓ టీచర్ ఫన్నీ యాక్ట్.. వీడియో వైరల్
-
(ADVT) జేఈఈ మెయిన్ ఓపెన్ కేటగిరీలో ఆలిండియా 1st ర్యాంక్ నారాయణదే
-
రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్
-
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?