Basavaraj Bommai: ఆరోగ్యంపై వచ్చిన ఊహాగానాలపై స్పందించిన సీఎం బొమ్మై
తన ఆరోగ్యంపై వస్తోన్న ఊహాగానాలపై కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై స్పందించారు. 365 రోజులూ ఎలాంటి విశ్రాంతి తీసుకోకుండా అవిశ్రాంతంగా శ్రమించేంత......
విశ్రాంతి లేకపోయినా 365రోజులూ పనిచేసేంత బలంగా ఉన్నా!
రోజుకు 15గంటలు పనిచేయాలని డిసైడ్ అయ్యా
హుబ్బళ్లి: తన ఆరోగ్యంపై వస్తోన్న ఊహాగానాలపై కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై స్పందించారు. 365 రోజులూ ఎలాంటి విశ్రాంతి తీసుకోకుండా అవిశ్రాంతంగా శ్రమించేంత బలంగా ఉన్నానన్నారు. 2023లో భాజపాను తిరిగిఅధికారంలోకి తీసుకురావడమే తన లక్ష్యమన్నారు. రెండు రోజుల పాటు జరిగే భాజపా రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సమావేశంలో పాల్గొనేందుకు హుబ్బళ్లికి వచ్చారు. తీవ్రమైన మోకాలి సమస్యతో సీఎం బొమ్మై బాధపడుతున్నారనీ, త్వరలోనే చికిత్స కోసం ఆయన విదేశాలకు వెళ్లబోతున్నారంటూ జరుగుతున్న ప్రచారంపై స్పందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘‘ఎలాంటి విశ్రాంతి అవసరం లేకుండా 365 రోజులూ పనిచేసేంత బలం నాకు ఉంది. రోజులో కనీసం 15 గంటల పాటు పనిచేయాలని డిసైడ్ అయ్యాను. 2023 ఎన్నికల్లో భాజపాను తిరిగి అధికారంలోకి తీసుకురావడమే నా టార్గెట్. ఇందుకోసం 2022లో ప్రిపరేషన్ను ప్రారంభిస్తా’ అని చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ గెలుపునకు భాజపా నేతలంతా కలిసి టీమ్ వర్క్తో పనిచేస్తామన్నారు.
రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు బసవరాజ్ బొమ్మై నాయకత్వంలోనే వెళ్తున్నట్టు ఇటీవల భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, కర్ణాటక పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి అరుణ్ సింగ్ వ్యాఖ్యలపైనా స్పందించారు. ఆయన దిల్లీ స్థాయి నేత అని, తనపై నమ్మకం ఉంచినందుకు కృతజ్ఞతలు తెలిపారు. తామంతా టీమ్ వర్క్తో పనిచేస్తామని చెప్పారు. ప్రభుత్వం, పార్టీ మధ్య మంచి సంబంధాలు, సమన్వయంతో ముందుకెళ్తున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో నాయకత్వ మార్పు ఉందంటూ వస్తోన్న ఊహాగానాలన్నీ మీడియా సృష్టేనని కొట్టిపారేశారు. అలాంటి వ్యాఖ్యల్ని పార్టీ నాయకత్వం కూడా తిరస్కరించిందన్నారు. రాష్ట్ర కేబినెట్ విస్తరణ అంశంపై ప్రశ్నించగా.. దీనిపై ఇప్పటికైతే తాను ఏమీ మాట్లాడదలచుకోలేదన్నారు.
► Read latest National - International News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్