అమ్మాయిలు సింగిల్‌గా ఉండేందుకు ఇష్టపడుతున్నారు.. కర్ణాటక మంత్రి వ్యాఖ్యలు

నేటి తరం మహిళలను ఉద్దేశించి కర్ణాటక ఆరోగ్యశాఖామంత్రి డాక్టర్‌ కె.సుధాకర్‌ వివాదస్పద వ్యాఖ్యాలు చేశారు. ఆదివారం జరిగిన నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెంటల్‌ హెల్త్‌ అండ్‌ న్యూరోసైన్స్‌ (ఎన్‌ఐఎంహెచ్‌ఎఎన్‌ఎస్‌) 25వ కాన్వకేషన్‌కు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన భారతీయ మహిళలను ఉద్దేశించి పలు వ్యాఖ్యలు చేశారు...

Published : 11 Oct 2021 23:06 IST

బెంగళూరు: మహిళలను ఉద్దేశించి కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్‌ కె.సుధాకర్‌ వివాదస్పద వ్యాఖ్యాలు చేశారు. ఆదివారం జరిగిన నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెంటల్‌ హెల్త్‌ అండ్‌ న్యూరోసైన్స్‌ (ఎన్‌ఐఎంహెచ్‌ఎఎన్‌ఎస్‌) 25వ కాన్వకేషన్‌కు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన... నేటి మహిళలను ఉద్దేశించి పలు వ్యాఖ్యలు చేశారు. ‘‘ఈ విషయాన్ని చెప్పడం కాస్త బాధాకరంగా భావిస్తున్నా. దురదృష్టవశాత్తూ.. మన సమాజంపై పాశ్చాత్య ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. తల్లిదండ్రులతో ఉండేందుకు యువత ఏమాత్రం ఆసక్తి కనబరచడం లేదు. భారతదేశంలో నేటితరం మహిళలు సింగిల్‌గా ఉండాలనుకుంటున్నారు. ఒకవేళ వివాహమైనా సరే! పిల్లలను కనాలనే ఉద్దేశం వారిలో ఉండటం లేదు. ఒకవేళ జన్మనివ్వాలనుకుంటే.. సరోగసీ బాట పడుతున్నారు. కాబట్టి వారి ఆలోచనల్లో మార్పు వచ్చిందని చెప్పొచ్చు. ఇది ఏమాత్రం మంచి పరిణామం కాదు’’ అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ విషయంపై సామాజిక మాధ్యమాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే అధిక శాతం మహిళలు ఈ విషయాన్ని అంగీకరించడం గమనార్హం. మరికొంతమంది ఎందుకు కేవలం ఆడవాళ్లనే తప్పుబడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు