కరోనా బారిన కుమారస్వామి‌

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్‌ నేత హెచ్‌డీ కుమారస్వామి కరోనా బారిన పడ్డారు. తాజాగా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా తేలినట్లు ఆయనే స్వయంగా ట్విటర్‌ ద్వారా శనివారం వెల్లడించారు.

Published : 17 Apr 2021 15:11 IST

బెంగళూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్‌ నేత హెచ్‌డీ కుమారస్వామి కరోనా బారిన పడ్డారు. తాజాగా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా తేలినట్లు ఆయనే స్వయంగా ట్విటర్‌ ద్వారా శనివారం వెల్లడించారు. ‘నాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. గత కొద్ది రోజులుగా నన్ను కలిసిన వారు పరీక్షలు చేయించుకోవాలని కోరుతున్నా. లక్షణాలు ఏమైనా ఉంటే స్వతహాగా ఐసోలేషన్‌లోకి వెళ్లండి’ అని కుమారస్వామి ట్వీట్‌లో విజ్ఞప్తి చేశారు. కాగా, కుమారస్వామి మార్చి 23న కరోనా టీకా తొలిడోసు వేయించుకున్నారు. ఇటీవల కొద్ది రోజుల కిందట మాజీ ప్రధాని, కుమారస్వామి తండ్రి దేవేగౌడ సైతం కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని