Terror Attack: ఒకేరోజు మూడు చోట్ల ఉగ్ర ఘాతుకం.. జవాన్‌, కశ్మీరీ పండిట్‌ హత్య

జమ్ముకశ్మీర్​లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఒకేరోజు మూడు ఉగ్రదాడులు చోటుచేసుకోవడం తీవ్ర కలకలం రేపింది.......

Published : 05 Apr 2022 00:02 IST

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్​లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఒకేరోజు మూడు చోట్ల దాడులకు పాల్పడ్డారు. షోపియన్‌ జిల్లా చోటోగామ్‌ ప్రాంతంలో కశ్మీరీ పండిట్‌ అయిన ఓ దుకాణాదారుడిని కాల్చి చంపారు. ఉగ్రదాడుల సమాచారం అందుకున్న జవాన్లు ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన బాధితుడిని వెంటనే ఆసుపత్రికి తరలించగా.. మార్గం మధ్యలోనే అతడు ప్రాణాలు కోల్పోయాడు. మరణించిన వ్యక్తిని సోనూ కుమార్‌ బాల్జీగా గుర్తించినట్టు పోలీసులు తెలిపారు. 

జవాన్లపై దాడులు

శ్రీనగర్​లోని మైసుమా ప్రాంతంలో ఇద్దరు సీఆర్ఫీఎఫ్ జవాన్లపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఒకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు అధికారులు తెలిపారు. మైసుమా ప్రాంతాన్ని అధీనంలోకి తీసుకున్నట్లు చెప్పారు. పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. మరోవైపు, వలసదారులపైనా ముష్కరులు కాల్పులు జరిపారు. పుల్వామా జిల్లాలో వలస కూలీలపై సోమవారం జరిపిన కాల్పుల్లో ఇద్దరు గాయపడ్డారు. 24 గంటల వ్యవధిలో మూడు చోట్ల దాడులు జరగడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు