Kedarnath Yatra: కేదార్నాథ్ యాత్రకు రిజిస్ట్రేషన్లు రద్దు.. కారణం ఇదే..!
కేదార్నాథ్ యాత్రకు వెళ్లే భక్తులకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియను తాత్కాలికంగా రద్దు చేశారు. వాతావరణ ప్రతికూలతల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
దిల్లీ: హిమాలయాల్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కేదార్నాథ్ యాత్ర(Kedarnath Yatra)కు రిజిస్ట్రేషన్ల ప్రక్రియను రద్దు చేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. రాబోయే మూడు నాలుగు రోజుల పాటు కేదార్ఘటిలో ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కేదారేశ్వరుడిని దర్శించుకొనేందుకు యాత్రికుల రిజిస్ట్రేషన్లను మే 8వరకు నిలిపివేస్తున్నట్టు పేర్కొంది. ఉత్తరాఖండ్ పర్యాటక శాఖ గణాంకాల ప్రకారం.. మే 10న యాత్రకు ఇప్పటికే 1.26లక్షల మంది పర్యాటకులు రిజిస్టర్ చేసుకున్నారు. అలాగే, మే 4వరకు 1.23 లక్షల మంది భక్తులు కేదార్ధామ్ను దర్శించుకున్నారు.
మరోవైపు, భైరాన్ వద్ద మంచు చరియలు విరిగిపడటంతో సోమవారం కేదార్నాథ్ ధామ్ యాత్ర మార్గాన్ని మూసివేశారు. డీడీఎంఏ, ఎస్డీఆర్ఎఫ్, డీడీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, వైఎంఎఫ్ భద్రతా బలగాలతో పాటు స్థానిక పోలీసులు యాత్రికులు ప్రయాణించే మార్గాలపై మంచు కమ్ముకోవడంతో వాటి తొలగించి కాలినడకన వెళ్లే యాత్రికులకు మార్గం క్లియర్ చేస్తున్నారు. గుర్రాలు, కంచర గాడిదలపై వెళ్లే యాత్రికులకు ఏర్పాటు చేసిన మార్గాన్ని సైతం తెరవలేదు.
ఇదిలా ఉండగా.. కేదార్నాథ్కు వెళ్లే దారిలో నిన్న కూడా భారీగా మంచు చరియలు విరిగిపడ్డాయి. బుధవారం పడ్డ మంచు చరియల్ని ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బలగాలు తొలగిస్తుండగానే ఈ పరిణామం చోటుచేసుకుంది. దీంతో యాత్రికుల రాకపోకలకు అంతరాయం వాటిల్లింది. జోషీమఠ్ సమీపంలోని హెలాంగ్ వద్ద కొండ చరియలు విరిగిపడ్డాయి. మార్గంలో అడ్డంకులన్నీ తొలగించేవరకు రోడ్డుమార్గాన యాత్రకు వెళ్లవద్దని అధికార వర్గాలు సూచించాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Bengaluru: రోజుకు 50 కోట్ల లీటర్ల నీటి కొరత.. బెంగళూరు కష్టాలపై కర్ణాటక సీఎం
బెంగళూరులో రోజుకు 2600 ఎంఎల్డీ (మిలియన్ లీటర్స్ పర్ డే) నీటి అవసరం ఉండగా.. దాదాపు 500 ఎంఎల్డీ కొరత ఉందని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య వెల్లడించారు. -
Kolkata: భవనం కుప్పకూలిన ఘటనలో తొమ్మిదికి చేరిన మృతులు
కోల్కతాలో భవనం కుప్పకూలిన ఘటనలో 9 మంది మృతి చెందారు. 17 మందికి గాయాలు అయ్యాయి.
తాజా వార్తలు (Latest News)
-
Munitions: ఉత్తర కొరియా నుంచి రష్యాకు.. ఏడు వేల కంటెయినర్ల ఆయుధాలు!
-
Bengaluru: రోజుకు 50 కోట్ల లీటర్ల నీటి కొరత.. బెంగళూరు కష్టాలపై కర్ణాటక సీఎం
-
Kolkata: భవనం కుప్పకూలిన ఘటనలో తొమ్మిదికి చేరిన మృతులు
-
WhatsApp: వాట్సప్ పేమెంట్స్ ఇక మరింత సులువుగా.. ఇక చాట్ లిస్ట్లోనే
-
AAP: పదేళ్లలో దిల్లీకి ఏం చేశారు?.. భాజపా ఎంపీలకు ఆప్ ప్రశ్న!
-
BJP-JDS: ‘రెండు సీట్లకు ఇంత కష్టపడాలా?’ భాజపాపై కుమారస్వామి అసంతృప్తి!