Kerala: ₹20వేల కోట్లతో కొవిడ్ ప్యాకేజీ
కేరళలో రెండోసారి అధికారంలోకి వచ్చిన ఎల్డీఎఫ్ ప్రభుత్వం కొవిడ్ను ఎదుర్కోవడానికి మరో ప్యాకేజీని ప్రకటించింది. గతేడాది మాదిరిగానే ఈ సారి కూడా ₹20 వేల కోట్లతో ప్రత్యేక ప్యాకేజీని తీసుకొచ్చింది.
తిరువనంతపురం: కేరళలో రెండోసారి అధికారంలోకి వచ్చిన ఎల్డీఎఫ్ ప్రభుత్వం కొవిడ్ను ఎదుర్కోవడానికి మరో ప్యాకేజీని ప్రకటించింది. గతేడాది మాదిరిగానే ఈ సారి కూడా ₹20 వేల కోట్లతో ప్రత్యేక ప్యాకేజీని తీసుకొచ్చింది. దీనికి అదనంగా 18 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సినేషన్ కోసం ₹1000 కోట్లు బడ్జెట్లో కేటాయిస్తున్నట్లు కేరళ ఆర్థిక మంత్రి కేఎన్ బాలగోపాల్ శుక్రవారం ప్రకటించారు. గత ఆర్థిక మంత్రి థామస్ ఐజాక్ ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి బడ్జెట్కు సవరించిన అంచనాలతో తాజా బడ్జెట్ను ప్రవేశపెట్టారు.
20వేల కోట్ల రూపాయల్లో రాష్ట్రంలో నెలకొన్న హెల్త్ ఎమర్జెన్సీని ఎదుర్కోవడానికి ₹2,800 కోట్లు కేటాయించినట్లు బాలగోపాల్ తెలిపారు. కొవిడ్ సంక్షోభ సమయంలో జీవనోపాధి కోల్పోయిన వారికి ₹8,900 కోట్లు, ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవించేలా వడ్డీ రాయితీ, రుణాలు అందించేందుకు రూ.8,300 కోట్లు కేటాయిస్తున్నట్లు పేర్కొన్నారు. కరోనా సమయంలో ప్రజలంతా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో కొత్తగా ఎలాంటి పన్నుల భారం మోపడం లేదని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!