Pinarayi Vijayan: ‘అందుకే.. సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తున్నారు’
రాజకీయ ప్రత్యర్థులనే లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీని ఉద్దేశిస్తూ కేరళ ( Kerala) ముఖ్యమంత్రి పినరయి విజయన్ (Pinarayi Vijayan)ఆరోపించారు.
తిరువనంతపురం: రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుని కొందరు వ్యక్తులు సోషల్ మీడియా (Social media)ను దుర్వినియోగం చేస్తున్నారని కేరళ ( Kerala)ముఖ్యమంత్రి పినరయి విజయన్ (Pinarayi Vijayan) ఆరోపించారు. త్రికరిపూర్లో పార్టీ నూతన కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ( Congress)పై తీవ్ర విమర్శలు గుప్పించారు.
తిరువనంతపురంలోని పరశాలకు చెందిన 26 ఏళ్ల కాంగ్రెస్ కార్యకర్త అబిన్ కోడంకర సోషల్ మీడియా వేదికగా సీపీఎం పార్టీకి చెందిన సీనియర్ నేతల కుటుంబంలోని మహిళలపై వేధింపులకు పాల్పడ్డాడు. అభ్యంతరకర ఫొటోలను షేర్ చేసి వారిని అవమానించే రీతిలో వ్యాఖ్యలు పోస్టు చేశాడు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి పినరయి విజయన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రస్తుతం సోషల్ మీడియాను ఎక్కువగా వినియోగిస్తున్నారని.. అయితే, దీనిని ఉపయోగించేటప్పుడు మన నాగరికతను కోల్పోకూడదని సీఎం పేర్కొన్నారు. ఎవరినీ వ్యక్తిగతంగా కించపరిచేలా మన చర్యలు ఉండకూడదని సూచించారు.
అవకాశం దొరికిన ప్రతిసారీ బ్రిజ్ భూషణ్ వేధింపులకు పాల్పడ్డాడు: దిల్లీ పోలీసులు
‘‘రాజకీయ ప్రత్యర్థులే లక్ష్యంగా కొందరు (కాంగ్రెస్ను ఉద్దేశిస్తు) ప్రవర్తిస్తున్నారు. ముఖ్యంగా మహిళలను వేధింపులకు గురిచేస్తూ ఆ పార్టీ సోషల్మీడియాను దుర్వినియోగం చేస్తోంది. వారిని ఇబ్బందులను గురిచేసేందుకు ప్రత్యేక ఏజన్సీలను రాష్ట్రానికి తీసుకు వచ్చింది. వీటికి రూ. లక్షలు వెచ్చిస్తోంది. గతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం దక్కకపోవడంతో ఈ దుశ్చర్యకు పాల్పడుతోంది. ఈ సారి ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని ప్రయత్నిస్తోంది. అందుకే, ప్రభుత్వానికి వ్యతిరేకంగా తప్పుడు సమాచారాన్ని షేర్ చేస్తున్నారు. అధికార పార్టీ నేతల వ్యక్తి ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తోంది’’ అని దుయ్యబట్టారు.
అంతేకాకుండా, ఇటువంటి చర్యలను సహించవద్దని తమ పార్టీ కార్యకర్తలకు సూచించారు. అదే విధంగా ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి పథకాల గురించి ప్రజలకు తెలియజేయాలని కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేను ఏ సంతకం చేయలేదు: ‘హమాస్ ప్రశ్న’ వార్తలపై కేంద్రమంత్రి
Israel- Hamas Conflict: హమాస్ సంస్థ విషయంలో పార్లమెంట్లో అడిగిన ప్రశ్నకు తాను సమాధానం ఇచ్చినట్టుగా ఉన్న కాగితాలు వైరల్ కావడంపై కేంద్రమంత్రి మీనాక్షి లేఖి స్పందించారు. -
NIA: 44 ప్రాంతాల్లో ఎన్ఐఏ దాడులు.. ఐసిస్ కుట్ర కేసులో 13 మంది అరెస్టు
ఐసిస్ కుట్ర కేసు దర్యాప్తులో భాగంగా మహారాష్ట్ర, కర్ణాటకలో ఎన్ఐఏ దాడులు చేపట్టింది. -
Kapil Sibal: అస్సాం అప్పుడు మయన్మార్లో భాగమే: కపిల్ సిబల్ వ్యాఖ్యలు.. ఘాటుగా స్పందించిన హిమంత
Kapil Sibal: ‘అస్సాం (Assam)’పై సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ చేసిన వ్యాఖ్యలను ఆ రాష్ట్ర సీఎం హిమంత బిశ్వశర్మ తీవ్రంగా ఖండించారు. చరిత్ర తెలియకుండా మాట్లాడొద్దంటూ ఘాటుగా బదులిచ్చారు. ఇంతకీ కపిల్ సిబల్ ఏమన్నారంటే..? -
Vegan Technology: ‘శాకాహార’ సంచులు, పాదరక్షలు!
తోలుకు ప్రత్యామ్నాయంగా మొక్కల వ్యర్థాలతో వివిధ వస్తువులు తయారు చేసే విధానాన్ని తిరువనంతపురానికి చెందిన సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్ డిసిప్లినరీ సైన్స్ అండ్ టెక్నాలజీ (సీఎస్ఐఆర్) అభివృద్ధి చేసింది. -
Supreme Court: జడ్జీలు తీర్పుల్లో ఉపదేశాలివ్వరాదు: సుప్రీం
తాము వెలువరించే తీర్పుల్లో జడ్జీలు వ్యక్తిగత అభిప్రాయాలను వెల్లడించడం కానీ, ఉపదేశాలివ్వడం కానీ చేయరాదని సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది. -
ఉత్తరాది రాష్ట్రాలది గోముద్ర!: డీఎంకే ఎంపీ వ్యాఖ్యలపై గవర్నర్ తమిళిసై స్పందన
ఉత్తరాది రాష్ట్రాలు ‘గోమూత్రాని’కి నిదర్శనం కాదని, వాటిది ‘గోముద్ర’ అని తెలంగాణ గవర్నర్ తమిళిసై పేర్కొన్నారు. అవి పవిత్ర గోమాతకు చిహ్నమని తెలిపారు. -
అయోధ్యలో రామాలయాన్ని నిర్మిస్తామంటే ఎవరూ నమ్మలేదు
దేశంలోని బంధుప్రీతి, అవినీతి, కులతత్వం స్థానాలను గత పదేళ్లలో అభివృద్ధితో భర్తీ చేశామని కేంద్ర హోంమంత్రి అమిత్షా పేర్కొన్నారు. -
తొలి బుల్లెట్రైలు స్టేషన్ అదరహో!
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న తొలి బుల్లెట్రైలు ప్రాజెక్టుకు సంబంధించిన కీలక సమాచారాన్ని కేంద్ర రైల్వేమంత్రి అశ్వనీ వైష్ణవ్ ‘ఎక్స్’ ద్వారా పంచుకొన్నారు. -
ష్.. పేరెంట్ - టీచర్ మాట్లాడుకొంటున్నారు!
కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటారు. తన పోస్టుల్లో చమత్కారం ఉంటుంది. తాజాగా స్మృతి నెట్టింట్లో చేసిన ఓ పోస్టు వైరల్గా మారింది. -
బెంగాల్ ఆస్పత్రిలో 24 గంటల్లో 9 మంది నవజాత శిశువుల మృతి
పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్ వైద్య కళాశాల ఆసుపత్రిలో 24 గంటల వ్యవధిలో 9 మంది నవజాత శిశువులు మృతిచెందడం కలకలం రేపుతోంది. -
వెడ్ ఇన్ ఇండియా.. మీరే ప్రారంభించాలి
భారతీయ యువ జంటలకు ప్రధాని మోదీ కీలక సూచన చేశారు. యువ జంటలు ఉత్తరాఖండ్లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవాలని సూచించారు. -
మోదీకే అత్యధిక ప్రజామోదం
ప్రపంచంలోకెల్లా అత్యధిక ప్రజామోదం గల నేతగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి నిలిచారు. -
వచ్చే ఏడాది మార్చి వరకు.. ఉల్లి ఎగుమతులపై కేంద్రం నిషేధం
దేశీయ మార్కెట్లో పెరుగుతున్న ఉల్లి ధరలను అదుపు చేయడానికి, తగిన నిల్వలను అందుబాటులో ఉంచేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం ఉల్లి ఎగుమతులపై నిషేధం విధించింది. -
నెలసరి సెలవులపై ప్రతిపాదనలు పరిశీలనలో లేవు
నెలసరి సెలవును ప్రకటించే ప్రతిపాదనలేవీ పరిశీలనలో లేవని కేంద్రం స్పష్టం చేసింది. -
గుజరాత్లో ఏడాదిన్నరగా నకిలీ టోల్ప్లాజా
గుజరాత్లోని మోర్బీ జిల్లాలో ఘరానామోసం ఆలస్యంగా బయటపడింది. మోర్బీ, కచ్ జిల్లాలను కలిపే 8ఏ నంబరు జాతీయ రహదారిపై వాఘసియా టోల్ప్లాజా ఉంది. -
గంటల వ్యవధిలో 4 రాష్ట్రాల్లో భూప్రకంపనలు
నాలుగు రాష్ట్రాల్లో శుక్రవారం కొన్ని గంటల వ్యవధిలోనే భూప్రకంపనలు సంభవించడం కలకలం రేపింది. -
ముఖంపై పేడ వేసిన గేదె ఊపిరాడక చిన్నారి మృతి
ఊయలలో పడుకోబెట్టిన ఆరు నెలల చిన్నారి ముఖంపై గేదె పేడ వేసింది. దీంతో ఊపిరాడక ఆ బాబు అక్కడికక్కడే మృతిచెందాడు. -
ఎన్నికల్లో రాజకీయ పార్టీల వ్యయానికి పరిమితి విధించాలన్న పిటిషన్ తిరస్కరణ
రాజకీయ పార్టీలు ఎన్నికల్లో చేసే వ్యయానికి పరిమితి విధించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. -
విచారణకు ముందు ఎక్కువ రోజులు జైలులో ఉంచలేం
విచారణకు ముందు నిందితులను ఎక్కువ రోజులు జైలులో ఉంచడం సరైన చర్య కాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. -
హరియాణా ఎమ్మెల్యే - ఐఏఎస్ల పెళ్లికి 3 లక్షల మందికి ఆహ్వానాలు
హరియాణా మాజీ ముఖ్యమంత్రి భజన్లాల్ మనవడు, ప్రస్తుత ఎమ్మెల్యే భవ్య బిష్ణోయ్.. ఒక ఐఏఎస్ అధికారిని మనువాడనున్నారు. -
ఎగుమతి పరపతిపై జూన్ దాకా రాయితీ
ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రతికూల పవనాలు వీస్తున్న వేళ భారతీయ ఎగుమతిదారులకు తోడ్పాటు కొనసాగించేందుకు వీలుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ శుక్రవారం కీలక నిర్ణయం తీసుకుంది.


తాజా వార్తలు (Latest News)
-
నేను ఏ సంతకం చేయలేదు: ‘హమాస్ ప్రశ్న’ వార్తలపై కేంద్రమంత్రి
-
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Sovereign Gold Bond: మరో 2 విడతల్లో పసిడి బాండ్లు.. తేదీలివే..
-
WPL 2024 Auction: మల్లికా సాగర్.. డబ్ల్యూపీఎల్ వేలం నిర్వహణదారు ప్రత్యేకతలివే..
-
Narayana Murthy: 40 ఏళ్లు అలాగే పనిచేశా.. ‘70 పనిగంటల’ను సమర్థించుకున్న నారాయణమూర్తి
-
Nara Lokesh: ప్రాజెక్టు గేట్లకు గ్రీజు పెట్టేందుకూ నిధులు ఇవ్వట్లేదు: నారా లోకేశ్