Kerala Couple: భర్త సముద్రంలో హైజాక్కు గురై.. భార్య బాంబుల మోతలో చిక్కుకొని..!
అటు ఉక్రెయిన్ సంక్షోభం.. ఇటు హౌతీల తిరుగుబాటు.. ఓ కొత్త జంట జీవితంలో తీవ్ర అలజడి సృష్టించాయి. ప్రపంచంలో ఎక్కడో ఏర్పడిన ఘర్షణలు కేరళకు చెందిన ఆ దంపతులకు కంటిమీద కునుకు లేకుండా చేశాయి.
కొత్త జంటను కలవరపెట్టిన ప్రపంచ సంక్షోభాలు
ఇంటర్నెట్ డెస్క్: అటు ఉక్రెయిన్ సంక్షోభం.. ఇటు హౌతీల తిరుగుబాటు.. ఓ కొత్త జంట జీవితంలో తీవ్ర అలజడి సృష్టించాయి. ప్రపంచంలో ఎక్కడో ఏర్పడిన ఘర్షణలు కేరళకు చెందిన ఆ దంపతులకు కంటిమీద కునుకు లేకుండా చేశాయి. నాలుగు నెలల పాటు తీవ్ర వేదనకు గురయ్యారు. కేరళకు చెందిన అఖిల్ రఘు(26), జితినా జయకుమార్(23)కు గత ఆగస్టులో వివాహం జరిగింది. రఘు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు చెందిన కార్గో షిప్లో విధులు నిర్వర్తిస్తున్నారు. ఇటు జితినా.. ఉక్రెయిన్లో వైద్య విద్యను అభ్యసిస్తున్నారు. వివాహం జరిగిన నెల రోజుల తర్వాత ఇద్దరు వారి పనుల్లోకి వెళ్లిపోయారు. పెళ్లితో కొత్త జీవితాన్ని ప్రారంభించిన ఆ జంటకు మున్ముందు గడ్డు రోజులు రానున్నాయని ఆ సమయంలో ఎవరూ ఊహించలేకపోయారు.
నౌకను హైజాక్ చేసిన హౌతీలు..
జనవరి 2, 2022.. ఎర్రసముద్రంలో ప్రయాణిస్తోన్న ర్వాబీ నౌకలో విధులు నిర్వర్తిస్తోన్న సిబ్బందికి ఒక్కసారి కాల్పుల మోత వినిపించింది. చిన్న పడవలు వేసుకొని దాదాపు 40 మంది వారిని చట్టుముట్టి, నౌకను హైజాక్ చేశారు. రఘుతో పాటు ఏడుగురు భారతీయులు వారికి చేతిలో బందీలుగా మారిపోయారు. యెమెన్లో సౌదీ మద్దతుతో నడుస్తోన్న ప్రభుత్వానికి, హౌతీ తిరుగుబాటు దారులకు మధ్య ఏడేళ్లుగా అంతర్యుద్ధం నడుస్తోంది. దాంతో ఆ నౌకలో సౌదీ అరేబియాకు సైనిక సామాగ్రిని తరలిస్తున్నారని అనుమానించి, హౌతీలు దానిని హైజాక్ చేశారు.
నౌకలో ఉన్న 11 మంది సిబ్బందిని యెమెన్ రాజధాని సనా దగ్గర్లో హోటల్, నౌకలో మార్చి మార్చి ఉంచుతూ 112 రోజుల పాటు బంధించారు. మొదట్లో తిరుగుబాటుదారులు వీరితో కఠినంగా ఉన్నా.. వీరు అమాయకులని గ్రహించిన తర్వాత కాస్త మెతగ్గానే ఉండేవారు. అప్పుడప్పుడు ఇంటికి ఫోన్ చేసుకోవడానికి అనుమతించేవారు. అయితే వారున్న హోటల్కు 100 మీటర్ల దూరంలో బాంబు దాడి జరగడంతో వీరంతా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ‘మమ్మల్ని ఎప్పుడు వదిలేస్తారో తెలిసేదికాదు. మేం క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్నామని అర్థమైంది. మాకు ఏం జరుగుతోందో కూడా అర్థం కాలేదు’ అంటూ బందీల్లో ఒకరైన సంజీవన్ వెల్లడించారు. మరోపక్క రఘు తన భార్య ఉక్రెయిన్ సంక్షోభంలో చిక్కుకుపోయిందన్న వార్తను టీవీలో చూసి, తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
ఉక్రెయిన్ సంక్షోభంలోకి జితిన..
పెళ్లి తర్వాత తన చదువును కొనసాగించేందుకు ఉక్రెయిన్ వెళ్లిన జితినకు మొదట్లో అంతా సక్రమంగానే జరిగింది. తర్వాత అకస్మాత్తుగా తన భర్త ఫోన్ తీయకపోయేసరికి ఆమెకు భయం మొదలైంది. ఆయనకు ఏమైందోనని కంగారుపడసాగింది. తన భర్త ఉన్న నౌక హైజాక్కు గురైందని తన సోదరుడు ద్వారా తెలుసుకుంది. ఆయన కూడా రఘు పనిచేసే చోటే విధులు నిర్వర్తిస్తున్నారు. విషయం తెలిసిన వెంటనే తన భర్తను తిరిగి తీసుకువచ్చే మార్గాలపై ఆమె దృష్టిసారించారు. భారత ప్రభుత్వ అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరిపారు. ఆ సమయంలో ఆమె స్నేహితులు ఆమెకు అండగా నిలిచారు. ఇలా రోజులు గడుస్తుండగా.. ఉక్రెయిన్పై రష్యా దురాక్రమణ మొదలైంది. దాంతో వీరు బంకర్లలో దాక్కొవాల్సిన పరిస్థితి తలెత్తింది. ఇప్పుడు ఆమె తనను తాను రక్షించుకోవాల్సిన పరిస్థితిల్లోకి జారిపోయింది. అయితే భారత ప్రభుత్వం చేపట్టిన తరలింపు ఆపరేషన్ ద్వారా కొద్దిరోజులకు ఆమె ఉక్రెయిన్ సంక్షోభం నుంచి బయటపడ్డారు. కేరళకు వచ్చి, భర్త కోసం తన ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఈ విషయంలో జిబౌటీలోని భారత అంబాసిడర్ వీరికి సహకరించారు. బందీలుగా చిక్కిన వారు విడుదలవుతారని, అయితే కొంత సమయం పడుతుందని భరోసా ఇచ్చారు.
చివరకు ఆమె నమ్మకమే నిజమై..
చివరకు రంజాన్ నెల ప్రారంభం కావడంతో రెండు నెలల సంధికి హౌతీలు అంగీకరించారు. ఒమన్, ఇతర దేశాల సహకారంతో భారత ప్రభుత్వం వారిని విడిపించగలిగింది. తన భర్త ఫోన్ చేసి చెప్పిన తర్వాతే తాను ఆ విషయాన్ని నమ్మానన్నారు జితిన. ‘ఈ సమయంలో నాకు భయంగా అనిపిస్తే..దేవుడిని ప్రార్థించేదాన్ని. నేను ఏడిస్తే.. అప్పటికే ఆందోళనలో ఉన్న మా తల్లిదండ్రులు ఇంకా ఒత్తిడికి గురవుతారనిపించింది. నేనింత ధైర్యంగా ఎలా ఉన్నానో తెలీదు. కానీ ఆయన తిరిగి వస్తారని నా మనసులో గట్టి నమ్మకం ఉండేది. అదే నిజమైంది’ అంటూ తన కుటుంబాలకు ఎదురైన కఠిన పరీక్షల గురించి వెల్లడించారు. చివరకు గతవారం కొచ్చి విమానాశ్రయంలో రఘు దిగడంతో జితినకు ప్రాణం లేచొచ్చినట్లయింది. రఘుతో పాటు ఉన్న ఇతర భారతీయులు కూడా వారి సొంత ప్రాంతాలకు చేరుకున్నారు. ఇది తమకు పునర్జన్మ అంటూ ఉద్వేగానికి గురయ్యారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేజ్రీవాల్ పాస్వర్డులు చెప్పలేదు
మద్యం విధానానికి సంబంధించిన కేసులో అరెస్టయిన దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ 4 డిజిటల్ పరికరాల పాస్వర్డులను చెప్పలేదని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తెలిపింది. -
మరోసారి తండ్రైన పంజాబ్ సీఎం మాన్
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్(50) మరోసారి తండ్రయ్యారు. ఆయన సతీమణి గుర్ప్రీత్ కౌర్ గురువారం పండంటి పాపకు జన్మనిచ్చారు. -
మేం జోక్యం చేసుకోలేం
మద్యం విధానానికి సంబంధించిన కేసులో అరెస్టయిన ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ను సీఎం పదవి నుంచి తప్పించాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) దిల్లీ హైకోర్టు గురువారం కొట్టివేసింది. -
ఐరాస శాంతి పరిరక్షకుల నేరాలపై డేటాబేస్ ప్రారంభించిన భారత్
ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షకులపై నమోదైన నేరాల నిక్షిప్తానికి, సదరు నిందితుల విచారణలో పురోగతిని పర్యవేక్షించడానికి భారతదేశం కొత్త డేటాబేస్ను రూపొందించిందని ఐరాస భారత ప్రతినిధి రుచిరా కాంబోజ్ గురువారం తెలిపారు. -
నెట్ మార్కుల ఆధారంగా పీహెచ్డీ ప్రవేశాలు: యూజీసీ
వచ్చే విద్యా సంవత్సరం నుంచీ జాతీయ అర్హత పరీక్ష (ఎన్ఈటీ) మార్కుల ఆధారంగా పీహెచ్డీ ప్రవేశాలు కల్పించనున్నట్లు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) తెలిపింది. -
అండర్ గ్రాడ్యుయేట్ ప్రవేశాలకు కామన్ కౌన్సెలింగుకు యోచన!
మెడికల్, ఇంజినీరింగ్ కోర్సుల తరహాలో సీయూఈటీ (కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్) మార్కుల ఆధారంగా అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల ప్రవేశాలకు కామన్ కౌన్సెలింగు నిర్వహించాలని యూజీసీ యోచిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. -
గురుద్వారా కర్ సేవా చీఫ్పై కాల్పులు
ఉత్తరాఖండ్లోని ఉధాంసింగ్ నగర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. నానక్మత్తా సాహిబ్ గురుద్వారాకు చెందిన డేరా కర్ సేవా చీఫ్ బాబా తర్సేమ్ సింగ్ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. -
కస్టోడియల్ మృతి కేసుల్లో.. పోలీసులకు బెయిల్ విషయంలో కఠినంగా వ్యవహరించాలి: సుప్రీం
కస్టోడియల్ మరణాల కేసులో పోలీసు అధికారులకు బెయిలిచ్చే విషయంలో న్యాయస్థానాలు కఠినంగా వ్యవహరించాలని సుప్రీంకోర్టు పేర్కొంది. -
నా భర్త అనుమానాస్పద మృతిపై దర్యాప్తు జరగాలి: సీతా సోరెన్
ఝార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) అధినేత శిబు సోరెన్ కుటుంబానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన పెద్ద కోడలైన సీత తన భర్త దుర్గా సోరెన్ అనుమానాస్పద మరణంపై ఉన్నతస్థాయి దర్యాప్తు జరగాలని గురువారం డిమాండ్ చేశారు. -
సంక్షిప్త వార్తలు
మాజీ ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్కు 1996 నాటి డ్రగ్స్ కేసులో గురువారం గుజరాత్లోని బనాస్కాంఠా జిల్లా కోర్టు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. -
టికెట్ రాలేదని ఆత్మహత్యాయత్నం చేసిన ఎంపీ కన్నుమూత
ఎన్నికల ముంగిట తమిళనాడులో విషాదం చోటుచేసుకుంది. టికెట్ దక్కలేదనే మనస్తాపంతో ఈ నెల 24న ఆత్మహత్యాయత్నం చేసిన ఈరోడ్ ఎంపీ, ఎండీఎంకే సీనియర్ నేత ఎ.గణేశమూర్తి(77) కోయంబత్తూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం చనిపోయారు. -
తేజస్ ఎంకే1ఏ తొలి విహారం విజయవంతం
తేజస్ ఎంకే1ఏ శ్రేణిలో రూపొందిన యుద్ధ విమానం ఎల్ఏ-5003 తన తొలి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. పూర్తిస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) ఈ యుద్ధ విమానాన్ని రూపొందించింది. -
ఐరాస సెక్రటరీ జనరల్ ప్రత్యేక ప్రతినిధిగా కమల్ కిశోర్
జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(ఎన్డీఎంఏ) ఉన్నతాధికారి కమల్ కిశోర్ (55).. ఐక్యరాజ్యసమితి(ఐరాస) సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ప్రత్యేక ప్రతినిధిగా నియమితులయ్యారు. -
గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో ఆస్పత్రిలో మృతి
ఉత్తర్ప్రదేశ్ జైలులో శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్స్టర్, రాజకీయవేత్త ముఖ్తార్ అన్సారీ (63) గురువారం గుండెపోటుతో మృతిచెందినట్లు బాందాలోని రాణీ దుర్గావతి వైద్య కళాశాల ప్రిన్సిపల్ సునీల్ కౌశల్ ప్రకటించారు. -
4 వాంగ్మూలాలతో సీఎం అరెస్టా?
ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)ని అణచివేసేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ప్రయత్నిస్తోందని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. -
నిరంతర ప్రేరణ శక్తి.. స్వామి స్మరణానంద
రామకృష్ణమఠం, రామకృష్ణ మిషన్లకు 16వ అధిపతిగా ఉన్న స్వామి స్మరణానంద కన్నుమూత తనను నిర్ఘాంతపరిచిందని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. -
న్యాయవ్యవస్థపై ఒత్తిళ్లకు కుతంత్రాలు
న్యాయవ్యవస్థపై ఒత్తిళ్లు తీసుకువచ్చి, న్యాయస్థానాల ప్రతిష్ఠను మసకబార్చేందుకు ‘స్వార్థ ప్రయోజనాలతో కూడిన ఒక బృందం’ ప్రయత్నాలు చేస్తోందని 600 మందికిపైగా న్యాయవాదులు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్కు ఉమ్మడిగా లేఖ రాశారు. -
దిల్లీ హైకోర్టులోనూ కాంగ్రెస్కు ఎదురుదెబ్బ
ఆదాయపు పన్ను అంశంలో కాంగ్రెస్ పార్టీకి మళ్లీ ఎదురుదెబ్బ తగిలింది. 2017 నుంచి 2021 మధ్య కాలానికి ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం చేపట్టిన పునఃపరిశీలన ప్రక్రియను నిలిపివేయాలంటూ ఆ పార్టీ దాఖలు చేసిన పిటిషన్లను గురువారం దిల్లీ హైకోర్టు కొట్టివేసింది. -
‘అగ్నివీర్’లో మార్పులకు సిద్ధం: రాజ్నాథ్
ప్రస్తుతం అమలవుతున్న అగ్నివీర్/అగ్నిపథ్ నియామక పథకంలో అవసరమైతే మార్పులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. -
దేశం అప్పు రూ.160 లక్షల కోట్లు
కేంద్ర ప్రభుత్వ అప్పులు గత డిసెంబరు నాటికి రూ.160.69 లక్షల కోట్లకు చేరాయి. గత సెప్టెంబరు నాటికి రూ.157.84 లక్షల కోట్లు ఉన్న అప్పులు డిసెంబరు నాటికి మరింత పెరిగాయి. -
ఉపాధిహామీ వేతనాల సవరణ
ఉపాధిహామీ పథకం కింద చెల్లించే వేతనాలను కేంద్ర ప్రభుత్వం సవరించింది. రాష్ట్రాలవారీగా 4 నుంచి 10 శాతం మేర ఇవి పెరిగాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఏపీలో రోగులకు ఎన్నికల కష్టాలు
-
అనపర్తి స్థానం మార్పు వైకాపా కుట్ర: నల్లమిల్లి
-
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి