Kidnap: యూఎస్లో భారతీయ కుటుంబం దారుణ హత్య.. పంజాబ్లో విషాదఛాయలు!
అమెరికాలోని కాలిఫోర్నియాలో ఇటీవల కిడ్నాప్కు గురైన భారత సంతతి కుటుంబం దారుణ హత్యకు గురైంది. ఎనిమిది నెలల పాపతో పాటు నలుగురిని దారుణంగా హత్య చేసిన ఘటనతో పంజాబ్లో తీవ్ర విషాదం నెలకొంది.
హోషియార్పూర్: అమెరికాలోని కాలిఫోర్నియాలో ఇటీవల కిడ్నాప్కు గురైన భారత సంతతి కుటుంబం దారుణ హత్యకు గురైంది. ఎనిమిది నెలల పాపతో పాటు నలుగురిని దారుణంగా హత్య చేసిన ఘటనతో పంజాబ్లో తీవ్ర విషాదం నెలకొంది. మృతుల స్వగ్రామం హర్షిపిండ్లో విషాద ఛాయలు అలముకున్నాయి. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివెళ్తున్నారు. ఈ దారుణానికి పాల్పడిన వారిని గుర్తించిన కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. విదేశాలకు వెళ్లే భారతీయుల భద్రతకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాలను కోరుతున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. కాలిఫోర్నియాలోని మెర్సిడెస్ కౌంటీలో నివాసముంటున్న భారత సంతతికి చెందిన జస్దీప్ సింగ్ కుటుంబం ట్రక్కుల రవాణ వ్యాపారం చేస్తోంది. సోమవారం ఉదయం జస్దీప్ సింగ్ (36), ఆయన భార్య జస్లీన్ కౌర్ (27), తమ ఎనిమిది నెలల పాప ఆరూహి దేహ్రీతో పాటు చిన్నారి మామ అమన్దీప్ సింగ్ (39)ను ఓ గుర్తు తెలియని దుండగుడు తుపాకితో బెదిరించి ఓ ట్రక్కులో ఎక్కించుకొని కిడ్నాప్ చేశాడు. దీంతో దర్యాప్తు చేసిన పోలీసుల బుధవారం సాయంత్రం ఇండియానా రోడ్డు, హచిన్సన్ రోడ్డు సమీపంలోని ఓ తోటలో వీరి మృతదేహాలను గుర్తించారు. ఈ వార్త తెలియడంతో పంజాబ్లోని వారి స్వగ్రామం హర్షిపిండ్తో పాటు పాటు సమీప గ్రామల్లో విషాదఛాయలు అలముకున్నాయి. స్థానిక ప్రజలు జస్దీప్ నివాసానికి చేరుకొని వారి తల్లిదండ్రులను పరామర్శించేందుకు వెళ్లగా.. ఇంటికి తాళం వేసి ఉండటంతో వెనుదిరుగుతున్నారు.
జస్దీప్ తల్లిదండ్రులిద్దరూ ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేసి రిటైరయ్యారు. తమ పిల్లలు కిడ్నాప్కు గురైన వార్త తెలియగానే ఆ దంపతులిద్దరూ అమెరికా బయల్దేరి వెళ్లారు. ఈ ఘటనపై హర్షిపిండ్ సర్పంచ్ సిమ్రాన్ సింగ్ మాట్లాడుతూ.. ‘‘ఈ దుర్ఘటన గురించి తెలియగానే గ్రామస్థులంతా శోకసంద్రంలో మునిగిపోయారు. జస్దీప్ తండ్రి రణ్ధీర్ సింగ్ ఇంట్లో ఎవరూ లేకపోవడంతో జనం వెనుదిరిగి వెళ్లిపోతున్నారు. రణ్ధీర్ సోదరి ఇల్లు తెలిసినవారు అక్కడికి వెళ్లి తమ సానుభూతి తెలుపుతున్నారు. విదేశాలకు వెళ్లే భారతీయులకు భద్రత ఉండాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ దారుణానికి పాల్పడిన దోషులకు కఠిన శిక్షలు విధించాలి’’ అని తెలిపారు.
పంజాబ్ సీఎం, కేంద్రమంత్రి దిగ్భ్రాంతి
ఈ ఘటనపై కేంద్రమంత్రి, ఎంపీ సోం ప్రకాశ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఇంకోవైపు, ఈ ఘటనపై పంజాబ్ సీఎం భగవంత్ మాన్, శిరోమణి అకాలీద్ అధ్యక్షుడు సుఖ్బీర్సింగ్ బాదల్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. తమ రాష్ట్రానికి చెందిన కుటుంబం అమెరికాలో హత్యకు గురికావడం పట్ల ఉన్నత స్థాయి విచారణ జరిగేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్.జయశంకర్కు విజ్ఞప్తి చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
పతి దేవుడికి గుడి కట్టింది!
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
శరీర బరువు తగ్గించే శస్త్రచికిత్సకు వెళ్లి..
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
-
పులివెందులలోనూ పరదాల వీరుడే.. నేడు సీఎం జగన్ నామినేషన్