బైడెన్ ఎన్నిక.. కిమ్ కీలక నిర్ణయం!
ఓ వైపు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ విజయాన్ని అమెరికా కాంగ్రెస్ ధ్రువీకరించిన రోజునే.. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశ సైనిక సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేస్తానని ప్రతిజ్ఞ చేశారు.ఈ మేరకు పార్టీ కీలక నేతలతో నిర్వహించిన....
ప్యాంగాంగ్: ఓ వైపు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ విజయాన్ని అమెరికా కాంగ్రెస్ ధ్రువీకరించిన రోజునే.. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశ సైనిక సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేస్తానని ప్రతిజ్ఞ చేశారు.ఈ మేరకు పార్టీ కీలక నేతలతో నిర్వహించిన భేటీలో ఈ విషయాన్ని ప్రకటించారు. అమెరికా- ఉత్తర కొరియా అణు ఒప్పందంపై ప్రతిష్టంభన ఏర్పడిన నేపథ్యంలో కిమ్ వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడింది. ‘‘ దేశ రక్షణ సంబంధిత వ్యవహారంలో సైనిక సామర్థ్యాలు పటిష్ఠంగా ఉండాలి. దీనికోసం మనం మరింత కృషి చేయాలి’’ అని కిమ్ చెప్పినట్లు అక్కడి మీడియా వెల్లడించింది.
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఉత్తర కొరియాతో అణు ఒప్పందంపై చర్చలతో ముందుకెళ్లారు. అయితే ఇరుదేశాల మధ్య పొత్తులు కుదరకపోవడంతో 2019లో అమెరికా, ఉత్తరకొరియా మధ్య అణ్వాయుధ అంశంపై జరిగిన చర్చలు విఫలమైయ్యాయి. మరోవైపు ఇటీవల జరిగిన అమెరికా ఎన్నికల ప్రచారంలో నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన బైడెన్.. కిమ్ జోంగ్ ఉన్ను ‘దుండగుడు’గా పేర్కొన్నారు. దీనిని బట్టి బైడెన్కు కిమ్పై వ్యతిరేక దృక్పథం ఉందని చెప్పుకోవచ్చు. అధ్యక్షుడిగా పూర్తి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇది మరింత ఎక్కువైనా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ నేపథ్యంలోనే ఉత్తర కొరియా తన సైనికబలాన్ని బలోపేతం చేసుకునే దిశగా అడుగులు వేస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఏ చిన్న గొడవ వచ్చినా అణుయుద్ధానికి దిగుతామని హెచ్చరించే కిమ్.. బైడెన్ అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటి నుంచి ఆ పదాన్నే వాడలేదట. ఎందుకంటే ట్రంప్లా కాకుండా బైడెన్ చాలా కఠినంగా వ్యవహరిస్తారనే ఉద్దేశంతోనే మౌనంగా ఉంటున్నట్లు కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.
మొదట్లో ట్రంప్ కూడా అంతే..
ట్రంప్ అధ్యక్ష పదవి చేపట్టిన కొత్తలో ఉత్తర కొరియా మీద కారాలు మిరియాలు నూరిన విషయం విదితమే. ఆ దేశానికి బుద్ధి చెప్పడానికి యుద్ధనౌకలను పంపిస్తున్నాననీ ప్రకటించారు. ఉత్తర కొరియాపై అమెరికా, ఐక్యరాజ్య సమితి ఆంక్షలు విధించాయి కూడా. కిమ్ వీటిని ఖాతరు చేయకుండా ఏప్రిల్ 29న క్షిపణి పరీక్ష నిర్వహించగా అది విఫలమైంది. మొదట్లో ఉత్తర కొరియాపై సైనిక చర్యకు సిద్ధపడిన ట్రంప్.. తరవాత మెత్తబడ్డారు. పరిస్థితులు కలిసొస్తే.. కిమ్ జోంగ్ ఉన్తో సమావేశమవడానికి అభ్యంతరం లేదని, ఆయన్ను కలవడం గౌరవంగా భావిస్తానని ట్రంప్ అన్నారు. అందుకు ఉత్తర కొరియా ప్రభుత్వ ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు. అంతలోనే మే 14న కిమ్ మరో క్షిపణి పరీక్ష జరిపి అమెరికా, దక్షిణ కొరియా, జపాన్లకు చిర్రెత్తించారు. ఉత్తర కొరియాపై మరింత తీవ్ర ఆంక్షలు విధించాలని ప్రపంచ దేశాలకు అమెరికా పిలుపు ఇచ్చింది. ఈ నేపథ్యంలో అమెరికా- ఉత్తరకొరియా మధ్య అణు చర్యలు రద్దయ్యాయి. తాజాగా మరికొన్ని రోజుల్లో బైడెన్ బాధ్యతలు చేపట్టనున్న నేపథ్యంలో మళ్లీ కిమ్ జోంగ్ ఉన్ ఉత్తర కొరియా సైనిక శక్తిని బలోపేతం చేస్తామని ప్రకటించడం గమనార్హం.
ఇవీ చదవండి
బైడెన్కు అధికారాన్ని అప్పగిస్తా: ట్రంప్
సారీ ప్రెసిడెంట్.. అలా చేయలేకపోయా...
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈడీ కేసు.. శిల్పాశెట్టి దంపతుల రూ.98 కోట్ల ఆస్తులు అటాచ్
Shilpa Shetty: బాలీవుడ్ నటి శిల్పాశెట్టి దంపతులకు చెందిన రూ.98కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. -
రాహుల్ స్పూన్ ఫీడింగ్ కిడ్.. సురక్షిత స్థానాలనే ఎంచుకుంటున్నారు: ఆజాద్
కాంగ్రెస్ మాజీ నేత గులాం నబీ ఆజాద్.. రాహుల్ గాంధీ (Rahul Gandhi)ని తీవ్ర స్థాయిలో విమర్శించారు. అలాగే ఆయన భాజపాపై పోరాడే తీరును ఎద్దేవా చేశారు. -
ఎన్కౌంటర్ల ‘లక్ష్మణ్’.. మావోయిస్టులకు సింగం
Encounter Specialist: బస్తర్లో మంగళవారం చోటుచేసుకున్న భారీ యాంటీ నక్సల్స్ ఆపరేషన్కు ఓ ఇన్స్పెక్టర్ నేతృత్వం వహించారు. ఆయన ఓ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్..! మావోయిస్టులకు సింగంగా ఆయనకు పేరుంది. -
టైమ్ జాబితాలో సత్య నాదెళ్ల, ఆలియాభట్
ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగా, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, బాలీవుడ్ నటి ఆలియాభట్, నటుడు, డైరెక్టర్ దేవ్ పటేల్ టైమ్ మేగజీన్ 2024 ఏడాదికి రూపొందించిన ప్రపంచంలోనే అత్యంత ప్రభావశీలురైన 100 మంది వ్యక్తుల జాబితాలో చోటు సంపాదించారు. -
పదేళ్లలో పెరిగిన ఈడీ జోరు
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జోరు గత పదేళ్లలో పెరిగింది. సోదాలు, అరెస్టుల సంఖ్య భారీగా హెచ్చింది. యూపీఏ హయాంతో పోలిస్తే భాజపా పాలనలో దేశవ్యాప్తంగా 86 రెట్లు ఎక్కువగా ఈడీ సోదాలు నిర్వహించింది. -
భద్రతా బలగాల మానసిక యుద్ధం!
మావోయిస్టులపై భద్రతా బలగాలు మానసిక యుద్ధానికి తెరదీశాయి. ప్రస్తుతం దేశంలో మావోయిస్టులకు ఆయువుపట్టుగా ఉన్న అబూఝ్మాడ్లోకి చొచ్చుకెళ్లడమే లక్ష్యంగా ప్రత్యేక వ్యూహాలతో ముందుకెళ్తున్నాయి. -
ఎన్నికల సభల్లో ‘పర్యావరణ స్ఫూర్తి’
రాజకీయ పార్టీల బహిరంగ సభలు, రోడ్షోలు ముగియగానే.. రోడ్లపై వేసిన చెత్తాచెదారం అలాగే వదిలేసి ఎవరి దారి వారు చూసుకొంటారు. -
ప్రొఫెసర్ శోమా సేన్ జైలు నుంచి విడుదల
ఎల్గార్ పరిషద్-మావోయిస్టు సంబంధాల కేసులో నిందితురాలు, నాగపుర్ విశ్వవిద్యాలయం మాజీ ప్రొఫెసర్ శోమా సేన్ (66) బుధవారం మధ్యాహ్నం జైలు నుంచి విడుదలయ్యారు. -
త్వరలోనే నక్సలైట్లను పూర్తిగా ఏరివేస్తాం: అమిత్షా
రానున్న అతి కొద్ది కాలంలో నక్సలైట్లను వందశాతం ఏరివేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. -
దేశ జనాభా 144 కోట్లు
దేశ జనాభా ఈ ఏడాదికి సుమారుగా 144 కోట్లు ఉంటుందని యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ (యూఎన్ఎఫ్పీఏ) స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్-2024 నివేదికలో అంచనా వేసింది. -
పంజాబ్లో రైల్వేట్రాక్పై రైతుల బైఠాయింపు
హరియాణా పోలీసులు అరెస్టు చేసిన ముగ్గురు రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పంజాబ్లోని పటియాలా జిల్లాలో సంయుక్త కిసాన్ మోర్చా (రాజకీయేతర), కిసాన్ మజ్దూర్ మోర్చాల నేతృత్వంలో అన్నదాతలు బుధవారం ఆందోళన చేపట్టారు. -
పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని ఓటేయండి
పర్యావరణానికి సంబంధించిన అంశాల్లో దేశ పురోగతిని దృష్టిలో పెట్టుకొని సార్వత్రిక ఎన్నికల్లో ఓటేయాలని దేశ ప్రజలకు 70కిపైగా పర్యావరణ, పౌర సమాజ బృందాలు బుధవారం పిలుపునిచ్చాయి. -
జాబిల్లిపై భారతీయుడు కాలుమోపే వరకూ చంద్రయాన్ యాత్రలు: ఇస్రో ఛైర్మన్
చంద్రుడిపైకి భారత వ్యోమగామిని దించేవరకూ చంద్రయాన్ శ్రేణి ప్రయోగాలు కొనసాగుతూనే ఉంటాయని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఛైర్మన్ ఎస్.సోమనాథ్ తెలిపారు. -
ముంబయి మహిళకు పాక్లో చిత్రహింసలు
పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావిన్సులో భారతీయురాలైన భార్యను చిత్రహింసలు పెడుతున్న భర్తపై కేసు నమోదు చేసినట్లు లాహోర్ పోలీసులు బుధవారం వెల్లడించారు. -
సంక్షిప్త వార్తలు (5)
లోక్సభ ఎన్నికల మొదటి దశ పోలింగ్ నేపథ్యంలో కూచ్ బిహార్లో తలపెట్టిన పర్యటనను రద్దు చేసుకోవాలని ఎన్నికల సంఘం (ఈసీ) పశ్చిమ బెంగాల్ గవర్నర్కు స్పష్టంచేసింది. -
పీవీ, మన్మోహన్లపై మోదీ ప్రభుత్వం ప్రశంసలు
మాజీ ప్రధానులు పి.వి.నరసింహారావు, మన్మోహన్ సింగ్లపై మోదీ సర్కారు ప్రశంసల జల్లు కురిపించింది. -
అయోధ్య రాముడికి తిలకం దిద్దిన సూరీడు
శ్రీరామనవమి వేళ అయోధ్యలోని రత్నకిరీట ధారి బాలరాముడి నుదుటిపై బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు సూర్యకిరణాలతో తిలకం 4 - 5 నిమిషాలు సాక్షాత్కరించింది. -
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
మహారాష్ట్రలోని హర్సుల్ సెంట్రల్ జైలు అక్కడ ఉండే ఖైదీలు తమ వారితో మాట్లాడుకోవడానికి స్మార్ట్ కార్డులను జారీ చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
జగన్పై రాయి దాడి కేసు.. ఆ ఆరుగురి వివరాలు తెలపాలంటూ కోర్టులో పిటిషన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ప్రపంచంలో బెస్ట్ ఎయిర్పోర్టులివే.. భారత విమానాశ్రయాలు ఏ స్థానంలో..?
-
ఈడీ కేసు.. శిల్పాశెట్టి దంపతుల రూ.98 కోట్ల ఆస్తులు అటాచ్
-
అదంతా ఫేక్ న్యూస్.. నేనెవరినీ కలవలేదు: రోహిత్ శర్మ
-
కళ్యాణదుర్గంలో వైకాపా అరాచకం.. దాడిలో తెదేపా నేతకు తీవ్ర గాయాలు