Viral news: ఇదేం పెళ్లిరా బాబోయ్.. పీటల మీద కూడా పనేనా?
ఓ వైపు పురోహితుడు పెళ్లి తంతు జరుపుతుండగా.. మరోవైపు వరుడు ల్యాప్టాప్లో సీరియస్గా పని చేసుకుంటున్న ఫొటో ఒకరి సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. దీనిపై రకరకాల కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.
ఇంటర్నెట్డెస్క్: ఓ వైపు పెళ్లి బాజాలు మోగుతున్నాయి. పురోహితుడు వేద మంత్రాలు పఠిస్తున్నాడు. పెళ్లి పీటల మీద ఉన్న వరుడు మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా.. ల్యాప్టాప్లో సీరియస్గా పని చేసుకుంటున్నాడు. ఈ విచిత్ర ఘటన ఎక్కడ జరిగిందో కచ్చితంగా తెలియదు కానీ, దీనికి సంబంధించిన ఫొటోను ‘కోల్కతా ఇన్స్టాగ్రామర్స్’ అనే అకౌంట్తో ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేయడంతో వైరల్గా మారింది. వర్క్ ఫ్రమ్ హోం కల్చర్ను ఈ పెళ్లికొడుకు మరోస్థాయికి తీసుకెళ్లాడంటూ నెటిజన్లు కామెంట్లు గుప్పిస్తున్నారు.
‘కనీసం పెళ్లి రోజున కూడా ఆనందంగా ఉండనివ్వరా’? అని కొందరు విమర్శిస్తుండగా.. మరి కొందరు మాత్రం దీనికి వ్యతిరేకంగా స్పందిస్తున్నారు. ‘పెళ్లి రోజున పని చేయాలని ఏ సంస్థ కూడా చెప్పదు. వృత్తి జీవితాన్ని వ్యక్తి గత జీవితాన్ని ఎలా సమతుల్యం చేసుకోవాలో ఈ పెళ్లి కొడుకు నేర్చుకోవాలి’ అని కామెంట్ చేశారు. మరికొందరు మాత్రం దీనిని ఏదో సరదాకి చేసిన పనిగా కొట్టిపారేశారు. ఇలా జరగడం ఇదే తొలిసారి కాదు. పెళ్లి జరిగిన తొలిరోజు రాత్రే వరుడు ల్యాప్టాప్లో పని చేసుకోవడం గత ఏడాది సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.