పుణ్య స్నానానికి.. ‘కరోనా నెగెటివ్‌’ తప్పనిసరి..!

దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్‌ విజృంభిస్తోన్న నేపథ్యంలో హరిద్వార్‌లో నిర్వహించే కుంభమేళాకు వచ్చే యాత్రికులు తప్పనిసరిగా ఆర్టీపీసీఆర్‌ టెస్టులు చేసుకొని రావాలని ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. ఈ మేరకు దేశంలో వైరస్‌ వ్యాప్తి అధికమవుతుండటంతో కుంభమేళా ఒక నెల పాటే జరగనుందని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు...

Published : 26 Mar 2021 01:22 IST

హరిద్వార్: దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్‌ విజృంభిస్తోన్న నేపథ్యంలో హరిద్వార్‌లో నిర్వహించే కుంభమేళాకు వచ్చే యాత్రికులు తప్పనిసరిగా ఆర్టీపీసీఆర్‌ టెస్టులు చేసుకొని రావాలని ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. ఈ మేరకు దేశంలో వైరస్‌ వ్యాప్తి అధికమవుతుండటంతో కుంభమేళా ఒక నెల పాటే జరగనుందని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. అయితే కుంభమేళాను నెల రోజులు జరపడం ఇదే తొలిసారి అని చెప్పారు. ఈ క్రమంలో కుంభమేళాకు రానున్న భక్తులు హరిద్వార్‌కు చేరుకొనే 72 గంటల్లోపు కొవిడ్ టెస్టులు చేయించుకోవాలి.  కొవిడ్ నెగెటివ్‌ సర్టిఫికేట్‌ ఉన్నవారికి మాత్రమే కుంభమేళాకు అనుమతి ఉంటుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే.. భక్తుల తాకిడి అధికమవుతుండటంతో కొవిడ్ టెస్టుల సంఖ్యను పెంచాలని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం సూచించింది. ఈ మేరకు యాత్రికులు కరోనా జాగ్రత్తలు పాటించాలని అధికారులు కోరుతున్నారు. 

కాగా ఫిబ్రవరి 27 నుంచి ఏప్రిల్ 30 వరకు ఈ కుంభమేళా జరుగుతుందనే విషయం తెలిసిందే.. అయితే కరోనా ఉద్ధృతి కొనసాగుతున్న దృష్ట్యా ఏప్రిల్‌ 1 నుంచి 30 వరకు మాత్రమే యాత్రికులు పుణ్యస్నానాలు ఆచరించాలని అధికారులు సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని