ఘనంగా లాలూ 74వ పుట్టినరోజు
రాష్ట్రీయ జనతాదళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ గురువారం తన 74వ పుట్టినరోజును కుటుంబ సభ్యులతో జరుపుకొన్నారు.
పట్నా: పశువుల దాణా కుంభకోణం కేసులో బెయిల్ పొందడంతో ఇటీవల జైలు నుంచి విడుదలైన రాష్ట్రీయ జనతాదళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ శుక్రవారం 74వ పుట్టినరోజును కుటుంబ సభ్యులతో జరుపుకొన్నారు. ఆయన బెయిల్ పొందినప్పటి నుంచి దిల్లీలోని ఆయన కుమార్తె మిసా ఇంట్లో నివాసముంటున్నారు. పుట్టినరోజు వేడుకల దృశ్యాలను మిసా భారతి సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. లాలు ప్రసాద్ పెద్ద కుమారుడు.. తేజ్ ప్రతాప్ యాదవ్ తన తండ్రి జన్మదినం సందర్భంగా పట్నాలో 74 మొక్కలు నాటారు. పట్నాలోని ఆర్జేడీ కార్యాలయంలో రక్తదానశిబిరం ఏర్పాటు చేయగా.. 200 యూనిట్ల రక్తాన్ని యువకులు దానం చేశారు. కొవిడ్ దృష్ట్యా, అనారోగ్యం కారణంగా ఆయని పట్నా తీసుకొచ్చేందుకు కుటుంబసభ్యులు నిరాకరిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కాంగ్రెస్కు మళ్లీ షాక్.. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు
-
విజయ్ దేవరకొండను పార్టీ అడిగిన రష్మిక.. ఎందుకంటే..?
-
ప్రధాని మోదీ, బిల్గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
-
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
-
నిన్న అమెరికా, నేడు ఐరాస.. భారత అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యలు!
-
మేనల్లుడికి అత్యున్నతాధికారి నజరానా!