Lalu Yadav: మరింత క్షీణించిన లాలూ ఆరోగ్యం.. ఎయిమ్స్‌కు తరలింపు!

ఆర్​జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం మరింత క్షీణించినట్లు సమాచారం. ప్రస్తుతం రాంచీలోని రిమ్స్​లో చికిత్స పొందుతున్న ఆయనను మెరుగైన చికిత్స నిమిత్తం......

Updated : 22 Mar 2022 20:05 IST

రాంచీ: ఆర్​జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం మరింత క్షీణించినట్లు సమాచారం. ప్రస్తుతం రాంచీలోని రిమ్స్​లో చికిత్స పొందుతున్న ఆయనను మెరుగైన చికిత్స నిమిత్తం దిల్లీ తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే రిమ్స్​ మెడికల్​ బోర్డు సమావేశమై దీనిపై తుది నిర్ణయం తీసుకున్న తర్వాతే లాలూను దిల్లీ ఆస్పత్రికి తీసుకెళ్ళనున్నారు. బోర్డు నిర్ణయం కోసమే అధికారులు ఎదురు చూస్తున్నారు. మరోవైపు రిమ్స్​లోనే చికిత్స పొందుతున్న ఆర్​జేడీ ఎంపీ ఆర్​కే రాణాను దిల్లీకి తరలించేందుకు మెడికల్ బోర్డు అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది.

పశువుల దాణ కుంభకోణం కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న లాలూ.. అనారోగ్యం కారణంగా రాంచీలోని రిమ్స్​లో చేరారు. అక్కడే చాలా రోజుల నుండి చికిత్స పొందుతున్నారు. అయితే మంగళవారం ఉదయం ఆయన ఆరోగ్యం క్షీణించింది. దీంతో ఆయనకు చికిత్స అందిస్తున్న చీఫ్​ డాక్టర్ విద్యాపాటి.. దిల్లీలోని ఎయిమ్స్​కు తరలించాలని సూచించారు. ఈ విషయంపైనే రిమ్స్​ మెడికల్ బోర్డు సమావేశమైంది. తుది నిర్ణయం తీసుకున్న తర్వాత లాలూను దిల్లీ ఎయిమ్స్​కు తరలించే అవకాశం ఉంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని