Corona:మహమ్మారి కట్టడికి లాన్సెట్ సూచనలు!
భారత్లో కరోనా రెండోదశ ఒక్కసారిగా విరుచుకుపడింది. వైద్య, ఆరోగ్య సంరక్షణా వ్యవస్థలపై తీవ్ర ఒత్తిడి పడింది. ఈ క్రమంలో భారత్కు ప్రపంచ దేశాలు సంఘీభావం ప్రకటించాయి. అనేక దేశాలు సాయం చేయడానికి ముందుకు వచ్చాయి.
ఇంటర్నెట్ డెస్క్: భారత్లో కరోనా రెండోదశ ఒక్కసారిగా విరుచుకుపడింది. వైద్య, ఆరోగ్య సంరక్షణా వ్యవస్థలపై తీవ్ర ఒత్తిడి పడింది. ఈ క్రమంలో భారత్కు ప్రపంచ దేశాలు సంఘీభావం ప్రకటించాయి. అనేక దేశాలు సాయం చేయడానికి ముందుకు వచ్చాయి. అయితే, గత కొన్ని రోజులుగా రోజువారీ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోంది. ఈ తరుణంలో భారత్లో మహమ్మారి విజృంభణ, వైద్యారోగ్య పరిస్థితులపై ప్రముఖ మెడికల్ జర్నల్ లాన్సెట్కు చెందిన సిటిజన్స్ కమిషన్ స్పందించింది. కరోనా కట్టడికి చేపట్టాల్సిన తక్షణ చర్యలను సూచిస్తూ యామిని అయ్యర్ నేతృత్వంలోని ఓ బృందం లాన్సెట్లో వ్యాసాన్ని ప్రచురించింది.
కొవిడ్ కేసుల సంఖ్యకు, దేశంలో అందుబాటులో ఉన్న వైద్య వసతులకు ఎక్కడా పొంతన లేదని అభిప్రాయపడింది లాన్సెట్ కమిషన్. అందువల్ల సాంకేతికతను పెద్ద ఎత్తున వినియోగించుకోవాలని సూచించింది. తద్వారా ఔషధాలు, బెడ్లు, ఆక్సిజన్ వంటి వసతుల నిర్వహణలో ఇబ్బందులను అధిగమించేందుకు అవకాశం ఏర్పడుతుందని తెలిపింది. అలాగే క్షేత్రస్థాయి వరకు చేరేలా వైద్య సేవల్ని మరింత వికేంద్రీకరించాలని చెప్పింది.
ఔషధాలు, వైద్య పరికరాల బ్లాక్ మార్కెటింగ్ను అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పేర్కొంది. వీటన్నింటి ధరలపై పరిమితి విధించాలని హితవు పలికింది. టెలీ మెడిసిన్ సేవల్ని మరింత విస్తృతం చేయాలంది. తద్వారా ఆసుపత్రులపై ఒత్తిడి తగ్గుతుందని అభిప్రాయపడింది. ప్రైవేటు, ప్రభుత్వ రంగంలో ఉన్న వైద్యపరమైన మానవ వనరుల్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని తెలిపింది. ఈ క్రమంలో ఎంబీబీఎస్ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులను కొవిడ్ సేవలకు వినియోగించుకోవాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించింది.
టీకాల కొనుగోలు, ఉచితంగా పంపిణీ కోసం ఓ కేంద్రీకృత వ్యవస్థ ఉండాలని లాన్సెట్ కమిషన్ సూచించింది. అలాగే రానున్న రోజుల్లో కేసులు అధికమయ్యే ప్రాంతాలను గుర్తించేందుకు వీలుగా పూర్తిస్థాయి సమాచారాన్ని స్థానిక యంత్రాంగాలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలియజేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
జగనన్న నవ్వులు.. జనాలకు చుక్కలు
-
కూలీ బిడ్డకు 993 మార్కులు
-
ఏ ముఖం పెట్టుకుని రాజధాని రైతులను సీఎం ఓట్లు అడుగుతారు
-
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?