Covid కట్టడికి Lancet సూచనలు!
వైరస్ కట్టడికి లాక్డౌన్ ఎంపిక విధానం ఒక్కటే మార్గం కాదని.. పలు చర్యలతో కూడిన సమగ్ర వ్యూహాన్ని అనుసరించాలని ప్రముఖ అంతర్జాతీయ జర్నల్ ది లాన్సెట్ టాస్క్ఫోర్స్(భారత్) నివేదక అభిప్రాయపడింది.
లాన్సెట్ టాస్క్ఫోర్స్ తాజా నివేదిక
దిల్లీ: దేశంలో కరోనా వైరస్ రెండో దశ ఉద్ధృతి కొనసాగుతున్న వేళ.. దేశవ్యాప్తంగా మరోసారి లాక్డౌన్ విధించడంపై చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో వైరస్ కట్టడికి లాక్డౌన్ ఎంపిక విధానం ఒక్కటే మార్గం కాదని.. పలు చర్యలతో కూడిన సమగ్ర వ్యూహాన్ని అనుసరించాలని ప్రముఖ అంతర్జాతీయ జర్నల్ ది లాన్సెట్ టాస్క్ఫోర్స్(భారత్) నివేదక అభిప్రాయపడింది. దేశంలో కరోనా నియంత్రణకు చేపట్టాల్సిన పలు చర్యలను సూచించిన టాస్క్ఫోర్స్.. లాక్డౌన్ చర్యలకంటే మించి ఆలోచించాలని పునరుద్ఘాటించింది. అయితే, ఆర్థిక పరిణామాలను దృష్టిలో ఉంచుకొని, సమాజంలోని అన్ని వర్గాల వారితో సుదీర్ఘ సంప్రదింపుల అనంతరమే చర్యలకు ఉపక్రమించాలని సూచించింది. ముఖ్యంగా వైరస్ కట్టడికి తీసుకునే చర్యల వల్ల ఆర్థికంగా నష్టపోయే వారికి వివిధ కార్యక్రమాలు, ఇతర రక్షణ కవచాలు ఉన్నాయనే భరోసా కల్పించాలని సూచించింది.
లాక్డౌన్ ఒకే విధానం కాకుండా..!
కరోనా వైరస్ మహమ్మారిని అదుపులోకి తెచ్చేందుకు దేశవ్యాప్తంగా పూర్తి లాక్డౌన్ విధించే ఒకే విధానాన్ని అమలుచేయడం కాకుండా సుదీర్ఘ వ్యూహంతో పలు చర్యలు చేపట్టాలని లాన్సెట్ టాస్క్ఫోర్స్ నివేదిక అభిప్రాయపడింది. ఇందుకు వైరస్ కట్టడికి చర్యలతో పాటు సమన్వయ చర్యలు ఎంతో ముఖ్యమని టాస్క్ఫోర్స్ పేర్కొంది. స్థానికంగా వైరస్ ఉద్ధృతి ఎక్కువగా ఉన్నచోట కఠిన ఆంక్షలు అమలుతోబాటు వైరస్ తీవ్రత తక్కువగా ఉన్నచోట కొంత మినహాయింపు ఇవ్వవచ్చని పేర్కొంది. ప్రస్తుతం క్రియాశీల కేసుల సంఖ్య 30లక్షలు దాటడం ఆరోగ్య వ్యవస్థపై తీవ్ర ఒత్తిడికి కారణమవుతుందని టాస్క్ఫోర్స్ నిపుణుల బృందం అభిప్రాయపడింది.
జోన్ల వారీగా ఆంక్షలు..
చాలా మంది చెబుతున్నట్లు ‘లాక్డౌన్’ అమలు చేయడం సరైన ఎంపిక కాదని భారత్లోని లాన్సెట్ టాస్క్ఫోర్స్ అభిప్రాయపడింది. ఒక్కో వారంలో వైరస్ తీవ్రత, పాజిటివిటీ రేటు, మరణాల సంఖ్యను పరిగణనలోకి తీసుకొని స్థానిక జోన్లుగా విభజించాలని పేర్కొంది. పాజిటివిటీ రేటు 2శాతం కంటే తక్కువగా ఉన్న ప్రాంతాలను ‘తక్కువ ప్రమాదం’ ఉన్న జోన్లుగా ప్రకటించాలి. ఈ ప్రాంతాల్లో అన్ని రకాల వ్యవస్థలు 50శాతం సామర్థ్యంతో పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలి. ఇక 5నుంచి 10శాతం పాజిటివిటీ, ఐసీయూ పడకల వినియోగం 40 నుంచి 80శాతం ఉన్న ప్రాంతాలను ‘మధ్యస్థ ప్రమాదం’ ఉన్న ప్రాంతాలుగా ప్రకటించాలి. ఇక్కడ మరిన్ని ఆంక్షలతో వైరస్ కట్టడి చర్యలు చేపట్టాలి. ఇక పాజిటివిటీ రేటు 10శాతం కన్నా ఎక్కువగా ఉన్న ప్రాంతాలను హాట్స్పాట్ జోన్లుగా ప్రకటించాలి. ఈ జోన్లలో విద్యాసంస్థల వంటి వాటిని పూర్తిగా మూసివేయాలి. ఇక దుకాణాలు, రెస్టారెంట్లు, కార్యాలయాలు, ప్రార్థనా మందిరాలు, ఫ్యాక్టరీలను 6 నుంచి 10వారాల వరకు మూసివేయాలి అని టాస్క్ఫోర్స్ సూచించింది. ఈ జోన్లలో వైరస్ సోకిన వారికి సన్నిహితంగా మెలిగిన వారందరికీ ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయాలని స్పష్టంచేసింది.
వైద్య సదుపాయల సన్నద్ధత..
కరోనా విలయతాండవం చేస్తోన్న వేళ.. వేల మంది ప్రజల ప్రాణాలను రక్షించడమే ప్రథమ ప్రాధాన్యత అని లాన్సెట్ నిపుణుల బృందం స్పష్టం చేసింది. ప్రస్తుతం స్వల్ప, మధ్య స్థాయి తీవ్రత ఉన్న ప్రాంతాల్లో వైరస్ కట్టడి సన్నద్ధతకు ఇంకా సమయం ఉందని పేర్కొంది. ఆయా ప్రాంతాల్లో వైరస్ మరింత ప్రబలితే ఎదుర్కోవడానికి వైద్య సిబ్బంది, ఇంటర్న్షిప్లతో పాటు స్థానికులను సిద్ధం చేయాలని సూచించింది. ముఖ్యంగా జిల్లా స్థాయి ఆసుపత్రుల ప్రాంగణంలోనే ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది. దాదాపు 12 అంశాలను ప్రముఖంగా ప్రస్తావించిన లాన్సెట్ టాస్క్ఫోర్స్ వైరస్ కట్టడికి మరికొన్ని సూచనలు చేసింది.
* 10 మంది కంటే ఎక్కువగా హాజరయ్యే అన్ని కార్యక్రమాలపై పూర్తి నిషేధం విధించాలి.
* అలాంటి సమూహాలుగా ఏర్పడే అవకాశమున్న అన్ని కేంద్రాలు, వేదికలను మూసివేయాలి.
* ఉద్ధృతి ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోని ఇండోర్ప్రదేశాలు, పాఠశాలలు, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్, ప్రార్థనా మందిరాలను మూసివేయాలి
* జీనోమ్ సీక్వెన్స్ పరీక్షలను 5శాతానికి పెంచాలి. ఈ సమాచారాన్ని అన్ని జిల్లాలకు అందించాలి. తద్వారా కొత్త రకం వైరస్ల వ్యాప్తిని తగ్గించవచ్చు
* దేశీయ ప్రయాణాలపై ఆంక్షలు వద్దని లాన్సెట్ టాస్క్ఫోర్స్ స్పష్టం చేసింది. ముఖ్యంగా పేదలు వినియోగించే రైలు, రోడ్డు మార్గాలపై ఆంక్షలు వద్దని పేర్కొంది. ఇదే సమయంలో బస్టాండులు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాల్లో ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టుల ద్వారా పరీక్షలు నిర్వహించాలని సూచించింది.
* రాష్ట్రాల మధ్య ప్రయాణం సాగించే వారికి ఆర్టీ-పీసీఆర్ నెగటివ్ రిపోర్టు ఉండాలని సిఫార్సు చేయడం లేదని టాస్క్ఫోర్స్ పేర్కొంది. వీటి ద్వారా అనవసరంగా కొవిడ్ పరీక్షా కేంద్రాలపై ఒత్తిడి పెరుగుతుందని అభిప్రాయపడింది. అంతేకాకుండా ప్రయాణ సమయంలో వైరస్ సోకే ప్రమాదాన్ని ఇవి తగ్గించలేవని పేర్కొంది.
* ఇంటినుంచి బయటకు వచ్చే ప్రతిఒక్కరికి మాస్కు తప్పనిసరి చేయాలి
* వైరస్ ఉద్ధృతిపై నమ్మకమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించాలి. తద్వారా అధికారులు నిర్ణయం తీసుకోవడం సులువవుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
పశ్చిమ్ బెంగాల్ అధికార పార్టీ టీఎంసీపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) తీవ్ర విమర్శలు చేశారు. అవినీతి ఆరోపణలు గుప్పించారు. -
‘చొరబాటుదారు’ వ్యాఖ్యలు.. మోదీపై ఫిర్యాదును పరిశీలిస్తున్నామన్న ఈసీ..!
ఇటీవల ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ (Modi) చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. వాటిపై అందిన ఫిర్యాదు ఈసీ పరిశీలనలో ఉందని సమాచారం. -
కేజ్రీవాల్, కవిత జ్యుడీషియల్ కస్టడీ మళ్లీ పొడిగింపు
దిల్లీ మద్యం కేసులో అరెస్టయిన సీఎం అరవింద్ కేజ్రీవాల్, భారాస ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని కోర్టు మరోసారి పొడిగించింది. -
నూడుల్స్లో రూ.6 కోట్ల బంగారం, వజ్రాలు!
నూడుల్స్లో వజ్రాలు, బంగారం దాచి అక్రమ రవాణాకు పాల్పడిన నలుగురు ప్రయాణికులను ముంబయి కస్టమ్స్ అధికారులు అరెస్టు చేశారు. -
జైల్లో కేజ్రీవాల్కు ఇన్సులిన్.. మరి ఇప్పుడు ఎందుకు ఇచ్చారన్న ఆప్
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు సోమవారం రాత్రి జైల్లో ఇన్సులిన్ అందజేసినట్లు ఆప్ ప్రకటించింది. -
అంకుల్.. మా బడిని ఇలా చేశారేంటి?
పోలింగ్ విధులకు వచ్చి.. పాఠశాలను అపరిశుభ్రం చేసిన అధికారులను ఉద్దేశించి ప్రశ్నలు సంధించిన ఓ చిన్నారి వీడియో తమిళనాట వైరల్ అవుతోంది. -
మరో ఐదురోజులు భగభగలు.. ఐఎండీ వెల్లడి
దేశంలోని పలు ప్రాంతాల్లో మరో ఐదు రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు కొనసాగొచ్చని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం తెలిపింది. -
30 వారాల గర్భవిచ్ఛిత్తికి అనుమతి
అత్యాచారానికి గురై గర్భం దాల్చిన 14 ఏళ్ల బాలిక కేసులో సుప్రీంకోర్టు అసాధారణ నిర్ణయం తీసుకుంది. బాలిక సంక్షేమం, భవిష్యత్తుకు అత్యధిక ప్రాధాన్యమిస్తూ దాదాపు 30 వారాల ఆమె గర్భాన్ని తొలగించేందుకు అనుమతించింది. -
సీయూఈటీ-యూజీ, నెట్ స్కోర్ల నార్మలైజేషన్ ఎత్తివేత : యూజీసీ
కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ -యూజీ, నేషనల్ ఎలిజిబులిటీ టెస్ట్ (నెట్) స్కోర్ల నార్మలైజేషన్ (సాధారణీకరణ)ను ఈ ఏడాది నుంచి ఎత్తివేస్తున్నట్లు యూజీసీ చీఫ్ జగదీప్ కుమార్ తెలిపారు. -
అభిషేక్ బెనర్జీ ఇంటి ముందు రెక్కీ
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, టీఎంసీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ ఇంటిముందు రెక్కీ నిర్వహించాడన్న కారణంతో ఓ నిందితుడిని కోల్కతా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
బెంగాల్ పాఠశాలల్లో 25 వేల నియామకాలు రద్దు
పశ్చిమ బెంగాల్లో ప్రభుత్వ ప్రాయోజిత, ఎయిడెడ్ పాఠశాలల్లో నియామకాల కోసం 2016లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఎంపిక పరీక్ష (ఎస్ఎల్ఎస్టీ)పై కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. -
కేజ్రీవాల్కు ఇన్సులిన్పై మెడికల్ బోర్డు ఏర్పాటు చేయండి
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు గల మధుమేహ వ్యాధికి ఇన్సులిన్ ఇవ్వాల్సిన అవసరముందా? లేదా? అని తేల్చేందుకు మెడికల్ బోర్డును ఏర్పాటు చేయాలంటూ ఎయిమ్స్ డైరెక్టర్ను దిల్లీ కోర్టు సోమవారం ఆదేశించింది. -
2జీ స్పెక్ట్రమ్పై 2012 తీర్పును సవరించండి
వేలం ద్వారా మాత్రమే 2జీ స్పెక్ట్రమ్ కేటాయింపులు, బదిలీలు జరగాలంటూ 2012లో వెలువరించిన తీర్పును సవరించాలని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. -
ఎన్నికలకు ఎండల దెబ్బపై ఆందోళన వద్దు
లోక్సభ రెండోదశ ఎన్నికలకు ఎండల దెబ్బపై పెద్దగా కలవరపడాల్సిందేమీ లేదని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం కేంద్ర ఎన్నికల సంఘానికి తెలిపింది. -
‘దివ్యాంగుల హక్కుల చట్టం అమలు అత్యంత దారుణం’
దివ్యాంగుల హక్కుల చట్టం-2016ను అమలు చేయడంలో జరుగుతున్న జాప్యంపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. -
‘హైస్కూల్ తర్వాతే లా ప్రాక్టీస్ చేస్తే పోలే’
12వ తరగతి తర్వాత అయిదేళ్లు చదవాల్సిన ఎల్ఎల్బీ కోర్సును మూడేళ్లకు తగ్గించడంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు ఓ నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఆదేశాలు జారీచేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. -
ఎన్కౌంటర్ మృతులపై రివార్డు రూ.1.85 కోట్లు
ఛత్తీస్గఢ్ రాష్ట్రం కాంకేర్ జిల్లాలో ఇటీవల జరిగిన ఎన్కౌంటర్లో సుమారు 29 మంది వివిధ క్యాడర్లకు చెందిన మావోయిస్టు నేతలు మృతి చెందిన సంగతి తెలిసిందే. -
అది బెయిల్ షరతుల ఉల్లంఘనే
లఖింపుర్ ఖేరి హింస ఘటనలో నిందితుడైన ఆశిష్ మిశ్ర రాజకీయ కార్యక్రమాలకు స్వయంగా హాజరైతే అది బెయిల్ నిబంధనల ఉల్లంఘనేనని సుప్రీం కోర్టు సోమవారం వ్యాఖ్యానించింది. -
మీది ఉక్కు సంకల్పం
భారత్కు సంబంధించి ధైర్యం, పట్టుదల, సంకల్పానికి సియాచిన్ రాజధానిగా ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. -
దిల్లీ డంపింగ్ యార్డులో భారీ అగ్ని ప్రమాదం
దేశ రాజధాని దిల్లీలోని గాజీపుర్ డంపింగ్ యార్డులో భారీ మంటలు చెలరేగి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. -
అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయానికి తొలి మహిళా వీసీ
వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ప్రఖ్యాత అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయం (ఏఎంయూ) ఉప కులపతి (వీసీ)గా నయీమా ఖాతూన్ నియమితులయ్యారు.
తాజా వార్తలు (Latest News)
-
బ్రిటన్కు అక్రమంగా వస్తే రువాండాకే.. అసలేమిటీ బిల్లు?
-
ఓటీపీ రూటు మారితే అలర్ట్.. సైబర్ మోసాలకు చెక్ పెట్టేందుకు కొత్త అస్త్రం!
-
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా
-
నిర్మాతల నుంచి పవన్కల్యాణ్ తీసుకున్న అప్పు ఎంతో తెలుసా?
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
-
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్