Tomato Flu: కేరళ, ఒడిశాలో ‘టొమాటో ఫ్లూ’ కలకలం.. 108మంది చిన్నారులకు వ్యాధి!
భారత్లో ‘టొమాటో ఫ్లూ’ డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. హ్యాండ్, ఫుట్ అండ్ మౌత్ డిసీజ్(HFMD)గా పిలిచే ఈ వ్యాధి కేరళలో ఇప్పటివరకు ఈ వ్యాధి 82మందికి సోకింది........
దిల్లీ: భారత్లో ‘టొమాటో ఫ్లూ’ డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. హ్యాండ్, ఫుట్ అండ్ మౌత్ డిసీజ్(HFMD)గా పిలిచే ఈ వ్యాధి కేరళలో ఇప్పటివరకు ఈ వ్యాధి 82మంది చిన్నారులకు సోకగా, ఒడిశాలో 26మంది ఈ వ్యాధి బారిన పడ్డారు. కాగా ఇదే విషయాన్ని ప్రముఖ ‘ది లాన్సెట్’ జర్నల్ ప్రస్తావించింది. మే 6వ తేదీ నుంచి ఇప్పటివరకు కేరళలో 82మందికి ఈ వ్యాధి సోకిందని, వారంతా ఐదేళ్లలోపు పిల్లలేనని వెల్లడించింది. ‘కరోనా నాలుగో వేవ్తో సతమతమవుతున్న సమయంలో భారత్లోని కేరళలో టొమాటో ఫ్లూ లేదా టొమాటో జ్వరం అనే కొత్త వైరస్ పుట్టుకొచ్చింది’ అని లాన్సెట్ రెస్పిరేటరీ జర్నల్ పేర్కొంది. కేరళలో ఈ కేసులు పెరుగుతుండటంతో సమీపంలోని తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయని తెలిపింది.
ఒడిశాలోనూ 26 మంది చిన్నారుల్లో (1-9ఏళ్ల లోపువారు) ఈ ఫ్లూను గుర్తించినట్లు భువనేశ్వర్లోని ప్రాంతీయ వైద్య పరిశోధన కేంద్రం వివరాలు వెల్లడిస్తున్నాయని ది లాన్సెట్ పేర్కొంది. ఈ రెండు రాష్ట్రాల్లో కలిపి మొత్తంగా 108 కేసులు నమోదైనట్లు వెల్లడవుతోంది. కాగా కేరళ, ఒడిశా, తమిళనాడు మినహా మరే రాష్ట్రంలోనూ ఈ కేసులు బయటపడలేదని లాన్సెట్ స్పష్టం చేసింది.
పేగు సంబంధిత వ్యాధి కారణంగా సోకే ఈ టొమాటొ ఫ్లూగా ఓ అంటువ్యాధి. ముఖ్యంగా చిన్నారుల్లోనే ఇది వ్యాపిస్తుంది. వయోజనులకు దీన్ని తట్టుకునే రోగనిరోధక శక్తి ఉండటం వల్ల వారిపై ఈ వ్యాధి ప్రభావం చూపదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. ఈ వ్యాధి సోకిన చిన్నారులకు జ్వరం, నోట్లో పుండ్లు, చేతులు, కాళ్లు, పిరుదులపై దద్దుర్లు వంటి లక్షణాలు ఉంటాయి. శరీరంపై ఎర్రగా నీటి బుడగల్లాగా ఏర్పడి, టొమాటో అంత పరిమాణంలో పెరిగిపోతాయి కాబట్టి ఈ వ్యాధికి ‘టొమాటో ఫ్లూ’ అని పేరు పెట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా దగ్గర అంత డబ్బు లేదు.. అందుకే పోటీ చేయట్లేదు: నిర్మలా సీతారామన్
ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవసరమైన నిధులు తన వద్ద లేవని.. అందుకే పార్టీ ప్రతిపాదనను తిరస్కరించానని ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. -
26/11 హీరో సదానంద్ వసంత్ దాటేకు ఎన్ఐఏ పగ్గాలు
కేంద్ర దర్యాప్తు సంస్థ నూతన అధిపతిగా సదానంద్ వసంత్ దాటే నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. -
ఈ మూడు విషయాలే ఆరోగ్యకర జీవన రహస్యం.. డాక్టర్ ఫార్ములా షేర్ చేసిన హర్ష గోయెంకా
ఆరోగ్యకరమైన జీవనానికి ఏం చేయాలో ఓ డాక్టర్ చెబుతున్న సీక్రెట్ ఫార్ములా వీడియోను హర్ష గోయెంకా ఎక్స్లో షేర్ చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్, ముంబయి మ్యాచ్లో నమోదైన రికార్డులివీ..
-
రాశీఖన్నా ‘గోల్డెన్’ మెరుపులు.. అలా చూడొద్దన్న కేతిక.. టీమ్తో కృతి సనన్
-
లీడర్ పిలిస్తే.. జనసేన పార్టీ ప్రచారానికి సిద్ధంగా ఉన్నా: నటి అనసూయ
-
నా దగ్గర అంత డబ్బు లేదు.. అందుకే పోటీ చేయట్లేదు: నిర్మలా సీతారామన్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/03/2024)
-
మాల్దీవుల్లో తాగునీటి కొరత.. టిబెట్ నుంచి 1500 టన్నుల నీరు పంపిన చైనా