వేధింపులకు చట్టాలు ఆయుధాలు కాకూడదు
రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్, ప్రముఖ జర్నలిస్టు అర్ణబ్ గోస్వామి సహా మరో ఇద్దరికి మంజూరు చేసిన మధ్యంతర బెయిల్ను సుప్రీం కోర్టు పొడిగించింది. బాంబే హైకోర్టులో దాఖలైన వ్యాజ్యాన్ని కొట్టివేసే వరకు ఈ పొడిగింపు కొనసాగుతుందని తెలిపింది......
అర్ణబ్కు బెయిల్ పొడిగిస్తూ సుప్రీం కీలక వ్యాఖ్యలు
దిల్లీ: రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్, ప్రముఖ జర్నలిస్టు అర్ణబ్ గోస్వామి సహా మరో ఇద్దరికి మంజూరు చేసిన మధ్యంతర బెయిల్ను సుప్రీం కోర్టు పొడిగించింది. బాంబే హైకోర్టులో దాఖలైన వ్యాజ్యంపై విచారణ జరిగే వరకు ఈ పొడిగింపు కొనసాగుతుందని తెలిపింది. ఈ సందర్భంగా కోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. నేరాలను అరికట్టే చట్టాల పేరిట కొంతమందిని లక్ష్యంగా చేసుకొని వేధించడాన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత న్యాయస్థానాలపై ఉందని గుర్తుచేసింది. జస్టిస్ డీ.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం దీనిపై శుక్రవారం విచారణ జరిపింది.
ఈ సందర్భంగా గోస్వామికి బెయిల్ ఇవ్వడానికి గల కారణాలను ధర్మాసనం పేర్కొంది. చట్టాల దుర్వినియోగాన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత సుప్రీం కోర్టు, హైకోర్టుతో పాటు కింది కోర్టులపై ఉందని వ్యాఖ్యానించింది. లక్షిత వేధింపులకు చట్టాలు ఆయుధాలు కాకుండా చూడాలని హితవు పలికింది. ప్రభుత్వాలు అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నాయని ఎవరైనా ప్రాథమిక ఆధారాలు చూపితే కోర్టులు వాటిని తిరస్కరించలేవని తెలిపింది. పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛను ఒక్కరోజు హరించినా..అది తీవ్రంగా పరిగణించాల్సిన విషయమని వ్యాఖ్యానించింది. బెయిల్ పిటిషన్లను విచారించే విషయంలో కోర్టు నిబంధనల్లో సమూల మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందంది. ప్రాథమిక ఆధారాలను చూస్తే.. అర్ణబ్ గోస్వామిపై నమోదైన తాజా ఎఫ్ఐఆర్లో పేర్కొన్న అంశాలు.. ఆత్మహత్యకు కారకుడిగా పేర్కొనడానికి కావాల్సిన కారణాలకు మధ్య సంబంధమే లేదని ధర్మాసనం తెలిపింది.
నవంబరున 11న అర్ణబ్కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. 2018లో ఆత్మహత్య చేసుకున్న అన్వయ్ నాయక్ అనే ఇంటీరియర్ డిజైనర్.. అర్ణబ్ తనకు బకాయిలు చెల్లించలేదంటూ తన సూసైడ్ నోట్లో పేర్కొన్నారు. ఆ కేసులో ముంబయి పోలీసులు అర్ణబ్ను నవంబరు 4న అరెస్ట్ చేశారు. మరో ఇద్దరిని సైతం అదుపులోకి తీసుకొని 14 రోజుల రిమాండ్కు తరలించారు. బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఆయన బాంబే హైకోర్టును ఆశ్రయించగా అందుకు కోర్టు నిరాకరించింది. ఈ క్రమంలో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ఊరట లభించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
-
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని