ఈ క్రూరత్వానికి ముగింపు పలకండి

జంతువులపై క్రూరత్వానికి ముగింపు పలికేందుకు జోక్యం చేసుకోవాలంటూ సుప్రీంకోర్టు న్యాయవాది మాథ్యూస్‌ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. తమిళనాడులో ఏనుగుకు నిప్పటించిన తాజా ఘటనను ఆ లేఖలో

Updated : 21 Dec 2022 16:47 IST

ఏనుగు మరణంపై సుప్రీంకు లేఖ రాసిన న్యాయవాది

దిల్లీ: జంతువులపై క్రూరత్వానికి ముగింపు పలికేందుకు జోక్యం చేసుకోవాలంటూ సుప్రీంకోర్టు న్యాయవాది మాథ్యూస్‌ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. తమిళనాడులో ఏనుగుకు నిప్పటించిన తాజా ఘటనను ఆ లేఖలో ప్రస్తావించారు. మండుతున్న టైర్ ఒకదాన్ని ఏనుగు మీదకు విసిరేయడంతో అది గాయాలపాలైంది. తరవాత పరిస్థితి విషమించడంతో మరణించింది. ఆ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. 

‘తాజాగా వెలుగులోకి వచ్చిన విషాద ఘటన ప్రతి ఒక్కరిని తీవ్ర ఆవేదనకు గురిచేస్తోంది. ఈ క్రూరత్వానికి ముగింపు పలికేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను’ అని న్యాయవాది మాథ్యూస్ జె నెడుమ్‌పారా ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఏ బాబ్డేకు లేఖ రాశారు. తన అభ్యర్ధనను ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా పరిగణించాలని ఆయన కోరారు. 

నీలగిరి జిల్లా మసినకుడి ప్రాంతంలో జనావాసాల్లో తిరుగుతున్న ఆ ఏనుగును ఈ నెల 19న రిజర్వు ప్రాంతానికి తరలిస్తుండగా మరణించింది. అయితే ఏనుగు చెవి భాగంలో నిప్పుతో చేసిన గాయం ఉండటాన్ని అటవీ శాఖ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో టైరుకు నిప్పు పెట్టి దానిని ఏనుగు మీదకు విసిరే దృశ్యాలకు సంబంధించి వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. దాంతో అధికారులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. 

ఇవీ చదవండి:

విషమంగానే లాలూ..ఎయిమ్స్‌కు తరలింపు!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని