100% Vaccinated: వెల్డన్ మై బాయ్స్!
టీకాలు వేయించుకోవడంలోనూ ఆదర్శంగా నిలిచిన సాయుధ బలగాలు
టీకాలు తీసుకోవడంలో ఆదర్శంగా సాయుధ బలగాలు
ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
‘ముందు మనం ఆరోగ్యంగా ఉంటేనే పది మందికి సాయం చేయవచ్చు...’
- ఈ సూత్రాన్ని భారత సాయుధ బలగాలు తూ.చ. తప్పకుండా పాటిస్తున్నాయి. క్రమశిక్షణలో తమకు తామే సాటి అని మరోసారి రుజువు చేశాయి. 45 ఏళ్లు పైబడిన వారికి, అత్యవసర సేవలందించే వర్గాలకు కేంద్ర ప్రభుత్వం ఉచితంగా టీకా వేస్తోంది. కానీ, చాలా మంది లేనిపోని అపోహలు, మూఢనమ్మకాలతో టీకాకు దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో భారత సాయుధ బలగాలు టీకాలు వేయించుకొని ప్రజలకు ఆదర్శంగా నిలిచాయి. కరోనా నుంచి టీకా రక్షణ లభించిందే తడవుగా బాధితులకు అత్యవసర సేవలు అందించేందుకు రంగంలోకి దిగాయి.
భారత సాయుధ బలగాలకు టీకాలు అందించే కార్యక్రమం విజయవంతంగా సాగుతోంది. ఇప్పటికే 97 శాతం మందికి తొలి డోసు టీకా ఇచ్చారు. 78 శాతం మంది రెండో డోసు టీకా తీసుకున్నట్లు రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. వీటిలో కోస్ట్ గార్డ్, బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ సిబ్బంది ఉన్నారు.
త్రివిధ దళాల్లో ఇలా..
* సైన్యంలోని 13 లక్షల మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో 99 శాతం మందికి తొలి డోసు ఇచ్చేశారు. రెండో డోసు 82 శాతం మందికి పూర్తి చేశారు.
* వాయుసేనలోని రెండు లక్షల మంది ఉండగా.. వంద శాతం మంది తొలి డోసు అందుకున్నారు. 90 శాతం మంది రెండో డోసును పూర్తి చేసుకున్నారు.
* సుమారు లక్ష మంది ఉన్న నావికాదళంలో దాదాపు వంద శాతం మంది తొలి డోసు టీకా తీసుకున్నారు. వీరిలో 70 శాతం మంది రెండో డోసు పూర్తి చేశారు.
బయట ప్రదేల్లో ఉండిపోయిన అతి కొద్దిమంది సభ్యులకు త్వరలోనే టీకాలు ఇవ్వనున్నారు. త్రివిధ దళాల్లో టీకాలు తీసుకున్న వారిలో ఎటువంటి తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్స్ కనిపించలేదు.
44 వేల మందికి కొవిడ్..
టీకాలు రాక ముందు దాదాపు త్రివిధ దళాలు, బీఆర్వో సిబ్బంది, కోస్ట్గార్డ్లో మొత్తం 44 వేలమంది కొవిడ్ బారిన పడ్డారు. వీరిలో 150 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ప్రభుత్వం వీరిని ఫ్రంట్లైన్ వారియర్స్గా పరిగణించి వయసుతో సంబంధం లేకుండా సర్వీస్ ఆస్పత్రుల్లో టీకాలు వేసింది. దీని కోసం కొవిషీల్డ్ టీకాను వాడింది. దీంతోపాటు చాలామంది వెటరన్స్కు టీకాలు వేయించే కార్యక్రమం చేపట్టింది.
రంగంలోకి దళాలు..
తాజాగా దేశంలో పరిస్థితులు చేజారిపోవడంతో దళాలు రంగంలోకి దిగాయి. సైనిక ఆస్పత్రుల్లో సౌకర్యాలను మెరుగుపరచడంతోపాటు, అవసరమైన నగరాలకు సైనిక వైద్యులను పంపించారు. దీంతోపాటు దిల్లీ వంటి ప్రాంతాలకు ప్రాణవాయువు, అవసరమైన ఔషధాల సరఫరాలో దళాలు చురుగ్గా పాల్గొంటున్నాయి.
ఇప్పటివరకు కొవిడ్ చికిత్సకు అత్యవసర సామగ్రి సరఫరాలో వాయుసేన చురుగ్గా వ్యవహరిస్తోంది. ఖాళీ ఆక్సిజన్ ట్యాంకర్లు వేగంగా ఫ్యాక్టరీల వద్దకు చేర్చడంలో సీ-17 గ్లోబ్మాస్టర్ కీలక పాత్ర పోషించింది. అంతేకాదు.. సింగపూర్ నుంచి క్రయోజనిక్ కంటైనర్లను తరలించడంలోనూ ముందు నిలిచింది. వాస్తవానికి అత్యవసరమైతే ఆక్సిజన్ నింపిన కంటైనర్లను తరలించడానికీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. కానీ, వేగంగా మండే స్వభావం కలిగిన ఆక్సిజన్ను విమానాల్లో తరలించడం సాంకేతికంగా అత్యంత ప్రమాదకరం. అందుకే ఇప్పటివరకు ఆ చర్యలను చేపట్టలేదు. దీంతోపాటు ద్వీపాలు, మారుమూల ప్రాంతాలకు కొవిడ్ పరీక్షల కిట్లు, నమూనాలను తరలించడానికి సీ-17 గ్లోబ్ మాస్టర్ పనిచేసింది.
ప్రస్తుతం వాయుసేన వద్ద ఒక్కోటి 70 టన్నుల బరువు మోసే సీ-17గ్లోబ్ మాస్టర్ విమానాలు 11 ఉండగా, 40 టన్నుల బరువు మోసే సామర్థ్యం ఉన్న ఐఎల్-76 విమానాలు 11 ఉన్నాయి. అంతేకాకుండా సీ-130 సూపర్ హెర్క్యూలెస్ విమానాలు 12, ఏఎన్-32 విమానాలు 90 ఉన్నాయి. వీటికి అదనంగా చినోక్ హెలికాప్టర్లూ అందుబాటులో ఉన్నాయి.
సైన్యం సర్వం సిద్ధం: లెఫ్టినెంట్ జనరల్ సీపీ మొహంతి
భారత సైన్యం రవాణ సాధనాలతో ఇప్పటికే రంగంలోకి దిగింది. కొవిడ్ సేవల్లో సైన్యం పాత్రపై లెఫ్టినెంట్ జనరల్ సీపీ మొహంతి ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ‘‘వైద్యమౌలిక వసతులు, వైద్యానికి అవసరమైన వనరుల సమీకరణ, సిబ్బంది, పరికరాల సమకూర్చే విషయంలో భారత సైన్యం కృషి చేస్తుంది. పౌర సేవల్లో లాజిస్టిక్స్, సప్లై చెయిన్ మేనేజ్మెంట్ కొంచెం క్లిష్టమైనవి’’ అని చెప్పారు. అంతేకాదు త్రివిధ దళాలు సంయుక్తంగా కృషి చేయాల్సిన అవసరమూ ఉందన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేదమంత్రాల సాక్షిగా శ్రీకృష్ణుడితో యువతి పెళ్లి
మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో ఓ యువతి చిన్నప్పటి నుంచి తాను ఆరాధించిన శ్రీకృష్ణుణ్ని పెళ్లి చేసుకుంది. -
శరద్ పవార్ వైపు దూసుకొచ్చిన మైక్రోఫోన్!
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ ఓ సభలో మాట్లాడుతుండగా ఆయన వైపు మైక్రోఫోన్ ఒకటి దూసుకురావడం చిన్నపాటి కలకలం రేపింది. -
మామిడిపండ్లను మూడుసార్లే తిన్నా
బెయిల్ కోసం ఉద్దేశపూర్వకంగా చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకుంటున్నానని ఈడీ తనపై చేసిన ఆరోపణలపై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఘాటుగా స్పందించారు. -
మూడు రోజుల్లో తేల్చాలి
ఎన్నికలు సమీపిస్తున్నాయనే ఏకైక సాకుతో సభలు, సమావేశాలు, ఓటరు చైతన్య యాత్రలు, నిరసనలు, ధర్నాలు తదితరాలపై జిల్లా, రాష్ట్ర అధికార యంత్రాంగాలు నిషేధం విధించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. -
నౌకాదళ నూతన అధిపతిగా దినేశ్కుమార్ త్రిపాఠి
నూతన నౌకాదళాధిపతిగా వైస్ అడ్మిరల్ దినేశ్ కుమార్ త్రిపాఠి నియమితులయ్యారు. ఈ నెలాఖర్లో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. -
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
చిన్నపిల్లలు అశ్లీల వీడియోలు చూడటం నేరం కాకపోవచ్చేమో గానీ, పిల్లలను ఉపయోగించి అశ్లీల వీడియోలు తీయడం తీవ్రమైన ఆందోళన కలిగించే విషయమేగాక నేరమని శుక్రవారం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
తిరస్కృత నామినేషన్లపై పిటిషన్ను తోసిపుచ్చిన సుప్రీం
తిరస్కృత నామినేషన్లకు పరిష్కారం నామినేషన్లు దాఖలు చేయడంలోనే ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
‘సైన్స్శక్తి’గా ఎదిగేందుకు భారత్ సిద్ధం
ప్రబల ఆర్థికశక్తిగా ఎదుగుతున్న భారత్.. శాస్త్ర, సాంకేతిక రంగంలోనూ సత్తా చాటేందుకు సిద్ధమవుతోందని ప్రముఖ సైన్స్ వారపత్రిక ‘నేచర్’ పేర్కొంది. -
వివాహేతర సంబంధం విడాకులకు మాత్రమే కారణం.. పిల్లల కస్టడీ మంజూరుకు కాదు
వివాహేతర సంబంధం కారణం చూపి విడాకులు పొందవచ్చు కానీ, పిల్లల కస్టడీని పొందలేరని బొంబాయి హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. -
అభ్యర్థుల మార్కులను వెల్లడించిన యూపీఎస్సీ
సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో అభ్యర్థులు సాధించిన మార్కుల వివరాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) శుక్రవారం విడుదల చేసింది. -
దుబాయ్ ప్రయాణాలు వాయిదా వేసుకోండి
అత్యవసరమేమీ కానట్లయితే దుబాయ్కి, ఇక్కడి నుంచి వేరే దేశాలకు వెళ్లేందుకు భారతీయులు తమ ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని యూఏఈలోని భారత దౌత్య కార్యాలయం సూచించింది. -
స్కూల్లో హెచ్ఎంకు ఫేషియల్ వీడియో తీసిన టీచరుపై దాడి
ఉత్తర్ప్రదేశ్లోని ఉన్నావ్ జిల్లా దండమౌ గ్రామ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సంగీతాసింగ్ పనివేళల్లో ఫేషియల్ చేయించుకున్నారు. -
ఆరోగ్యకర ఆయుర్దాయాన్ని పెంచేందుకు ప్రాజెక్టు
మానవుల ఆరోగ్యకర ఆయుర్దాయాన్ని పెంచేందుకు బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) ఒక ప్రాజెక్టును చేపట్టింది. -
ఓటు స్ఫూర్తిని చాటిన సైలెంట్ విలేజ్
ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేందుకు వైకల్యం అడ్డుకాదని చాటారు జమ్మూకశ్మీర్లోని ధడ్కాహి గ్రామస్తులు. డోడా జిల్లాలోని ధడ్కాహి.. ఉధమ్పుర్ లోక్సభ స్థానం పరిధిలోకి వస్తుంది. -
రోజూ 15 నిమిషాలు వైద్యుడిని సంప్రదించేందుకు అనుమతివ్వండి
తిహాడ్ జైలులో తాను ఇన్సులిన్ వినియోగించేందుకు అనుమతినిచ్చేలా జైలు అధికారులకు ఆదేశాలు ఇవ్వాలంటూ దిల్లీ కోర్టులో కేజ్రీవాల్ అభ్యర్థనను దాఖలు చేశారు. -
ఫిలిప్పీన్స్ చేతికి భారత్ బ్రహ్మోస్
బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూజ్ క్షిపణుల మొదటి బ్యాచ్ను భారత్.. శుక్రవారం ఫిలిప్పీన్స్కు అందజేసింది. -
యోగాగురు రాందేవ్ కేసుల పరిస్థితేంటి?
యోగాగురు రాందేవ్పై నమోదైన ఫిర్యాదుల పరిస్థితిని, ఎఫ్ఐఆర్ వివరాలను సమర్పించాలని బిహార్, ఛత్తీస్గఢ్ ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. -
కోల్కతా హైకోర్టులో న్యాయవాదులు గౌను ధరించాల్సిన అవసరం లేదు
రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో కోల్కతా హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. -
బాలిక 28 వారాల గర్భం తొలగింపుపై వైద్యుల సలహా కోరిన సుప్రీంకోర్టు
అత్యాచార బాధితురాలైన 14 ఏళ్ల బాలిక అభ్యర్థన మేరకు ఆమె 28 వారాల గర్భం తొలగించటానికి అనుమతించే విషయమై సర్వోన్నత న్యాయస్థానం వైద్యుల సలహా కోరింది. -
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
వేసవి రద్దీని తీర్చేందుకు రైల్వేశాఖ సిద్ధమైంది. ఈ సీజన్లో దేశవ్యాప్తంగా 9,111 అదనపు ట్రిప్పులు నడపనున్నట్లు ప్రకటించింది. -
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా? UPSC పరీక్షల మార్కుల షీట్లు విడుదల
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో తొలి 10 మంది టాపర్లు సాధించిన మార్కులు ఇవే..
తాజా వార్తలు (Latest News)
-
2026లో ఇండిగో ఎయిర్ట్యాక్సీలు.. ప్రయాణ సమయం ఎంతో ఆదా
-
రాజీనామా చేయకుంటే ఊరుకోం.. వాలంటీర్లపై వైకాపా నాయకుల ఒత్తిడి
-
శరద్ పవార్ వైపు దూసుకొచ్చిన మైక్రోఫోన్!
-
నిషేధమెక్కడ.. ‘నిషా’దమే.. రక్త మాంసాలతో జగన్ వ్యాపారం
-
పనసపండు గుర్తు ఎక్కడ?.. గందరగోళానికి గురైన ఓటర్లు
-
బాబు సీఎం అయ్యే వరకు పాదరక్షలు ధరించనని..!