Lemon scam: జైలులో నిమ్మకాయల స్కాం.. వెలుగులోకి ఇలా..!
వేసవి తాపం పెరిగిపోతున్న వేళ నిమ్మ ధరలు పెరిగిపోతుండటంతో పంజాబ్లోని ఓ జైలులో నిమ్మకాయల స్కాం వెలుగుచూసింది. ....
జైలు సూపరింటెండెంట్పై వేటు
చండీగఢ్: వేసవి తాపం పెరిగిపోతున్న వేళ నిమ్మ ధరలు పెరిగిపోతుండటంతో పంజాబ్లోని ఓ జైలులో నిమ్మకాయల స్కాం వెలుగుచూసింది. కిలో నిమ్మకాయల ధర మార్కెట్లో దాదాపు రూ.200లకు పైగా పలుకుతుండటంతో ఇదే అదునుగా భావించిన జైలు అధికారులు వాటిని కొనకుండానే కొన్నట్టుగా రికార్డుల్లో చూపించి అడ్డంగా బుక్కైపోయారు. నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్టు తేలడంతో జైలు సూపరింటెండెంట్ గుర్నామ్ లాల్ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కపుర్తలా మోడ్రన్ జైలులో అక్రమాలు జరుగుతున్నట్టు తెలియడంతో జైళ్ల శాఖ ఏడీజీపీ వీరేంద్ర కుమార్ ఈ నెల 1న ఇద్దరు సీనియర్ అధికారుల్ని ఆకస్మిక తనిఖీల కోసం పంపారు. దీంతో అక్కడి రికార్డుల్ని పరిశీలించగా.. కిలో రూ.200 చొప్పున 50 కిలోల నిమ్మకాయలు కొనుగోలు చేసినట్టు గుర్తించారు. అయితే, ఖైదీలు తమకు భోజనంలో నిమ్మకాయలు ఏమీ ఇవ్వడంలేదని ఈ తనిఖీ బృందానికి చెప్పడంతో అసలు విషయం బయటపడింది.
ఈ వ్యవహారంపై పంజాబ్ జైళ్ల శాఖ మంత్రి హర్జోత్ సింగ్ బియాన్స్ ఆగ్రహం వ్యక్తంచేశారు. జైలు సూపరింటెండెంట్పై విచారణకు ఆదేశించారు. దర్యాప్తులో అక్రమాలు వెలుగుచూడటంతో గుర్నామ్ లాల్ను సస్పెండ్ చేసినట్టు ఉన్నతాదికారులు వెల్లడించారు. జైలులో ఖైదీలకు నాసిరకం ఆహారాన్ని ఇవ్వడం, సరిపడా భోజనం పెట్టడంలేదని ఈ తనిఖీ బృందం గుర్తించింది. అలాగే, జైలులో తయారు చేసిన ప్రతి చపాతి 50 గ్రాముల కంటే తక్కువ బరువు ఉండటాన్ని చూస్తుంటే గోధుమ పిండి కూడా పక్కదారి పట్టి ఉండొచ్చని భావిస్తున్నారు. కూరగాయల కొనుగోళ్లకు సంబంధించి కూడా అక్రమాలు జరిగినట్టు అధికారులు తమ నివేదికలో పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
గ్యాంగ్స్టర్ ముక్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్