Mann Ki Baat: భారత ఉత్పత్తులు విశ్వవ్యాప్తం.. ఏడాదిలో రూ.30లక్షల కోట్ల ఎగుమతులు!
స్వదేశీ ఉత్పత్తులను ఎగుమతిని గణనీయంగా పెంచుకుంటోన్న భారత్.. వాటి ప్రాచుర్యాన్ని విశ్వవ్యాప్తం చేసుకుంటోందని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు.
మన్కీబాత్లో ప్రధానమంత్రి మోదీ ఉద్ఘాటన
దిల్లీ: స్వదేశీ ఉత్పత్తుల ఎగుమతిని గణనీయంగా పెంచుకుంటున్న భారత్.. వాటి ప్రాచుర్యాన్ని విశ్వవ్యాప్తం చేసుకుంటోందని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఈ క్రమంలో భారత్ నిర్దేశించుకున్న రూ.30 లక్షల కోట్ల (400 బిలియన్ డాలర్లు) విలువైన ఎగుమతుల మైలురాయిని చేరుకుందన్నారు. ఇది కేవలం ఆర్థికవ్యవస్థకు చెందిన విషయం మాదిరిగానే కనిపించినప్పటికీ.. భారత శక్తి, సామర్థ్యాలకు నిదర్శనమన్నారు. ముఖ్యంగా మన దేశ వస్తువులకు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ పెరుగుతోందని దీని అర్థమని ప్రధాని మోదీ వివరించారు. ఈ మేరకు ప్రతినెలా చివరి ఆదివారం దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించే ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
ఈ-మార్కెట్ ప్లేస్ పేరుతో ప్రభుత్వం వివిధ రకాల ఉత్పత్తుల సేకరణలో చిన్న పారిశ్రామికవేత్తలు కీలకంగా మారారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ‘గతంలో కేవలం పేరున్న వ్యక్తులు మాత్రమే ప్రభుత్వానికి ఉత్పత్తులు అమ్మేవారు. కానీ, ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ-మార్కెట్ప్లేస్ (eMarketplace) పోర్టల్ అందుబాటులోకి రావడంతో ఈ విధానం పూర్తిగా మారిపోయింది. ఏడాది కాలంలోనే వీరి నుంచి రూ.లక్షకోట్ల ఉత్పత్తును ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఇదే నూతన భారత్ స్ఫూర్తి’ అంటూ ప్రధాని మోదీ వివరించారు.
ఇక భారతీయ ఉత్పత్తుల సామర్థ్యాన్ని ప్రశంసించిన ప్రధాని మోదీ.. అందుకు దేశంలోని రైతులు, చేతివృత్తులు, చేనేత కార్మికులు, ఇంజినీర్లతోపాటు ఎంఎస్ఎమ్ఈ రంగంలోని చిన్న పారిశ్రామికవేత్తలే కీలకమన్నారు. వారి కృషి వల్లే రూ.30లక్షల కోట్ల (400 బిలియన్ డాలర్లు) విలువైన ఉత్పత్తులను ఎగుమతి చేసే లక్ష్యాన్ని భారత్ సాధించిందన్నారు. ఇలా భారత ప్రజల శక్తి, సామర్థ్యాలు విశ్వవ్యాప్తం కావడం తనకెంతో గర్వంగా ఉందని ప్రధాని మోదీ సంతోషం వ్యక్తం చేశారు. ఇలా ప్రతి ఒక్క భారతీయుడు స్థానిక గళం (లోకల్ ఉత్పత్తులకు ప్రాధాన్యం) విప్పితే.. ఇదే లోకల్, గ్లోబల్గా మారడానికి ఎంతో సమయం పట్టదన్నారు. తద్వారా భారత ఉత్పత్తుల విలువను మరింత ఇనుమడింపజేయవచ్చని ప్రధాని మోదీ సూచించారు.
ఇదిలా ఉంటే, 2018-19 సంవత్సరానికి గాను దేశీయ ఉత్పత్తుల ఎగుమతుల విలువ 330 బిలియన్ డాలర్లతో రికార్డు సాధించింది. తాజాగా దీనిని అధిగమిస్తూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వీటి విలువ 400 బిలియన్ డాలర్ల మార్కును దాటింది. గతంలో మునుపెన్నడూ లేని విధంగా భారత ఉత్పత్తులు ఈ స్థాయిలో ఎగుమతి కావడం ఇదే తొలిసారి కావడం విశేషం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేటి నుంచి ‘వీఐటీఈఈఈ’ ప్రవేశ పరీక్షలు
వేలూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బీటెక్ కోర్సులో చేరేందుకు వీఐటీ.. ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలను (వీఐటీఈఈఈ) నిర్వహిస్తోంది. -
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
-
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్